పోటెత్తుతున్న వేరుశనగ రాబడులు

 

09-01-2022

దక్షిణాది రాష్ట్రాలు మరియు గుజరాత్, రాజస్తాన్లోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 5-6 లక్షల బస్తాల వేరుసెనగ రాబడి అయింది. వినియోగ రాష్ట్రాలలో కిరాణా వ్యాపారులు మరియు నూనె మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు పురోగమించడం లేదు. ప్రస్తుతం తెలంగాణలో వారంలో రాబడులు 1.50 లక్షల బస్తాలు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 1 లక్ష బస్తాలు, గుజరాత్లో 2 లక్షల బస్తాలను అధిగమిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల వ్యాపారులు సకాలంలో చెల్లింపులు చేయనందున వ్యాపారం నత్తనడకేసింది. 


తెలంగాణలోని వనపర్తిలో గత వారం 70-80 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000-8200, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 10,500, 70-80 కౌంట్ రూ. 10,900, 60-70 కౌంట్ రూ. 11,400, 60-65 కౌంట్ రూ.11,800, 90-100 కౌంట్ రూ. 10,100, కళ్యాణి రూ. 8900, 

గద్వాలలో 15 -20 వేల బస్తాలు రూ. 7170 -8240, నాణ్యమైన సరుకు హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ హైదరాబాద్ డెలివరి రూ. 11,800, 60 - 70 కౌంట్ రూ. 11,400, 80-90 కౌంట్ రూ. 10,400, 90 -100 కౌంట్ రూ. 10,100, కళ్యాణి రూ. 8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం రవాణా అవుతున్నది.

 మహబూబ్నగర్లో హెచ్ఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 11,300, 90-100 కౌంట్ రూ. 10,400, కళ్యాణి రూ. 8900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో నాణ్యమైన రూ. 6000-7390, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ (విత్తుల కోసం) చెన్నై డెలివరి రూ. 9700-9800, కిరాణా రకం స్థానికంగా రూ. 10,200-10,300,

 కళ్యాణదుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 50-60 వేల బస్తాలు నాణ్యమైన సరుకు రూ. 5800–7000, మీడియం రూ. 5000-5500, నిమ్ము సరుకు రూ. 4500-5000, హెచ్ఐఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రత్యక్ష రూ. 9700 - 9800, మహారాష్ట్ర, చెన్నై కోసం ఎక్స్పోర్టు రకం రూ. 10,000 -10,200, 70-80 కౌంట్ రూ. 10,700 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది.


గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 50-60 వేల బసాలు, దిసా, గోండల్, పాలన్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 60-70 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై కళ్యాణి హెచ్పీఎస్ గింజలు ఓడరేవు డెలివరి రూ. 8600, టిజె-37కొత్త సరుకు 80-90 కౌంట్ రూ. 9000, 50-60 కౌంట్ రూ. 9350, 60-70 కౌంట్ రూ. 9200, పోర్బందర్ డెలివరి రూ.50-55 కౌంట్ రూ.8500, 40-50 కౌంట్ రూ.8550, ముంబై డెలివరి టిజె-37 మరియు 60-70 కౌంట్ రూ. 9100, 50-60 కౌంట్ రూ. 10,400, 60-65 కౌంట్ రూ. 10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజ్కోట్లో వేరుసెనగ రోహిణి 24 నెంబర్ నాణ్యమైన సరుకు రూ. 5400-5500, మీడియం రూ. 5200-5400, యావరేజ్ రూ. 4800-5000, 37-నెంబర్ మీడియం రూ. 5000-5250, యావరేజ్ సరుకు రూ. 4750-5000, నెంబర్-39 బెస్ట్ రూ. 5000-5200, మీడియం రూ. 4500-4700, యావరేజ్ సరుకు రూ. 4200-4500, జి-20 రకం సరుకు రూ. 5500-5700, మీడియం రూ. 5350-5400, యావరేజ్ రూ. 4800-5000 ప్రతి క్వింటాలు మరియు నూనె 10 కిలోలు రూ. 1200-1250, జామ్నగర్లో రూ.1250-1260, ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో కలిసి 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై 4000-5200, 70-80 కౌంట్ తమిళనాడు డెలివరి రూ. 8800, ఆంధ్రప్రదేశ్ డెలివరి రూ. 8700-8850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని బికనీర్లో ప్రతి రోజు 85-90 వేల బసాలు, మెడతా, జైపూర్, జోధ్ పూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 1 లక్ష బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ. 4700-5500, హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ రూ. 7700, 60-70 కౌంట్ రూ. 7600, 50-60 కౌంట్ రూ. 8000-8100, 40-50 కౌంట్ రూ. 8300 ధరతో వ్యాపారమై బీహార్, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, లక్ష్మీశ్వర్, హుబ్లీ, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి గత వారం 50-60 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 6000–8200, నిమ్ము సరుకు రూ. 4000-4500, మీడియం రూ. 5000-5800, చెల్లకేరిలో హెచ్ఎఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 9800, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8400, 70-80 కౌంట్ రూ. 10,000, 90-100 కౌంట్ కొత్త సరుకు రూ. 9700-9800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని కొడుముడి, శేవూరు, దిండివనం, అవలూరుపేట, గుండం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 7000–7400, మీడియం రూ.6000-6500, త్రిచన్డ్లో 1000-1500 బస్తాల వేరుసెనగ గింజల రాబడిపై ప్రతి 240 కిలోలు రూ. 18,300-25,200 మరియు అంగుడిలో 1500 బస్తాల గింజులు 50-60 కౌంట్ రూ. 11,000, 80-90 కౌంట్ రూ. 10,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు