Posts

Showing posts from 2022

తగ్గిన వాము ఉత్పత్తి

Image
   రాబోయే సీజన్ లో వాము ఉత్పత్తి తగ్గనున్నట్లు సంకేతాలు అందుతున్నందున ధరలు ఇనుమడిస్తున్నాయి. ఈ ఏడాది సరుకు నిల్వలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలతో పంటకు తీరని నష్టం వాటిల్లినందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 40-45 శాతం తగ్గగలదనే విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు రైతులు వాము పంటను పెకలించి ఇతర పంటల సాగు చేపడుతున్నారు.

దిగిరానంటున్న జీలకర్రవాయిదా ధరలు

Image
   చైనా, బంగ్లాదేశ్ నుండి జీలకర్ర కు డిమాండ్ బలహీన పడినప్పటికీ వాయిదా ధరలు తగ్గడం లేదు. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి మరో 4-5 నెలల సమయం ఉంది. సేద్యం ప్రక్రియ మరో 1-2 వారాలలో ప్రారంభం కానున్నది. ప్రస్తుత సీజన్ లో ఉత్పత్తి కుండటుపడినందున సీజన్ ప్రారంభం నుండే ధరలు ఇనుమడిస్తున్నందున పలువురు దిగ్గజ రైతుల సరుకు అమ్మకం కాలేదు. 

వృద్ధి చెందుతున్న పత్తి పంట - అడుగంటుతున్న నిల్వలు

Image
  ప్రపంచంలో అతిపెద్ద పత్తి ఉత్పాదక దేశమైన భారత్ లో అక్టోబర్ 1 నుండి ప్రారంభమైన ప్రస్తుత పత్తి సీజన్ (2022-23) కోసం దేశంలో పత్తి ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 12 శాతం ఇనుమడించి 3.44 కోట్ల బేళ్ల (ప్రతి బేలు 170 కిలోలు) కు చేరగలదని ప్రముఖ పత్తి వ్యాపార సమాఖ్య పేర్కొన్నది. కొత్త సీజన్ మిగులు నిల్వలు గత సీజన్ తో పోలిస్తే 71.80 లక్షల బేళ్ల నుండి తగ్గి 31.90 లక్షల బేళ్లతో ప్రారంభమైంది. 

రబీ మొక్కజొన్నకు పెరుగుతున్న ఆదరణ

Image
 ప్రస్తుత సీజన్ లో అక్టోబర్ 21 నాటికి దేశంలో ముతక ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.45 ల.హె. నుండి పెరిగి 2.45 ల.హె.కు విస్తరించింది. ఇందులో మొక్కజొన్న 43 వేల హెక్టార్ల నుండి 65 వేల హెక్టార్లు, జొన్న 95 వేల హెక్టార్ల నుండి 1.65 ల.హె., రాగులు 5 వేల హెక్టార్ల నుండి 10 వేల హెక్టార్లు మరియు బార్లీ 1000 హెక్టార్ల నుండి పెరిగి 5 వేల హెక్టార్లకు విస్తరించింది. 

ఆముదాల రాబడి

Image
  ఆదోనిలో వారంలో 10-15 వేల బస్తాల కొత్త ఆముదాల రాబడిపె రూ. 5950-6080, గిద్దలూరు, వినుకొండ ప్రాంతాలలో 4 లారీల రాబడిపై రూ. 5900-6000 మరియు కర్నూలు, ఎమ్మిగనూరు తదితర మార్కెట్లలో కలిసి వారంలో 15-20 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై 

పెరుగుతున్న నువ్వుల రాబడులు - విస్తృతమవుతున్న రబీ సేద్యం

Image
   ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్ లలో దినసరి 20 వేల బస్తాల రాబడి అవుతోంది. అయితే ప్రస్తుతం వర్షాల కారణంగా సరుకు నిమ్ముతో పాటు డిస్ కలర్ కావడంతో ధరలు తగ్గి గ్వాలియర్లో 99.1 రకం రూ. 12,800-12,900, హల్లింగ్ రూ. 12,500-12,600, ఆగ్రాలో హళ్లింగ్ సరుకు రూ. 12,400-12,500, కాన్పూర్ లో హళ్లింగ్ సరుకు 12,600-12,800, ముంబైలో తెల్లనువ్వులు సార్టెక్స్ రూ. 13,700, ముంద్రా డెలివరి రూ. 13,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

పెరిగిన శనగల మద్దతు ధర

Image
  గత వారం ఖరీఫ్ సీజన్ లోని ఆరు పంటల మద్దతు ధరలను పెంచుతున్న కేంద్ర మంత్రివర్గ సమావేశానంతం ప్రకటించింది. ఇందులో శనగల కోసం ప్రస్తుతం ఉన్న రూ. 5230 నుండి రూ. 105 పెంచి రూ. 5335 ప్రతి క్వింటాలుకు నిర్ధారించింది. శనగ సేద్యం పురోగతిపై గత వారమే రాజస్తాన్ నుండి నివేదిక అందింది. రాబోయే సీజన్ లో బఫర్ నిల్వలకోసం కేంద్ర ప్రభుత్వం కందులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తున్నదని వ్యాపార వర్గాలు తమ అభిప్రాయం వెల్లడించాయి.

తగ్గిన వేరుశనగ ఉత్పత్తి

Image
  ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వేరుసెనగ విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 5 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 2 ల.హె. మేర తగ్గి నందున ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 38.55 ల.హె. నుండి తగ్గి 30 ల.హె.లకు చేరే అంచనా కలదు. ఎందుకనగా విస్తీర్ణంతో పాటు దిగుబడి కూడా తగ్గుచున్నది. అయితే గుజరాత్ లో మొత్తం విస్తీర్ణం గత ఏడాది సాధారణ స్థాయిలో ఉన్నందున ఉత్పత్తి 30 లక్షల టన్నులు ఉంది. అయితే ప్రతి హెక్టారు సగటు దిగుబడి 2020 కిలోల నుండి తగ్గి 1755 కిలోలు ఉండే అంచనా కలదు.కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర రూ. 5850 ప్రతి క్వింటాలు ఉంది.

పెరిగిన రబీ మినుముల సేద్యం

Image
   దేశంలో రబీ సీజన్ మినుముల సేద్యం ప్రారంభమైంది. అక్టోబర్ 21 నాటికి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 7 వేల హెక్టార్ల నుండి పెరిగి 13 వేల హెక్టార్లకు విస్తరించింది. సేద్యం మరింత విస్తరించగలదు. మినుములు మరియు కందుల ధరలపై ప్రభుత్వ దృష్టి సారించడం వలన ధరల పెరుగుదలకు కళ్లెం పడగలదని వ్యాపారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో ఎసక్యూ 15 డాలర్ తగ్గి 960 డాలర్ మరియు ఎస్ఎ క్యూ 820 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించబడినందున ముంబైలో ఎస్ఎ క్యూ రూ. 7150, చెన్నైలో రూ. 7000, ఎ క్యూ రూ. 8100, కోల్ కతాలో ఎస్ఎ క్యూ రూ. 7200-7350, దిల్లీలో ఎస్ క్యూ రూ. 8500, ఎస్ఎ క్యూ రూ. 7350 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తగ్గిన కందుల సేద్యం

Image
   ప్రముఖ పప్పు ధాన్యాల ఉత్పాదక ప్రాంతమైన మధ్య భారత్ లో సెప్టెంబర్-అక్టోబర్ లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో కంది పంటకు నష్టం వాటిల్లినందున ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో కందుల ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 43,40 ల.ట. నుండి తగ్గి 38.90 ల.ట. రాబడి కాగలదనే అంచనా వ్యక్తమవుతున్నది. దేశంలో కందుల వార్షిక ఉత్పత్తి 43.25 ల.ట. ఉండగలదని భావిస్తున్నారు. పప్పు మిల్లులకు సకాలంలో సరుకు అందుబాటులో ఉండాలి. అందుకు భిన్నంగా స్టాకిస్టులు మరియు దిగ్గజ రైతుల అధీనంలో సరుకు నిల్వలు మగ్గుతున్నాయి. 

రికార్డు బద్దలు కొడుతున్న మిరప ధరలు

Image
   లభించిన సమాచారం ప్రకారం వరంగల్ ప్రాంతంలో ఈ ఏడాది 334 రకం మిరప విస్తీర్ణం పెరిగిన నేప ధ్యంలో ఇతర రకాల రాబడులు తగ్గే అంచనా కలదు. లభించిన సమాచారం ప్రకారం విస్తీర్ణం, ఉత్పత్తి అంచనా మరియు నిల్వలను పరిగణలోకి తీసుకుంటే 2022-23 లో మరోసారి ధరలు పెరిగే అంచనా కలదు. వ్యాపారుల అభిప్రాయం ప్రకారం మధ్య ప్రదేశ్ లోని బేడియాలో ఆది, గురు, శనివారాలలో కలిసి 22-25 వేల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. అనగా గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే రాబడులు తగ్గాయి. నిమ్ము రకం సరుకు రాబడులు అవుతున్నందున ఆంధ్ర, తెలంగాణలలో మర ఆడించే యూనిట్లు కొనుగోలుకు ముందుకు వస్తున్నందున నాణ్యమైన వండర్ హాట్ ధర పెరిగి రూ. 38,000 వరకు చేరింది. రాబోవు రోజులలో ధరలు మరింత వృద్ధిచెందే అంచనా కలదు. 

పసుపు నిల్వలు భేష్

Image
   దేశంలోని ప్రముఖ పసుపు ఉత్పాదక రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో సరుకు నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. మసాలా గైండింగ్ యూనిట్ల వద్ద డిసెంబర్ చివరి దాకా సరిపడునంత సరుకు నిల్వలు అందుబాటులో ఉన్నందున ధరలు - పురోగమించే అవకాశం లేదు.ఎన్ సిడి ఇఎక్స్ వద్ద అక్టోబర్ వాయిదా రూ. 7154 తో ప్రారంభమై గురువారం నాటికి రూ. 12 వృద్ధి చెంది రూ. 7156, నవంబర్ వాయిదా రూ. 256 పెరిగి రూ. 7690 వద్ద ముగిసింది. 

హెచ్చుముఖం లో ధనియాల ధరలు

Image
   వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రస్తుత 2021-22 సంవత్సరం రబీ సీజన్ కోసం ఉత్పత్తి తగ్గడంతో ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. దీనితో ఇంతవరకు 80-85 శాతం రైతుల సరుకు అమ్మకమయింది. సీజన్లో నిల్వ అయిన చిన్న వ్యాపారుల 50-60 శాతం సరుకు కూడా అమ్మకమయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వలన సరఫరా తగ్గడంతో మరియు దక్షిణాది రాష్ట్రాలలో పెద్ద రైతులు మరియు మసాలా దినుసుల వ్యాపారులు తమ అవసరానికి అనుగుణంగానే కొనుగోలు చేస్తున్నందున మార్కెట్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అయితే, స్పెక్యులేటర్ల అంచనా ప్రకారం నవంబర్ నుండి జనవరి వరకు మార్కెట్ ధరలు పటిష్టంగా ఉండే అంచనా కలదు. దీనితో గతవారం ఎన్ సిడిఎ లో సోమవారం ధనియాల అక్టోబర్ వాయిదా రూ. 11118 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 410 పెరిగి రూ. 11528, నవంబర్ వాయిదా రూ. 204 పెరిగి రూ. 11318 తో ముగిసింది. ఈ ఏడాది అన్ని ఉత్పాదక మార్కెట్లలో ధనియాల రాబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. దీనితో గత ఏడాది నిల్వలు కూడా నామమాత్రంగా ఉన్నాయి. కొత్త సీజన్ ప్రారంభం కావడానికి దాదాపు 4 నెలల సమయం ఉంది. ఎందుకనగా, అక్టోబర్, నవంబర్ నుండి పంట విత్తడం ప్రారంభమవుతుంది.

మినుములు స్థిరం

Image
   రబీ సీజన్ కోసం మినుమ సేద్యం సమయానికి ముందే ప్రారంభమైంది. గుంతకల్ ప్రాంతంలో మరో నెలలో కొత్త సరుకు రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు. అయితే ప్రస్తుత వర్షాల వలన పంటకు నష్టం చేకూరే పరిస్థితి ఉంది. మహబూబ్ నగర్ ప్రాంతంలో పంటకు అనుకూల వర్షాలు ఉన్నప్పటికీ, రాబోవు రోజులలో వర్షాలు అధికంగా ఉంటే నష్టం చే కూర గలదు. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల గైవిటీ క్లీన్ సరుకు ఆంధ్ర కోసం రవాణా అవుతోంది.

బలోపేతం చెందుదుతన్న మొక్కజొన్న ధరలు

Image
   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రలో తరుచుగా కురుస్తున్న వర్షాలకు ఉత్పాదకులు తమ పంటను ఆరబెట్టడానికి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అడుగంటిన పాత సరుకు నిల్వలు పొట్టీ పరిశ్రమ డిమాండ్ నెలకొన్నందున దరలకు మద్దతు లభిస్తున్నది. దేశంలో ఖరీఫ్ సీజన్ పంట కోతలతో పాటు రబీ సీజన్ సేద్యం ప్రక్రియ ప్రారంభమైందని వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ వారంతపు నివేదికలో పేర్కొన్నది. అక్టోబర్ 14 వరకు మొక్కజొన్న సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 32 వేల హెక్టార్ల నుండి పెరిగి 36 వేల హెక్టార్లు, రాగులు 1000 హెక్టార్లు, జొన్న సేద్యం 42 వేల హెక్టార్ల నుండి తగ్గి 39 వేల హెక్టార్లకు పరిమితమైంది.

పెరిగిన పసుపు వాయిదా ధరలు

Image
   గత వారం ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్రా లాంటి పసుపు ఉత్పా దక రాష్ట్రాలలో వర్షాల కారణంగా రాబడులు తగ్గడంతో పాటు ఎగుమతి డిమాండ్ ఉండడంతో మార్కెట్, వాయిదా ధరలు రూ. 150-200 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. లభించిన సమాచారం ప్రకారం గత రెండు నెలలుగా ధరలు స్థిరంగా ఉండడంతో పసుపు వాయిదా వ్యాపారం చేసేవారి గిరాకీ పెరుగుతున్నది. దీనితో ధర లలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. అయితే మార్కెట్లో సరుకు నిల్వలు ఉన్నాయి. అమ్మకందారులు ధరలు పెరగడాన్ని నిరీక్షిస్తున్నారు. అయితే ఎన్ సిడిఇఎ లో సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 6812 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ. 142 పెరిగి రూ. 6954 మరియు నవంబర్ వాయిదా రూ. 314 పెరిగి రూ. 7424 ధరతో ముగిసింది.

భారీ వర్షాల వలన హెచ్చుముఖంలో మిరప ధరలు

Image
 కర్నాటకలోని బ్యాడ్గి లో గురువారం 100 బస్తాలు, సింధనూరులో 25 బస్తాల కొత్త మిరప రాబడి ప్రారంభమయింది. అయితే, రాబడులు పెరగడానికి ఒక నెల సమయం ఉంది. దక్షిణ భారత కోల్డు స్టోరేజీలలో నిల్వలు వేగంగా తగ్గుచున్నాయి. అయితే, మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ ప్రాంతంలో రాబడులు ప్రారంభమైనప్పటికీ, ప్రస్తుతం మార్కెట్లలో రాబడులు గత ఏడాదితో పోలిస్తే తక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తుల అంచనా ప్రకారం ప్రస్తుతం వర్షాల కారణంగా కర్నూలు, గుంతకల్, అనంతపురం ప్రాంతాలలో పంటకు నష్టం వాటిల్లుతున్నది. గుంటూరు, ప్రకాశం జిల్లాలలో వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలలో నాట్లు వాలిపోయాయి. ఇక ముందు కూడా వర్షాలు కురిసే పరిస్థితి ఉంది. దీనితో అక్టోబర్ -నవంబర్ వరకు నాణ్యమైన రకాల ధర రూ. 1000-1500 వరకు పెరగవచ్చు.

నవంబర్ చివరి నాటికి కొత్త మినుములు

Image
   అంతర్జాతీయ విపణిలో ఎస్ క్యూ 15 డాలర్ తగ్గి 965 డాలర్ మరియు ఎస్ఎక్యూ 830 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించబడింది. ఆంధ్రప్రదేశ్ లో సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున రబీ సీజన్ కోసం గుంతకల్ లో మినుముల సేద్యం ప్రక్రియ ముగిసింది. నవంబర్ చివరి నాటికి ఈ పంట రాబడులు ప్రారంభం కావచ్చని భావిస్తున్నారు. తద్వారా తమిళనాడు వ్యాపారులు అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.

పెరిగిన కొత్త మొక్కజొన్న

Image
 వ్యవసాయ మంత్రిత్వశాఖ వారు జారీ చేసిన నివేదిక ప్రకారం 30, సెప్టెంబర్ వరకు దేశంలో ముతక ధాన్యాల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 175.15 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 183.89 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో మొక్కజొన్న విస్తీర్ణం 82.17 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 84.23 లక్షల హెక్టార్లకు చేరగా, సజ్జ విస్తీర్ణం 63.61 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 69.95 లక్షల హెక్టార్లకు, రాగుల విస్తీర్ణం 9.66 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 9.40 లక్షల హెక్టార్లకు,జొన్న విస్తీర్ణం 14.67 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 14.23 లక్షల హెక్టార్లకు చేరింది. 

Khammam Chilli Market Report As On 07-10-2022

Image
𝐊𝐇𝐀𝐌𝐌𝐀𝐌 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 07-10-2022 🌶️ *(A/C ARRIVAL 5000 BAGS)* TEJA BEST :22000 MEDIUM: 20000/21000 FATKI BEST : 12300

Bediya Chilli Market Report As On 08-10-2022

Image
𝐁𝐄𝐃𝐈𝐘𝐀 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 08-10-2022 🌶️   ARRIWALS - Around 3500 - 4000 Bags 

Guntur Chilli Market Report As On 07-10-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 07-10-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 15000/20,000 BAGS)*

Byadgi Chilli Market Report As On 06-10-2022

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 06-10-2022 🌶️ *A/C ARRIVALS 6000 BAGS SALES APPROX 2500 BAGS*

Guntur Chilli Market Report As On 06-10-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 06-10-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 20,000/25,000 BAGS)*

Bediya Chilli Market Report As On 06-10-2022

Image
𝐁𝐄𝐃𝐈𝐘𝐀 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 06-10-2022 🌶️   ARRIWALS  -  Around  2500 - 3000 Begs 

Byadgi Chilli Market Report As On 03-10-2022

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 03-10-2022 🌶️ *A/C ARRIVALS 5000 BAGS SALES APPROX 2500 BAGS*

Bediya Chilli Market Report As On 02-10-2022

Image
𝐁𝐄𝐃𝐈𝐘𝐀 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 02-010-2022 🌶️   ARRIWALS - Around 8000 - 10000 Begs 

Bediya Market Report As On 01-10-2022

Image
𝐁𝐄𝐃𝐈𝐘𝐀 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 01-10-2022 🌶️   ARRIWALS - 400 - 450 Quintal ( Around 1100 - 1200 Bags )

Warangal And Khammam Chilli Market Report As On 30-09-2022

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-09-2022 🌶️ *AC* *ARRIVALS 2000 TO 3000 BAGS*

Guntur Chilli Market Report As On 30-09-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 30-09-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 40,000/45,000 BAGS)*

Byadgi Chilli Market Report As On 29-09-2022

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-09-2022 🌶️ *A/C ARRIVALS 20000 BAGS SALES APPROX 8000 BAGS*

Guntur Chilli Market Report As On 29-09-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-09-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 50,000/55,000 BAGS)*

Warangal And Khammam Chilli Market Report As On 29-09-2022

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 29-09-2022 🌶️ *AC* *ARRIVALS 6000 BAGS*

Warangal And Khammam Chilli Market Report As On 28-09-2022

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 16-09-2022 🌶️ Cold Arrivals  6000 Bags

Guntur Chilli Market Report As On 28-09-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 28-09-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 60,000/65,000 BAGS)*

Cotton Market Report As On 27-09-2022

Image
  Andhra Pradesh, Telangana, Karnataka Cotton Market Report

Warangal And Khammam Chilli Market Report As On 27-09-2022

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-09-2022 🌶️ *AC* *ARRIVALS 4000 TO 6000 BAGS*

Guntur chilli Market Report As On 27-09-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 27-09-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 50,000/55,000 BAGS)*

Byadgi Chilli Market Report As On 26-09-2022

Image
𝐁𝐘𝐀𝐃𝐆𝐈 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-09-2022 🌶️ *A/C ARRIVALS 30000 BAGS SALES APPROX 10000 BAGS*

Warangal And Khammam Chilli Market Report As On 26-09-2022

Image
𝐖𝐀𝐑𝐀𝐍𝐆𝐀𝐋 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-09-2022 🌶️ *AC* *ARRIVALS 2000 TO 4000 BAGS*

Guntur Chilli Market Report As On 26-09-2022

Image
𝐆𝐔𝐍𝐓𝐔𝐑 𝐂𝐇𝐈𝐋𝐋𝐈 𝐌𝐀𝐑𝐊𝐄𝐓 𝐑𝐄𝐏𝐎𝐑𝐓 26-09-2022 🌶️ *(A/C ARRIVALS APPROX 55,000/60,000 BAGS)*

పెరిగిన ఆముదాల ధరలు

Image
   ఈ ఏడాది ఆముదాల సేద్యం గణనీయంగా విస్తరించినప్పటికీ ధరలు ఎగబాకుతూనే ఉన్నాయి. ఎందుక న గా, ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలైన గుజరాత్, రాజస్తాన్ లో రైతులు సరుకు పూర్తిగా హరించుకుపోవడమే ఇందుకు నిదర్శనం. అక్టోబర్ లో ఎగుమతి డిమాండ్ నెలకొనే అంచనాతో ఎన్ సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 7414 తో ప్రారంభమై శుక్రవారం నాటికి రూ. 74 ఎగబాకి రూ. 7488, నవంబర్ వాయిదా రూ. 144 వృద్ధి చెంది రూ. 7490 వద్ద ముగిసింది.

బఠాణిలు

Image
    ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఖరీఫ్ పంట కోతలు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా రబీ సీజన్ కోసం దీపావళి నాటికి బఠానీల సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విస్తీర్ణం కూడా పెరగవచ్చు.

పెసలు

Image
 రాజస్థాన్ లోని పెసల ఉత్పాదక కేంద్రాల వద్ద ముమ్మరంగా పంట కోతలు కొనసాగుతున్నాయి. దీనితో గత వారం రోజులుగా ప్రతి రోజు 30-32 వేల బస్తాల కొత్త పెసలు రాబడి కాగా,జాతీయ స్థాయిలో విస్తీర్ణం తగ్గడంతో పాటు అనేక ఉత్పాదక కేంద్రాలలో వర్షాల వలన పంటకు నష్టం చేకూరింది. అంతేకా కుండా అక్టోబర్ 17 నుండి ఛత్తీస్ ఘడ్ లో ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాను న్నాయి. ఇతర రాష్ట్రాలలో కూడా ప్రభుత్వ ఏజెన్సీల కొనుగోళ్లకు అవకాశం ఉండ డంతో పాటు కందుల ధరలు పటిష్టంగా మారడంతో పెసర పప్పుకు డిమాండ్ పెరుగుతోంది. స్టాకిస్టుల కొనుగోళ్లతో కూడా ధరలు బలోపేతం చెందుతు న్నాయి.వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి తాజా నివేదిక ప్రకారం దేశంలో 23 సెప్టెంబర్ నాటికి పెసర పంట సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 34.71 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 33.37 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో గుజరాత్ లో విస్తీర్ణం 98,643 హెక్టార్ల నుండి తగ్గి 79,863 హెక్టార్లకు, మిటుకుల విస్తీర్ణం 13,094 నుండి పెరిగి 14,262 హెక్టార్లకు చేరింది.

శనగ సాగు ప్రారంభం

Image
   లభించిన సమాచారం ప్రకారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మరియు దక్షిణాంధ్రలోని కొన్ని ప్రాంతాలలో ఖరీఫ్ పంట కోతలతో పాటు శనగ సాగు కూడా ప్రారంభమైంది. అయితే అనేక ప్రాంతాలలో పంట సాగు కోసం మరో నెల సమయం ఉంది. దేశంలో భారీగా సరుకు నిల్వలు ఉన్నందున కొందరు రైతులు శనగల స్థానంలో ధరలు ఆకర్షణీయంగా ఉన్న కుసుమల సాగుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరియు సమృద్ధిగా సరుకు నిల్వలు ఉండడంతో పాటు శనగ పప్పుకు డమాండ్ ఉన్నందున వారం రోజులుగా ధరలు రూ. 50-100 హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి.

తగ్గిన కందుల సేద్యం - తగ్గనున్న ఉత్పత్తి

Image
   ఈసారి కందుల సేద్యం తగ్గినట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించగా, వ్యాపారులు కూడా ఇందుకు ఏకీభవిస్తూ కందుల ఉత్పత్తి ప్రభుత్వ అంచనాతో పోలిస్తే రెట్టింపు పరిమాణం తగ్గగలదని తమ అభిప్రాయం వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టనున్న కొనుగోళ్లు 25 శాతం నుండి పెంచి 40 శాతం నిర్ధారించింది. ఇలాంటి పరిస్థితులలో సరఫరా తగ్గగలదని భావిస్తున్నారు. దేశంలో తగ్గిన మొత్తం పప్పు ధాన్యాల సేద్యం మరియు పంటలకు వాటిల్లిన నష్టంతో రాబోయే సీజన్లో కందిపప్పు, పెసరపప్పు ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించడం తథ్యమని చెప్పవచ్చు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో పప్పు ధాన్యాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 48.22 ల.హె. నుండి తగ్గి 46.04 ల.హె.కు పరిమితమైందని కేంద్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. ఉత్పత్తి తగ్గే అంచనా వ్యక్తమవుతున్నందున డాలర్ తో పోలిస్తే బలహీనపడిన రూపాయి రూ. 81 దిగజారినందున దిగుమతి వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది.

కొత్త సీజన్లో పత్తి మందగమనం

Image
 ఈ ఏడాది దేశంలో పత్తి లభ్యత తగ్గినందున దాదాపు సగం నూలు మిల్లులు మూత పడినందున ఆందోళనకు గురవుతున్న కేంద్ర సర్కారుకు ఊరట లభించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, విస్తరించిన పత్తి సేద్యం, సానుకూల వాతావరణం వలన 2022-23 (అక్టోబర్-సెప్టెంబర్) సీజన్లో ఉత్పత్తి 15 శాతం వృద్ది చెందగలదనే సంకేతాలు అందుతుండడమే ఇందుకు నిదర్శనం. ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో ఇప్పటి వరకు పత్తి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 120.55 ల.హె. నుండి పెరిగి 1.28 ల.హె. విస్తరించింది. 

కొత్త మినుములకు గిరాకీ

Image
  హైదరాబాద్ - మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్ లాంటి ఉత్పాదక రాష్ట్రా లలో కొత్త మినుముల రాబడులు పెరుగుతున్నాయి. కాగా, మిల్లర్ల కొనుగోళ్లతో పాటు ఉత్పత్తి తగ్గే అంచనాతో స్టాకిస్టులు కూడా అప్రమత్తమౌతున్నారు. దీనితో కొత్త మినుము లకు గిరాకీ నెలకొనడంతో ధరలు బలోపేతం చెందాయి. 

దూసుకుపోతున్న వేరుశనగ ధరలు

Image
   ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో సెప్టెంబర్ 23 నాటికి దేశంలో నూనెగింజల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 49.15 ల.హె. నుండి తగ్గి 45.53 ల.హె.కు పరిమితమైంది. ఇందులో గుజరాత్ వేర సెనగ సేద్యం 19,09,678 హెక్టార్ల నుండి తగ్గి 17,09,023 హెక్టార్లకు పరిమితం కాగా రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ లో రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటవుతున్నందున సేద్యం భారీగా వృద్ధి చెందింది.

సజ్జలు,బొబ్బర్లు,ఉలువలు

Image
  ముతక ధాన్యాలు సజ్జలు : ఈ ఏడాది రాజస్తాన్ లో సజ్జల సేద్యం భారీగా విస్తరించింది. మరో - రెండు మూడు వారాలలో రాబడులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత క్షీణించగలదని రైతులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.