పామాయిల్ సరఫరా పెరగడంతో తగ్గనున్న డిమాండ్
ఏడాది ఏప్రిల్ 29న ఇండోనేషియా తమ పామాయిల్ ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ధర ప్రతి టన్ను 7069 రింగిట్ (1806.71 డాలర్) కు ఎగబాకిందని వ్యాపారులు పేర్కొన్నారు. తద్వారా ఆయిల్ పామ్ పూల గుత్తుల (ఎఫ్ఎఫ్ఎ) కోసం కొనుగోలుదారులు కనుమరుగైనందున పామాయిల్ నిల్వలు పెరిగి 70 ల.ట.కు చేరాయి. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం ఎగుమతులపై ఉన్న ఆంక్షలను మే 24న ఎత్తివేసింది.