ఇతర రాష్ట్రాలలో పెరిగిన మిర్చి స్టాకిస్టుల అమ్మకాలు
లభించిన సమాచారం ప్రకారం పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ లాంటి రాష్ట్రాలలో ఈ ఏడాది మిరప వ్యాపారులకు మంచి లాభాలు చేకూరుతున్నాయి. తద్వారా స్టాకిస్టుల అమ్మకాలు పెర గడం వలన మిరప ఉత్పాదక రాష్ట్రాలలో మందకొడి గమనించబడింది మరియు వ్యాపారుల అంచనా ప్రకారం సరుకు కొరత ఉంది. ఇతర రాష్ట్రాలలో నిల్వ అయిన 50 శాతం సరుకు నెల రోజులలో అమ్మకం అయిన తరువాత తిరిగి కొనుగోళ్లు ప్రారంభం కాగలవు. ఎందుకనగా కొత్త సీజన్ కోసం మరో 6 నెలల సమయం ఉంది. మధ్య ప్రదేశ్లో నవంబర్ వరకు కొత్త సరుకు నిమ్ముతో ఉండగలదు. అయితే మర ఆడించే యూనిట్లకు ఎండు సరుకు అవసరం ఉంటుంది.