ప్రస్తుత రబీ సీజన్ లో జనవరి 19 వరకు దేశవ్యాప్తంగా పెసల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5.90 ల.హె. నుండి తగ్గి 4.67 ల.హె.కు పరిమితమైంది. అయితే యాసంగి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉండడంతో సరఫరా నిరవధికంగా కొనసాగగలదు. ఎందుకనగా ప్రస్తుత ఖరీఫ్లో ఉత్పత్తి తగ్గడంతో పెసలు నిల్వ చేసే వ్యాపారులు, రైతులు ధరలు పెరగకపోవడంతో తమ సరుకును నెమ్మదిగా విక్రయిస్తున్నారు. ఇతర అపరాల ధరలు నిలకడగా ఉన్నందున పెసర ధరలలో ఎక్కువగా తగ్గుదలకు అవకాశం లేదు.
ఆంధ్ర ప్రాంతపు సన్న రకం చమ్కీరంగు సరుకు చెన్నై డెలివరి రూ. 7000, మహారాష్ట్ర మొగులె సరుకు రూ. 7000, చమ్కీరూ. 7300 ధరతో వ్యాపారమైంది.
అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 900 డాలర్లు, పొకాకో 980 డాలర్లు, అన్నేశ్వర్ 800 డాలర్లు ప్రతి టన్ను స్థాయిలో నిలకడగా ఉండడంతో
రాజస్తాన్లోని కేక్, మెడతా, సుమేరప్పూర్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో కలిసి 7-8 వేల బస్తాల సరుకు రాబడిపై రూ.5300-6800,
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు