పెసలకు కొరవడిన గిరాకీ

 


  దేశంలోని అన్ని పెసల ఉత్పాదక రాష్ట్రాలలో ఈ ఏడాది పెసలధరలు పురోగమించనందున నిల్వ అయిన సరుకు అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఎందుకనగా, ఏప్రిల్ నుండి గ్రీష్మకాలం సరుకు రాబడులు అందుబాటులో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఆగస్టు వరకు ఈ సరుకు సరఫరా ఉండగలదు. చెన్నైలో దిగుమతి అయిన పేడేశ్వర్ పెసలు రూ.150 తగ్గి రూ.7050, మహారాష్ట్ర ప్రాంతం సాదా పెసలు రూ. 7100-7150, ఆంధ్ర ప్రాంతపు సన్న పెసలు రూ. 7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 



అంతర్జాతీయ విపణిలో పేడేశ్వర్ పెసలు 900 డాలర్లు, పొకాక్ 835 డాలర్లు, అన్నేశ్వర్ 755 డాలర్లు కదలాడుతుండగా రాజస్తాన్లోని సుమేర్పూర్, కేక్ట్, కిషన్ ఢ్, గంగానగర్, జోధ్ పూర్ ప్రాంతాలలో రైతుల సరుకు రూ. 6000-7000, జైపూర్లో రూ. 6000-6600, పప్పు రూ. 7400- 7800, మిటుకులు రూ. 6000-7100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని జబల్పూర్ లో రూ. 5300-7050, హర్దాలో 500-600 బస్తాల శనగల రాబడిపై రూ. 4000-7000, విపరియాలో 700-800 బస్తాలు రూ. 6000-6900, తెలంగాణలోని ఖమ్మంలో పెసలు రూ. 6600, పప్పు సార్టెక్స్ రూ. 8900, నాన్-సార్టెక్స్ రూ.8500, అకోలాలో పెసలు రూ. 6500-7000, మోగర్ పెసలు రూ. 9200-9400 ధరతో వ్యాపారమైంది.


Comments

Popular posts from this blog