ప్రస్తుత సీజన్లో మే 4 వరకు నాఫెడ్ వారు దేశంలో 16,30,873 టన్నుల శనగలు కొనుగోలు చేయగా, కర్ణాటక నుండి 76,860 టన్నులు, గుజరాత్ నుండి 2,80,867, మహారాష్ట్ర నుండి 5,94,553, ఆంధ్ర నుండి 60,060 టన్నులు, తెలంగాణ నుండి 5,238 టన్నులు, మధ్య ప్రదేశ్ నుండి 5,25,193, ఉత్తరప్రదేశ్ నుండి 4745, రాజస్థాన్ నుండి 38,357 టన్నుల సరుకు కొనుగోలు చేశారు.
ఈ ఏడాది దేశంలో శనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే పెర గడంతో ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ధరతో కొనుగోలు చేసినప్పటికీ, మార్కెట్ ధరలు పెరగడం లేదు. అయితే రెతులు అమ్మకాలు పెరుగుతున్నందున ధరలు స్థిరంగా మారాయి. ఏప్రిల్ 28 వరకు మొత్తం కొనుగోళ్లు 15.36 ల.ట.కు చేరాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 5,74,477 టన్నులు, మధ్య ప్రదేశ్లో 4.74 ల.ట., గుజరాత్లో 2.69 ల.ట., కర్ణాటకలో 75 వేల టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 58,458 టన్నులు మరియు తెలంగాణలో 50,238 టన్నులు కొనుగోలు చేయగా రాజస్తాన్లో 31,315 టన్నుల సరుకు నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయబడింది.
ఈ ఏడాది దేశంలో శనగ ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే 135.40 ల.ట. నుండి స్వల్పంగా పెరిగి 136.30 ల.ట.కు చేరగలదని మార్కెట్ నిపుణుల అంచనా. కనీస మద్దతు ధర రూ. 5335 కు గాను స్వేచ్ఛా విపణిలో తక్కువగా ఉంది. తద్వారా పతనమవుతున్న శనగ ధరలను దృష్టిలో పెట్టుకొని నాఫెడ్చే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. ఏప్రిల్ 20 వరకు మొత్తం కొనుగోళ్లు 11.68 ల.ట.కు చేరాయి. ఇందులో మహారాష్ట్ర నుండి 4.93 ల.ట., మధ్యప్రదేశ్ లో 2.67 ల.ట., గుజరాత్లో 2.23 ల.ట., కర్ణాటకలో 68,268 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 53,623 టన్నులు మరియు తెలంగాణలో 50,238 టన్నులు కొనుగోలు చేయగా రాజస్తాన్లో నత్తనడక సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం 10,839 టన్నులు సరుకు కొనుగోలు చేయబడింది.
గత వారం ఖరీఫ్ సీజన్ లోని ఆరు పంటల మద్దతు ధరలను పెంచుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానంతం ప్రకటించింది. ఇందులో శనగల కోసం ప్రస్తుతం ఉన్న రూ. 5230 నుండి రూ. 105 పెంచి రూ. 5335 ప్రతి క్వింటాలుకు నిర్ధారించింది. శనగ సేద్యం పురోగతిపై గత వారమే రాజస్తాన్ నుండి నివేదిక అందింది. రాబోయే సీజన్ లో బఫర్ నిల్వలకోసం కేంద్ర ప్రభుత్వం కందులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపార వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాయి.
లభించిన సమాచారం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ పంట కోతలతో పాటు శనగ సాగు కూడా ప్రారంభమైంది. అయితే అనేక ప్రాంతాలలో పంట సాగు కోసం మరో నెల సమయం ఉంది. దేశంలో భారీగా సరుకు నిల్వలు ఉన్నందున కొందరు రైతులు శనగల స్థానంలో ధరలు ఆకర్షణీయంగా ఉన్న కుసుమల సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరియు సమృద్ధిగా సరుకు నిల్వలు ఉండడంతో పాటు శనగ పప్పుకు డమాండ్ ఉన్నందున వారం రోజులుగా ధరలు రూ. 50-100 హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.
దేశంలో సమృద్ధిగా నిల్వలు ఉండడంతో పాటు అనుకూల వర్షాల వలన కొత్త సీజన్ లో విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టుల అమ్మ కాలు పెరిగాయి. దీనితో గత వారం ధరలు తగ్గాయి. కొత్త సీజన్ లో స్టాకిస్టులు ముందుకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నందున ధర తగ్గి రూ. 4000-4200 స్థాయిలో ఉండే అవకాశం కలదు. ఎందుకనగా గత మూడు సంవత్సరాలుగా స్టాకిస్టులకు లాభం చేకూరడం లేదు.
లభించిన సమాచారం ప్రకారం శనగల నిల్వలు మరియు నా ఫెడ్ అమ్మకాలను పరిగణలోకి తీసుకుంటే ధరలు ఎక్కువగా పెరిగే అవ కాశం లేదు. అంతే కాకుండా ఈ సారి అనుకూల వర్షాల వలన విస్తీర్ణం పెరగవచ్చు. ప్రభుత్వం సబ్సిడీ ధరతో సరుకు విక్రయించాలని ప్రతిపాదించిన తరు వాత మార్కెట్లో సర ఫరా పెరిగే అవకాశం ఉన్నందున మార్కెట్లో గత వారం దిల్లీలోని లారెన్స్ రోడు వద్ద 100-120 వాహనాల శనగల రాబడి పై రాజస్తాన్ శనగలు రూ. 4800, మధ్యప్రదేశ్ సరుకు రూ. 4850 మరియు ముంబైలో టాంజానియా శనగలు రూ. 4150-4250, సూడాన్ కాబూలి శనగలు రూ.5800-5900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
సీజన్లో దేశంలో శనగల ఉత్పత్తి 137.50 ల.ట.కు చేరినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తమ నాల్గవ ముందస్తు అంచనాలో పేర్కొన్నది. అయితే, దేశంలోని పలు ప్రాంతాలలో అతివృష్టి మరియు కొన్ని ప్రాంతాలలో లోటు వర్షపాతం తగ్గిన ఉత్పత్తి మరియు పెరుగుతున్న వినియోగంతో పాటు తూర్పు ఆస్ట్రేలియాలోని ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశం శనగల ఉత్పత్తిలో ప్రసిద్ధి గాంచినట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం పంట ప్రాథమిక దశలో ఉంది. మున్ముందు పరిస్థితి సానుకూలంగా మారే అవకాశం ఉందని వ్యాపారులు భావిస్తున్నారు. పెరుగుతున్న లానినొ మరియు భారత ధృవాలలో నకారాత్మక శక్తి పెంపొందడం వలన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున దక్షిణ ఆస్ట్రేలియాలోని విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, క్రిస్ ల్యాండ్ మరియు తూర్పు ప్రాంతాలలో మున్ముందు శనగ పంటకు పొంచి ఉన్న ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని దేశీయ మార్కెట్లో దిగజారుతున్న శనగల ధరలకు కళ్లెం పడింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియాలో రైతులు శనగల స్థానంలో ఆవ పంట సాగుకు మొగ్గు చూపడంతో శనగ పంట ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. అయితే భారత్లో సరుకు పుష్కలంగా అందుబాటులో ఉన్నందున ధరలు ఎక్కువగా పెరిగే అవకాశం లేదు. ప్రస్తుతం చిన్న స్టాకిస్టులు తమ సరుకు విక్రయిస్తున్నారు. ఎందుకనగా నీటి వనరులు అందుబాటులో నేప థ్యంలో సోయా పంట కోతల తరువాత శనగ సాగుకు ముందుకు వచ్చే అవకాశం కలదు.
దేశంలో ఈసారి నైరుతి రుతుపవనాల వర్షాలు తగ్గినందున ఖరీఫ్ రాం వెనుకబడింది. ఇందులో మినుములు, కందుల విస్తీర్ణం తగ్గినందున శనగలకు మద్దతు లభిస్తున్నది. ఇదే సమయంలో ధరలపై స్టాకిస్టులు బిగిస్తున్న పట్టు మరియు పప్పు మిల్లుల డిమాండ్తో శనగల ధర ప్రతి క్వింటాలుకురూ. 150-200, కాబూలీ శనగలు రూ. 300 వృద్ధి చెందాయి.
వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది ఉత్పత్తి పెరగడంతోస్టాకిస్టులు ముందుకు రావడం లేదు. నాఫెడ్ శనగల కొనుగోళ్లు ఉన్నప్పటికీ, మహాహారాష్ట్ర మార్కెట్లలో రైతుల సరుకు రూ. 4300-4600 ధరతో వ్యాపార మవుతున్నది. కావున కొందరు స్టాకిస్టులు కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే సరఫరా కూడా వేగంగా పెరుగుతున్నది.2022-23 సంవత్సరం కోసం ప్రభుత్వం శనగలు, కందులు, మినుములు, పెసలు సహా అపరాల ఉత్పత్తి 10 శాతం పెంచి 295 ల.ట., నిర్ధారించడంతో పాటు ప్రస్తుత సీజన్లో ఉత్పత్తి పెరగడంతో స్టాకిస్టులు కొనుగోలు చేయడం లేదు. ఉత్పాదక కేంద్రాలలో రాబడులు పెరగడంతో గత వారం రూ. 75-100 ప్రతి క్వింటాలుకు క్షీణించింది.
దేశంలోని ప్రముఖ ఉద్పాదక రాష్ట్రలలో చిన్న మరియు మధ్య తరగతి రైతుల సరుకు భారీగా రాబడి అవుతున్నందున ధరలు పెరగడంలేదు . సీజన్ ప్రారంభం నుండే మిల్లర్లు అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు రూ. 100-150 హెచ్చుతగ్గులూ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది గ్రామీణ ప్రాంతాలలోని పెద్ద వ్యాపారస్తులు ధరలుతక్కవగా ఉన్నందున సరుకు నిల్వ చేస్తూన్నారు.
రాజస్థాన్, మధ్య ప్రదేశ్, హర్యాణా లాంటి రాష్ట్రాలలో ప్రభుత్వం కనీస మద్దతు ధరతో శనగల కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. నాఫెడ్ వారు ద్వారా. గత వారం గుజరాత్లో 2,25,262 టన్నులు, మహారాష్ట్రలో 1,87,271 టన్నులు, కర్ణాటకలో 44,806 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 15,077 టన్నులతో పాటు దేశంలోని అన్ని ఉత్పాదక కేంద్రాల నుండి సుమారు 4,72,416 టన్నుల సరుకు కొనుగోలు చేశారు. ఎందుకనగా మార్కెట్లలో రైతుల సరుకు మద్దతు ధరలకంటే తక్కువ ధరతో అమ్మకం అవుతున్నది.
దేశంలోని ప్రముఖ శనగల ఉత్పాదక రాష్ట్రాలలో మద్దతు ధరతో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. హర్యాణా మార్కెట్లలో ఏప్రిల్ 1 నుండి మే 15 వరకు రూ. 5230 ధరతో కొనుగోళ్లు ఉండగలవు. రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్లో కొనుగోలు ప్రారంభమయ్యాయి. అయితే మార్కెట్లలో రాబడి అవుతున్న మొత్తం సరుకు అమ్మకం కావడం లేదు. దీనితో ఆంధ్ర మార్కెట్లలో దినసరి 40-50 లారీల సరుకు రాబడిపై కర్నూల్లో జెజె రకం శనగలు రూ. 4625, ఒంగోలు జెజె శనగలు రూ. 4500, కాక్-2 కాబూలీ శనగలు రూ. 6400, డాలర్ శనగలు రూ. 8400 మరియు ఆంధ్ర ప్రాంతం శనగలు ఈరోడ్ డెలివరి రూ. 5050, కర్ణాటక సరుకు రూ. 5100 ధరతో వ్యాపారమైంది.
2021-22 రబీ సీజన్లో అపరాల విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే 1 కోటి 68 లక్షల 20 వేల హెక్టార్ల నుండి 47 శాతం పెరిగింది. పంట కోతలు పూర్తయ్యాయి. ఇందులో రబీ శనగ విస్తీర్ణం 1,14,95,000 హెక్టార్లు ఉంది. కొన్ని ప్రాంతాలలో పంట దిగుబడి మెరుగ్గా ఉంది. విస్తీర్ణంలో 45 శాతం శనగ మరియు సిరిశనగ 17.71 ల.హె.లలో 44 శాతం పంట కోతలు పూర్తయ్యాయి.
దేశంలోని శనగల ఉత్పాదక కేంద్రాలలో కొత్త సరుకు రాబడులు పెరుగుతున్నాయి. అయితే రాబోవు రోజులలో ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లు మరియు హోళి, ఉగాది, వివాహాల సీజన్ కోసం మిల్లర్ల కొనుగోళ్లతో ధరలు ఎక్కువగా తగ్గే అవకాశం లేదు. ఏప్రిల్ నుండి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, హర్యాణాలలో రాబడులు పెరగగలవు. ప్రస్తుతం గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణలలో సరుకు రాబడులు పెరుగుతున్నాయి. తద్వారా ముంబైలో టాంజానియా శనగలు రూ. 4450 – 4475, రష్యా కాబూలీ శనగలు రూ. 4600-4700, సూడాన్ సరుకు రూ. 5000-5250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్, గుజరాత్లో మద్దతు ధరతో కొనుగోలుకు ఆదేశించిన తరువాత శనగల ధరలు మెరగయ్యాయి. ఈ ఏడాది ఉత్పత్తి పెరుగుతున్నందున మే నెల తరువాత ధరలు తగ్గవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఎందుకనగా ఈ ఏడాది మహారాష్ట్ర, గుజరాత్లలో సరఫరా అధికంగా ఉంది. అదే విధంగా పండుగల సీజన్లో ప్రస్తుతం కొనుగోలు చేసిన సరుకు కోసం నాఫెడ్ అమ్మకాలు ఉండగలవు.
దేశంలో శనగల ఉత్పత్తి గణనీయంగా ఇనుమడించినందున మార్కెట్లలో కొత్త సరుకు రాబడులు పోటెత్తుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో మద్దతు ధరతో పోలిస్తే తక్కువ ధరతో వ్యాపారమవుతున్నందున వ్యాపారులు కొత్త సరుకును నిల్వ చేస్తున్నారు. తద్వారా ధరలకు మద్దతు లభిస్తున్నది.