మినుములు స్థిరం
యాసంగి సీజన్ మినుము పంట విస్తీర్ణం పెరగడంతో మరియు ప్రస్తుతం ఆంధ్ర రబీ సీజన్ సరుకు సరఫరా అవుతున్నందున ధరలు పెరగడానికి బలం చేకూరడంలేదు. త్వరలో యాసంగి మినుముల సరఫరా ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున పెద్ద స్టాకిస్టులు బయటపడు తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి. సరుకు స్థానిక పప్పు మిల్లులకు సరఫరా అవుతున్నది. గత రెండేళ్లుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుండి మినుములలో పెరుగుదల మరియు సీజన్ సమాప్తమైన తరువాత మందకొడి కారణంగా రాబోవు కొత్త సీజన్లో స్టాకిస్టులు తగ్గవచ్చు.