పసుపులో కొనసాగుతున్న మందగమనం

 

గత వారం వినియోగ కేంద్రాలలో డిమాండ్ తగ్గడం మరియు వాయిదా ధరలు రూ. 250-300 తగ్గడంతో పాటు మర ఆడించే యూనిట్ల కొనుగోళ్లు లేనందున ధరలు రూ. 300-400 క్షీణించాయి. నిజామాబాద్ మార్కెట్లో రాబడులు తగ్గుముఖం పట్టాయి. ఎన్ సి డి ఇ ఎక్స్ వద్ద గత సోమవారం మే వాయిదా రూ.8480 తో ప్రారంభమై తరువాత శుక్రవారం వరకు రూ. 296 క్షీణించి రూ. 8184, జూన్ వాయిదా రూ.254 తగ్గి రూ. 8308 వద్ద ముగిసింది.


తెలంగాణలోని నిజామాబాద్ మార్కెట్లో గత సోమ, గురు, శుక్రవారాలలో కలిసి 12-15 వేల బస్తాల కొత్త పసుపు రాబడి కాగా కొమ్ములు రూ. 6500-8300, గోలా రకం రూ. 5500-6500, పాలిష్ కొమ్ములు రూ. 8300-8400, గోళారూ.700-7300 మరియు బంగ్లాదేశ్ కోసం లారీ బిల్జీ రూ. 7900 ధరతో వ్యాపారమైంది.


మెట్పల్లిలో గత వారం 2 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ.6000-7300, గోళా రకం రూ. 5200-6200 మరియు వరంగల్లో 3-4 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ.6900-7100, గోళా రకం రూ.6600-6700, గోలా రకం రూ.6300-6400 మరియు కేసముద్రంలో గురువారం నాడు 1000 బస్తాల రాబడిపై నాణ్యమైన కొమ్ములు రూ.5500-7000, గోళా రకం రూ. 5500-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

ఆంధ్రప్రదేశ్లోని దుగ్గిరాల మార్కెట్లో గత వారం 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా కొమ్ములు, గోళా రకాలు రూ. 5800-6200, కడప రకం రూ.5500, టేకూరిపేట రకం రూ. 6300-6400 మరియు కడప మార్కెట్లో గత శుక్రవారం నాడు 2 వేల బస్తాల సరుకు రాబడి కాగా, కొమ్ములు రూ. 5800-5900, గోళా రకం రూ. 5400-5500 ధరతో వ్యాపారమైంది.

 మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో గత వారం 20-25 వేల బస్తాల సరుకు రాబడిపై రాజాపురి రకం రూ. 7800-8300, దేశీ కడప రకం పసుపు రూ. 600-6700 మరియు హింగోళిలో బుధ,శుక్రవారాలలో 25-30 వేల బస్తాల రాబడిపై కొమ్ములు రూ.6200-7000, గోలా రకం రూ.6000-6500 మరియు నాందేడ్లో 8-10 వేల బస్తాలు, బస్మత్నగర్లో 15 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై కొమ్ములు రూ. 6500-7800, గోళా రకం రూ. 6000-7000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమెంది.

Comments

Popular posts from this blog