పత్తి ధరలకు లభిస్తున్న మద్దతు
18-10-2021 ఈ ఏడాది పంజాబ్లో పత్తి సేద్యం భారీగా విస్తరించినప్పటికీ కీటక సంక్రమణం వలన ఉత్పత్తి కొరవడుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. తద్వారా కనీస మద్దతు ధర ప్రతి క్వింటాలు రూ. 5925 అధిగమించి రూ. 7700 కు చేరింది. భారత పత్తి సంస్థ (సిసిఐ) మరియు భారత పత్తి సమాఖ్య లిమిటెడ్ (ఐసిఎఎల్) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఉత్తరాది రాష్ట్రాలలో మొత్తం పత్తి సేద్యం 17.96 ల.హె. నుండి తగ్గి 16.99 ల.హె.కు పరిమితమైంది. ఇందులో పంజాబ్లో 52 వేల హెక్టార్లు వృద్ధి చెంది 3.03 ల.హె., హర్యాణాలో 49 వేల హెక్టార్లు తగ్గి 6.88 ల.హె., రాజస్తాన్లో 1 ల.హె. తగ్గి 7.08 ల.హె., గుజరాత్లో ఎగువ ప్రాంతంలో 3.44 ల.హె. మరియు దిగువ ప్రాంతంలో 6.64 ల.హె.కు విస్తరించింది.