Posts
Showing posts from February, 2022
బెల్లం ఉత్పత్తి పెరిగినప్పటికీ భవిష్యత్తుకు డోకా లేదు
- Get link
- Other Apps
గత వారం దేశంలోని బెల్లం ఉత్పాదక కేంద్రాల వద్ద రాబడులు పోటెత్తి ఉత్తర ప్రదేశ్, హర్యాణా, మధ్య ప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు ఒడిశ్శాలోని అన్ని ఉత్పాదక కేంద్రాల వద్ద కలిసి 900-1000 వాహనాల బెల్లం రాబడి అయినట్లు వ్యాపారులు తమ అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ధరలు తమ స్థానాన్ని పదిలపరచుకున్నాయి. ఎందుకనగా, ఈసారి ఉత్తరప్రదేశ్లో ఉత్పత్తి తగ్గినందున అన్ని రాష్ట్రాల స్టాకిస్టులు ఒంటికాలిపై లేచారు.
దిగజారుతున్న ఆముదాల ధరలు
- Get link
- Other Apps
2021-22 లో ఆముదాల సేద్యం 2020-21 తో పోలిస్తే 8.26 ల.హె. నుండి తగ్గి 8.11 ల.హె.కు పరిమితమైందని ప్రభుత్వం పేర్కొన్న గణాంకాల ద్వారా తెలుస్తోంది. పంట దిగుబడులు వృద్ధి చెందే అంచనాతో ఉత్పత్తి గత ఏడాదితో పోలిస్తే 17.89 ల.ట. నుండి స్వల్పంగా పెరిగి 17.95 ల.ట.కు చేరగలదని భావిస్తున్నారు.ఎన్సీడిఇఎక్స్ వద్ద గత సోమవారం మార్చి వాయిదా రూ. 7138 తో ప్రారంభమైన తర్వాత శుక్రవారం వరకు రూ. 252 క్షీణించి రూ. 6886, ఏప్రిల్ వాయిదా రూ. 200 నష్టంతో రూ.6920 వద్ద ముగిసింది.
బొబ్బర్లు, ఉలువలు,రాగులు
- Get link
- Other Apps
బొబ్బర్లు (లోబియా) - ప్రకాశం జిల్లాలోని పొదిలి ప్రాంతంలో ప్రతిరోజు 500-600 బస్తాల బొబ్బర్ల రాబడిపై రూ. 4800 మరియు గొట్లగట్టులో 1000 కొత్త సరుకు రాబడిపై రూ. 4700-4800 ధరతో వ్యాపారమె మహారాష్ట్ర కోసం రవాణా అవుతోంది. కడప జిల్లాలోని రాయచోటిలో 2-3 వాహనాల రాబడిపై నలుపు రకం బొబ్బర్లు రూ. 5400, ఒంగోలులోని తెలుపు రకం సరుకు రూ.4600, ఎరుపు మిక్స్ రకం రూ. 6400 ధరతో వ్యాపారమెంది.
వృద్ధిచెందిన మొక్కజొన్న ధరలు
- Get link
- Other Apps
కర్ణాటకలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 30-40 వేల బస్తాల కొత్త మొక్కజొన్న రాబడి కాగా, స్థానికంగా రూ. 1900-2050, నామక్కల్, ఉడుమల్ పేటె డెలివరి రూ. 2200 ధరతో వ్యాపారమైంది. తమిళనాడు కల్లకుర్చి, తిరుకోవిలూరు, చిన్న సేలం, ఉలుండరుపేట, శంకరాపురం ప్రాంతాలలో ప్రతి రోజు 7-8 వేల బస్తాల రాబడిపై రూ. 1950-2000, ఈరోడ్, పొల్లాచి డెలివరి రూ. 2150-2200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
కనివినీ ఎరుగని రీతిలో దూసుకెళ్తున్న ముడి పామాయిల్ ధరలు
- Get link
- Other Apps
ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత రెండో అతిపెద్ద పామాయిల్ ఉత్పాదక దేశoగా మలేషియా ప్రసిద్ధి గాంచింది. ప్రపంచ పామాయిల్ సరఫరాలో ఇరు దేశాల భాగస్వామ్యం కలిసి 85 శాతం ఉంది. దక్షిణ అమెరికా దేశాలలో ప్రతికూల వాతావరణంతో సోయా పంటకు వాటిల్లిన నష్టం మరియు ఉక్రెయిన్పై రష్యా దాడితో ముడిపామాయిల్ ధరలు నింగికి దూసుకెళ్తున్నాయి. ఈ ప్రభావం ప్రపంచ పామాయిల్ మరియు సోయానూనెపై దుష్ప్రభావం పొడసూపుతున్నది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో దూసుకెళ్తున్న వంటనూనెల ధరలు
- Get link
- Other Apps
ఉక్రెయిన్ నుండి విశాఖపట్నంకు వార్షికంగా 10 ల.ట. సన్ఫ్లవర్నూనె దిగుమతి అవుతున్నట్లు ఓడరేవు అధికారులు పేర్కొన్నారు. దిగుమతి అయిన నూనె కాకినాడ మరియు విజయవాడతో పాటు పలు ప్రాంతాల రిఫైనరీలకు రవాణా చేయబడుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుండి సుమారు 4.40 ల.ట. సన్ఫ్లవర్ నూనె విశాఖపట్నం ఓడరేవుకు చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే, గురువారం ఉక్రెయిన్పై దాడి ప్రారంభం అయిన వెంటనే ధరలు నింగికి ఎగిసిపడుతున్నాయి. ఎందుకనగా, తాజా పరిణామాల నేపథ్యంలో ఉక్రెయిన్ నుండి సరఫరా నిలిచిపోవడమే కాకుండా షిప్మెంట్లు ఆలస్యమవుతున్నాయి.
పత్తి ఉత్పత్తి తగ్గే అంచనా
- Get link
- Other Apps
ఈ ఏడాది పత్తి ఉత్పత్తి 5 లక్షల బేళ్లు తగ్గి 343.13 లక్షల బేళ్లు (ప్రతి బేలు 170 కిలోలు ఉండగలదనే అంచనా వ్యక్తమవుతున్నదని భారత పత్తి సమాఖ్య (సిఎఐ) పేర్కొన్నది. దిగుమతులు 5 లక్షల బేళ్లు పెరిగి 15 లక్షల బేళ్లు, ఎగుమతులు గత ఏడాది 78 లక్షల బేళకు గాను 45 లక్షల బేళ్లకు పరిమితం కాగలవని సిఎఐ తెలిపింది. ప్రస్తుత సీజన్లోని మొదటి నాలుగు నెలలు అనగా 2021 అక్టోబర్-2022 జనవరి మధ్యకాలంలో దేశంలో పత్తి మొత్తం 272.20 బేళ్లు సరఫరా అయింది. ఇందులో కొత్త సరుకు192.20 లక్షల బేళ్లు, దిగుమతి అయిన సరుకు 5 లక్షల బేళ్లు ఉన్నాయని సిఎఐ పేర్కొన్నది.
యాలకులు
- Get link
- Other Apps
దక్షిణ భారత వేలం కేంద్రాల వద్ద గత సోమవారం శనివారం 5,26,033 కిలోల యాలకులు రాబడి కాగా, 5,12,485 కిలోల సరుకు విక్రయించబడింది. ఇందులో ప్రతి కిలో కనిష్ఠ ధర రూ. 845, గరిష్ఠ ధర రూ. 971 ధరతో వ్యాపారమైంది. ప్రతి వారం ఎడతెరిపి లేకుండా 5 లక్షల కిలోల సరుకు రాబడి అవుతున్నది. ఇందులో చిన్నతరహా రైతుల సరుకే అధికంగా ఉండగా, దిగ్గజ రైతులు ధరల వృద్ధిని నిరీక్షిస్తున్నారు.
స్థిరంగా కందుల ధరలు
- Get link
- Other Apps
భారతదేశంలో తగ్గిన కందుల ఉత్పత్తితో కందుల ధరలు స్థిరపడ్డాయి. అంతర్జాతీయ విపణిలో మయన్మార్ లెమన్ కందులు 20 డాలర్లు పెరిగి 810 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున మహారాష్ట్రలోని సోలాపూర్, లాతూర్, నాందేడ్ ప్రాంతాలలో నాణ్యమైన కందులు చెన్నై డెలివరి రూ. 100 వృద్ధి చెంది రూ. 6950-7000, గుజరాత్ ప్రాంతం బిడిఎన్-2 కందులు రూ. 7000, ఆంధ్ర ప్రాంతం కందులు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
పెసలకు కొరవడిన గిరాకీ
- Get link
- Other Apps
దేశంలోని అన్ని పెసల ఉత్పాదక రాష్ట్రాలలో ఈ ఏడాది పెసలధరలు పురోగమించనందున నిల్వ అయిన సరుకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎందుకనగా, ఏప్రిల్ నుండి గ్రీష్మకాలం సరుకు రాబడులు అందుబాటులో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఆగస్టు వరకు ఈ సరుకు సరఫరా ఉండగలదు. చెన్నైలో దిగుమతి అయిన పేడేశ్వర్ పెసలు రూ.150 తగ్గి రూ.7050, మహారాష్ట్ర ప్రాంతం సాదా పెసలు రూ. 7100-7150, ఆంధ్ర ప్రాంతపు సన్న పెసలు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
మినుముల ధరలపై భారీ ఆశ లేనట్లే
- Get link
- Other Apps
గ్రీష్మ కాలంలో మినుముల ఉత్పత్తి గణనీయంగా రాణిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొత్త మినుముల సరఫరా జోరందుకుంటున్నది. మయన్మార్లో పంట సంతృప్తికరంగా ఉన్నందున భారత్ సరఫరా కొనసాగే అంచనాతో ధరలు పురోగమించే అవకాశం లేదు. ఎందుకనగా, అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు 5 డాలర్లు తగ్గి ఎఫ్ఎక్యూ 770 డాలర్లు, ఎస్క్యూ 855 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ధర రూ. 100 పెరిగి ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6300, పాత సరుకు రూ.6200, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6150-6050, పాత సరుకు రూ. 6100, ఎస్యూ కొత్త సరుకు రూ.6750-6550, పాత సరుకు రూ. 6650, దిల్లీలో ఎస్క్యూ రూ. 7050-7100, ఎఫ్ఎక్యూ రూ.6450-6500, కోల్కతాలో రూ. 6250 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడు సరుకు చెన్నై డెలివరి రూ.6900-7000, ఆంధ్రప్రదేశ్ పియు-37 రకం రూ. 6700 మరియు 402 రకం సరుకు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ముగిసిన వాము సీజన్
- Get link
- Other Apps
దేశంలోని ప్రముఖ వాము ఉత్పాదక కేంద్రాల వద్ద పంట కోతలు ముగియడంతో పాటు లాభసాటి ధరలు లభ్యమైనందున దాదాపు 80 శాతం మంది రైతులు తమ సరుకు మార్కెట్లకు తరలించారు. ఫలితంగా గత వారంలో రోజులలో అన్ని మార్కెట్లలో కలిసి 30 వేల బస్తాల సరుకు రాబడి అయింది. మరో నెల రోజులలో రాబడులకు తెర పడగలదు. ప్రస్తుతం ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేనందున ధరలు తగ్గి స్థిరపడ్డాయి.
తగ్గిన ధనియాల ఉత్పత్తి - ధరలు పెరిగే సూచన
- Get link
- Other Apps
గత వారం గుజరాత్లోని గోండల్ల్లో 75-80 వేల బస్తాలు, హల్వాడ్ లో 12-14 వేల బస్తాల కొత్త ధనియాల రాబడిపై స్టాకిస్టుల కొనుగోళ్లతో ధర ప్రతి క్వింటాలుకు రూ. 150-200 వృద్ధి చెందిందని వ్యాపారులు తెలిపారు.ఈ ఏడాది గుజరాత్తో పాటు మరికొన్ని రాష్ట్రాలలో భారీగా తగ్గిన ఉత్పత్తి, అడుగంటిన పాత సరుకు నిల్వలు మరియు మార్కెట్లలో ప్రతియేటా ఫిబ్రవరిలో రాబడులు పోటెత్తుతుంటాయి. అయితే, ఈసారి వారం రాబడులు కలిసి 20 శాతానికి కూడా చేరడంలేదు. రష్యా, ఉక్రెయిన్ల నుండి ధనియాల రాబడులు దేశంలోకి దిగుమతి అవుతుండేవి. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దిగుమతులను ఆశించడం వృధా ప్రయాస తప్ప ఫలితంలేదు. కావున మిషన్-క్లీన్ నాణ్యమైన సరుకు రూ. 16,000 ప్రతి క్వింటాలుకు చేరే అవకాశం కనిపిస్తున్నది.
ఊపందుకున్న కొత్త చింతపండు రాబడులు
- Get link
- Other Apps
మహారాష్ట్రలో కొత్త చింతపండు రాబడులు ఊపందుకుంటున్నాయి. అయితే వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. అదే విధంగా వచ్చే వారం నుండి మధ్య ప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతంలో కొత్త చింతపండు రాబడులు ప్రారంభం అయ్యే అంచనా ఉండడంతో ధరలు స్థిరంగా ఉండ వచ్చని అదే విధంగా మార్చి, ఏప్రిల్ వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలలో రాబడులు పెరిగే అవకాశం కలదని వ్యాపారులు అభిప్రాయ పడుతున్నారు.
వన్నె తగ్గని పసుపు భవిష్యత్తు
- Get link
- Other Apps
మహారాష్ట్రలో పసుపు వెలికితీత ప్రక్రియ శరవేగంతో చేపడుతున్నారని వ్యాపారులు పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాలలో పంట దిగుబడులు గత ఏడాదితో పోలిస్తే తగ్గుతున్నట్లు సంకేతాలు అందుతున్నందున స్టాకిస్టులు తమ నిల్వ సరుకు అమ్మకాలను కుదిస్తున్నారు. కావున పసుపు భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండగలదని స్పష్టమవుతున్నది. అయితే, మార్చిలో రాబడులు పోటెత్తిన తరుణంలో ధరలు కొంతమేర దిగివచ్చే అవకాశం ఉంది. దేశంలో 2020 లో కరోనా మహమ్మారి విజృమ్భణ తరుణంలో పసుపు వినియోగం పెరిగినందున పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఒడిశ్శా, బీహార్, బెంగాల్ లాంటి రాష్ట్రాలలో ప్రతియేటా సేద్యం పరిధి విస్తరిస్తూనే ఉంది. గత వారం దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాల మార్కెట్లలో కలిసి కొత్త మరియు పాత పసుపు కలిసి 2 లక్షల బస్తాల సరుకు రాబడి అయింది. వచ్చే వారం రాబడులు మరింత పెరిగే అంచనాతో ధరలు ప్రత్యక్ష విపణిలో ప్రతి క్వింటాలుకు రూ.200-300 మరియు పరోక్ష విపణిలో రూ. 800-900 పతనమయ్యాయి. ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా రూ. 10,208 తో ప్రారంభమై శుక్రవారం వరకు రూ. 932 క్షీణించి 9276 మరియు మే వాయిదా రూ. 860 పతనమై రూ.90 వద్ద ముగిసింది.
రాబడులు తారా స్థాయికి చేరినప్పటికీ, దిగిరాని మిరప ధరలు
- Get link
- Other Apps
ఈ సారి మిరప ఉత్పాదకులకు సీజన్ మొత్తంలో ఆకర్షణీయమైన ధరలు లభిస్తున్నాయి. తద్వారా గుంటూరులో దినసరి సుమారు 1 లక్ష బస్తాలను మించి సరుకు రాబడులు కొనసాగుతున్నట్లు సమాచారం. కాగా వ్యాపారులు రైతుల సరుకు కొనుగోలు చేసిన వెంటనే అమ్మకం చేస్తున్నారు. అయితే తగ్గిన ఉత్పత్తిని పరిగణిస్తే మిరప భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకనగా దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో సుమారు 15 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, మొత్తం సరుకు అమ్మకం అవుతోంది. ఇందులో కొందరు రెత్తుల సరుకు మార్కెట్లలోకి బదులుగా సరాసరి ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 26-02-2022
- Get link
- Other Apps
తెలంగాణ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 26-02-2022
- Get link
- Other Apps
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 25-02-2022
- Get link
- Other Apps
తెలంగాణ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 25-02-2022
- Get link
- Other Apps
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 24-02-2022
- Get link
- Other Apps
తెలంగాణ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 24-02-2022
- Get link
- Other Apps
ఆంధ్ర ప్రదేశ్ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 23-02-2022
- Get link
- Other Apps
తెలంగాణ లోని వివిధ మార్కెట్లు మరియూ రైతు బజారు కూరగాయల ధరలు 🍅🥕🥬🥒 23-02-2022
- Get link
- Other Apps