Posts

Showing posts with the label పసుపు ధరలు

పెరిగిన పసుపు ఉత్పత్తి - దిగజారుతున్న ధరలు

Image
  దేశంలో 2021-22 పంట కాలం పసుపు ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 18.4 శాతం ఇనుమడించి 13.30 ల.ట.కు ఎగబాకగా, గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు ముందు సంవత్సరంతో పోలిస్తే 16.7 శాతం క్షీణించి 1,53,154 టన్నులకు పరిమితమైనట్లు మసాలా బోర్డు విడుదల చేసిన తమ నివేదికలో పేర్కొన్నది. అయితే, ఇది తాత్కాలికమేనని కూడా బోర్డు పేర్కొన్నది. ఎందుకనగా, ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు ఆరోగ్య పరిరక్షణ అంశంపై అవగాహన పెంపొందడమే ఇందుకు నిదర్శనమని బోర్డు తమ అభిప్రాయం వ్యక్తం చేసింది.

తగ్గిన పసుపు ఎగుమతులు - జనవరి లో కొత్త పసుపు రాబడులు

Image
  05-12-2021 విశ్లేషకుల కథనం ప్రకారం పసుపు ఉత్పాదక ప్రాంతాలలో మంచి వర్షాలు కురవడంతో, 2022 లో ఉత్పత్తి ముందు సంవత్సరంతో పోలిస్తే 10 శాతం అధికంగా ఉండే అంచనా కలదు. అయితే, కొందరు వ్యాపారులు పంటకు నష్టం వాటిల్లినట్లు ఇప్పటినుండే ప్రచారం చేస్తున్నటికీ, ధరలు పెరిగే అవకాశం కనిపించడంలేదు. ఇందుకు ముఖ్య కారణమేమనగా, దేశంలోని అన్ని ఉత్పాదక మరియు వినియోగ రాష్ట్రా లలో పాత సరుకు నిల్వలు ఉన్నాయి. మరియు మర ఆడించే మసాలా యూనిట్లు అవసరానికి అనుగు ణంగానే సరుకు కొనుగోలు చేస్తు న్నాయి. అన్ సీజన్ లో రూ. 400-500 హెచ్చుతగ్గుల ప్రభావం అధిక ధరలు గల సరుకులపై ఉండదు.

గిరాకీ లేని పసుపు

Image
  28-09-2021        దేశీయ గ్రైండింగ్ యూనిట్లతో పాటు ఎగుమతి వ్యాపారులు లావాదేవీలు తగ్గడమే కాకుండా కొందరు స్టాకిస్టులు అమ్మకాలు పెరగడంతో గత వారం పసుపు ధరలు ప్రతి క్వింటాలుకు రూ.200-300 నాణ్యతానుసారం పతనమయ్యాయి.