సజ్జలు,బొబ్బర్లు,ఉలువలు

 

ముతక ధాన్యాలు

సజ్జలు : ఈ ఏడాది రాజస్తాన్ లో సజ్జల సేద్యం భారీగా విస్తరించింది. మరో - రెండు మూడు వారాలలో రాబడులు ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.అయితే, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు పంట నాణ్యత క్షీణించగలదని రైతులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొన్నది.


ఆంధ్రప్రదేశ్ లోని ఆత్మకూరులో 1500 బస్తాల కొత్త సజ్జల రాబడిపై రూ. 1700-1800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పౌల్టీ పరిశ్రమ కోసం రవాణా - అవుతున్నది. బద్వేలు, డోన్ ప్రాంతాలలో ప్రతి రోజు 10-15 వాహనాల సజ్జల - రాబడిపై రూ. 1800, నమక్కల్ డెలివరి రూ. 2000, కర్ణాటకలోని బళ్లారి, కుస్తగిలో - ప్రతి రోజు 5-6 వేల బస్తాల సజ్జల రాబడిపై రూ. 1600-1700 ప్రతి క్వింటాలు  ధరతో వ్యాపారమైంది.

బొబ్బర్లు : కర్ణాటకలోని మైసూరులో బొబ్బర్లు రూ. 5650-5700, నాణ్యమైన ' సరుకు రూ. 5850-6100, తడిసిన సరుకు రూ. 5300-5400, కుస్తగిలో 500 బస్తాలురూ. 5700-6100, ఆంధ్రప్రదేశ్ లోని రాయచోటిలో నిల్వ అయిన నల్లబొబ్బర్లు రూ. 6500, ఎరుపు రూ. 5000, తెలుపు రూ. 5500, పొదిలిలో - 5400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఉలువలు : ఆంధ్రప్రదేశ్ లోని కడప, - రాయచోటి ప్రాంతాలలో ఉలువల సేద్యం ప్రారంభమైంది. రాయచోటిలో రైతులసరుకు రూ. 5600, ఎసి సరుకు రూ. 6000, విజయనగరం, సాలూరు - ప్రాంతాలలో తెల్ల ఉలువలు రూ. 6000, నలుపు రకం రూ. 5850, కర్ణాటకలోని మైసూరు స్థానిక మార్కెట్లలో రూ. 6100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog