వ్యాపారస్తుల కథనం ప్రకారం గత రెండు వారాలుగా దక్షిణ భారతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండడం మరియు భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ పంటకు చీడపీడల బెడద ఉండడంతో పాటు కర్నూలు ప్రాంతంలో వర్షాల వలన నాట్లు వేసిన పంటకు నష్టం చేకూరింది. రాబోవు రోజులలో పంట దిగుబడి తగ్గే అవకాశం ఉండడంతో ఆంధ్రలో నిల్వచేసిన రైతులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. దీనితో గుంటూరు మార్కెట్ యార్డులో కోల్డుస్టోరేజీలనుండి మొత్తం సరుకు రాబడులు ముందువారంతో పోలిస్తే కేవలం 70 శాతం ఉండడంతో పాటు మర ఆడించే యూనిట్లు మరియు ఎగుమతిదారులు కొనుగోళ్లతో ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. ఎందుకనగా, ప్రతి సంవత్సరం ఇదే వ్యవధిలో తెలంగాణా, కర్నాటక మరియు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలలో రాబడులు పెరగడం జరుగుతుంది. అయితే, ఈ ఏడాది ఇంతవరకు రాబడులు పెరగడంలేదు. ఇందుకు ముఖ్యకారణమేమనగా ఎండలు కాయనందున సరుకు ఎండడంలో సమస్యలు ఎదురౌతున్నాయి. దీనివలన మధ్యప్రదేశ్ రైతులకు లాభం చేకూరుతున్నది. ఎందుకనగా, గతవారం బేడియాలో ఆది, బుధ, గురువారాలలో కలిసి 90000-100000 బస్తాల కొత్త సరుకు రాబడి అయినప్పటికీ, ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి.