ఉత్పత్తి తగ్గడంతో పటిష్ట స్థితిలో కందుల ధరలు
24-01-2022 ఈ ఏడాది దేశంలో కందిపంట విస్తీర్ణం పెరిగినప్పటికీ, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన దిగుబడి తగ్గడం మరియు గత ఏడాది పోలిస్తే నాణ్యత లోపించినందున మిల్లుల కోసం నాణ్యమైన సరుకులకు డిమాండ్ నెలకొన్నది. భారత్ ద్వారా దిగుమతులు పెరిగే అవకాశం ఉండడంతో అంతర్జాతీయ మార్కెట్లో మయన్మర్ లెమన్ మరియు లింక్లీ కందుల ధర 40 డాలర్లు పెరిగి 825 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ధరలు బలోపేతం చెందాయి. స్టాకిస్టులు కూడా అప్రమత్తమవుతున్నారు. అంతేకాకుండా రాబోవు నెల నుండి వినియోగదారుల కోసం పప్పుకు మంచి డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ధరలకు బలం చేకూరింది.