తగ్గిన పెసర విస్తీర్ణం

 

09-01-2022

7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది. 


గతవారం ప్రారంభంలో పెసల ధరలు తగ్గిన తరువాత మార్కెట్ స్థిరంగా మారి రాజస్తాన్లోని కేర్డీ, మెడతా, సుమేర్పూర్, కిషన్డ్, శ్రీగంగానగర్ ప్రాంతా లలో కలిసి 78 వేల బస్తాల రాబడిపై రూ.5500-6200, నాణ్యమైన లావు రకం రూ. 6500-6700, జైపూర్లో రూ. 6100-6900, పప్పు రూ. 7400-8400, మిటుకులు రూ. 6400-7400, మధ్య ప్రదేశ్లోని పిపరియా, హరదా, జబల్ పూర్ ప్రాంతాలలో దినసరి 4-5 వేల బస్తాల రాబడిపై రూ. 4000-7200 క్వాలిటీ ప్రకారం మరియు ఇండోర్లో రూ.6800-7100 ధరతో వ్యాపారమయింది.


పొన్నూరులో చమ్కీ పెసలు రూ. 7000, సాదా రూ. 6800, ఖమ్మంలో పప్పు సార్టెక్స్ రూ. 8900, నాన్ సార్టెక్స్ రూ. 8500, కర్నాటకలోని కలుబర్గి, సేడెం, గదగ్, యాద్గిర్ ప్రాంతాలలో పెసలు రూ. 4000-6200 క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. అయితే, మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ రూ. 5350-7250, అకోలాలో పెసలు రూ. 6500-6800, మోగర్ రూ.6200, నాణ్యమైన సరుకు రూ. 6400-6500 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు