స్థిరంగా కందుల ధరలు
భారతదేశంలో తగ్గిన కందుల ఉత్పత్తితో కందుల ధరలు స్థిరపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 20 డాలర్లు పెరిగి 810 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 100 వృద్ధి చెంది రూ. 6950-7000, గుజరాత్ ప్రాంతం బిడిఎన్-2 కందులు రూ. 7000, ఆంధ్ర ప్రాంతం కందులు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.