01-02-2022 ఎండకాలo సీజన్ కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ 5,25,000 హెక్టార్లలో నువ్వుల పంట విస్తీర్ణాన్ని లక్ష్యంగా నిర్ధారించింది.ఫిబ్రవరి నెలాఖరులో రబీ సీజన్ నువ్వుల రాబడులు ప్రారంభం కాగలవని వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది ఉత్పత్తి తగ్గినప్పటికీ జనవరిలో ధరలు పురోగమించనందున వ్యాపారులు మరియు రైతులు తమ నిల్వ సరుకు విక్రయించడం ప్రారంభించారు. ఎందుకనగా, యాసంగి సేద్యం భారీగా విస్తరించే అవకాశమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి పరిస్థితులలో గత ఏడాది మాదిరిగానే డిసెంబర్ సరుకు సరఫరా ఉండగలదని తెలుస్తోంది. దీనితో ఉత్పాదక రాష్ట్రాలలో ధరలు తగ్గి స్థిరంగా నిలిచాయి.