కొబ్బరి ధరలపై ఆశలు లేనట్లే
దేశంలో పితృ పక్షం ముగిసింది. దసరా, దీపావళి పండుగల కోసం దక్షిణాది రాష్ట్రాలలో కొబ్బరి,కొబ్బరికాయల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే ఈసారి చెప్పుకోదగ్గ స్థాయిలో కొనుగోళ్లు లేవని చెప్పవచ్చు. ఎందుకనగా ఈ ఏడాది కొత్త సీజన్లో ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు ముందస్తుగానే భారీగా సరుకు కొనుగోలు చేయడమే ఇందుకు నిదర్శనం. అటు తర్వాత ధరలు దిగ జారుతున్నందున సరుకు కొనుగోలుకు బదులు విక్రయించేందుకు దృష్టి సారిస్తున్నారు. ఉత్పాదక రాష్ట్రాలలోని రైతులు కూడా తమ సరుకు విక్రయించేందుకు ఆసక్తి కనబరచడంలేదు. కావున 2022-23 సీజన్ పర్యంతం కొనుగోళ్లకు అనుగుణంగా సరుకు సరఫరా అయ్యే అవకాశం కనిపిస్తున్నది. కేవలం 5-10 శాతం లాభంతో క్రయ విక్రయాలు జరిగే అవకాశం ఉంది.