తగ్గిన చింతపండు రాబడులు

 

వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహా రాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీసడ్ మరియు గుజరాత్లలో చింత పండు సీజన్ చరమాంకానికి చేరింది. తద్వారా రాబడులు తగ్గుముఖం పట్టాయి. తీవ్ర వేసవి తాపం కారణంగా సరుకు నాణ్యత లోపించి రంగు వెలవడంతో ధర లపై ప్రభావం పొడసూపుతున్నది. 


ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్లో గత వారం 40 వాహనాల చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 10,500-12,000, మీడియం రూ. 9000- 10,500, యావరేజ్ రూ. 8000-9000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 6500-7000, మీడియం రూ. 5500-6500, యావరేజ్ రూ. 3500-5500 మరియు పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో వారంలో 15-20 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, మేలిమి రకం రూ. 9,000-10,000, మీడియం రూ. 8000-8800, మహారాష్ట్ర చ 00, మహారాష్ట్ర చపాతీ రూ. 9000-10,000, ఫ్లవర్ రూ. 6000-7000, మీడియం రూ. 5000-6000, యావరేజ్ రూ. 4000-5000, మహారాష్ట్ర గింజ సరుకు రూ. 2800–3000 స్థానికంగా రూ. 2400-2700 ధరతో వ్యాపారమైంది. విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో 8-10 వాహనాల సరుకు రాబడిపై 50 శాతం రంగు గల సెమి ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8500, మీడియం రూ. 6000-6100, యావరేజ్ రూ. 4800, గింజ సరుకు రూ. 2500 ధరతో వ్యాపారమై కాకినాడ, రాజమండ్రి మరియు మీడియం రకాలు తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


తెలంగాణలోని మహబూబ్నగర్ మార్కెట్లో గత వారం 2 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5000-6000, మీడియం రూ. 3000-4000, షాద్నగర్, నవాబ్పట్లో 500-600 బస్తాల రాబడిపై రూ. 4000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతం నుండి వారంలో 8-10 వాహనాల రాబడి పై మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల ఫ్లవర్ రకం రూ. 5000-6500, నాణ్యమైన సరుకు రూ.10,000-12,000, మీడియం రూ.8500-9000, యావరేజ్ రూ. 6000-7500 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చింతామణి మార్కెట్లో గరువారం నాడు 4-5 వాహనాల చింత పండు రాబడిపై మేలిమిరకం రూ. 9000-10,000, ఫ్లవర్ రకం రూ. 5000-7000, 200-3000 ధరతో వ్యాపారమై పుంగనూరు కోసం రవాణా అయింది. తుమ్కూరులో సోమ, గురువారాలలో కలిసి 50 వాహనాల రాబడిపై సిల్వర్ రకం రూ. 18,000-20,000, నాణ్యమైన మేలిమి రకం రూ. 12,000-14,000, మీడియం రూ. 7000-8000, ఫ్లవర్ రకం రూ. 3000-4000 మరియు బెల్గాంవ్లో 2–3 లారీల సరుకు రాబడి కాగా రూ. 3000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. బెల్గాంవ్లో గత వారం నిరవధికంగా కురిసిన వర్షాలకు సరుకు నిమ్ముతో రాబడి అయినందున ధర రూ. 3000-6000 ప్రతి టాల నాణ్యతనుసారం వ్యాపారం అయింది.


మహారాష్ట్రలోని బార్షీలో దినసరి 600-700 బస్తాలు, లాతూర్ 200-300, ఉద్గిర్ 200-300 బస్తాల చింతపండు రాబడిపై 40-55 శాతం రంగు సరుకు రూ.7000 మీడియం రూ.5000-6000, అహ్మద్గనర్లో దినసరి 600-700 బస్తాల రాబడిపై ఫ్లవర్ రకం సరుకు రూ.6500-8000 ధరతో వ్యాపారమె గుజరాత్, తమిళనాడు, హైదరాబాద్ల కోసం ఎగుమతి అయింది.


ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో ప్రతి రోజు 800-1000 బస్తాల సరుకు రాబడి కాగా, ఫ్లవర్ రూ.5500-6500, గింజ సరుకు బిల్టీకట్ రూ.2500 మరియు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో 300-400 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 2400-3000, ఓం బ్రాండ్ రూ. 9500, మీడియం ఫ్లవర్ రకం రూ. 6500-7500, తరానా, ఉన్హేల్లలో 600-700 బస్తాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 2700-3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్,తమిళనాడుల కోసంరవాణా అవుతున్నది.

 తమిళనాడులోని క్రిష్ణగిరిలో గత వారం 8-10 వేల బస్తా ల కొత్త చింతపండు రాబడిపై గింజ సరకు రూ.2200-2300, మీడియం రూ. 1700-1900, పాపరంపట్టి ఎసిల నుండి దినసరి 6-8 వాహనాల కొత్త సరుకు రాబడిపై మైసూరు చపాతి రకం రూ. 7000-7200, మహారాష్ట్ర ఫ్లవర్ రకం సరుకు రూ. 7700-7800, గింజ సరుకు రూ.2800-3200, మైసూరు గింజ సరుకు రూ. 2300-2500, నలగొట్టని చింతపండు (బోట్ రకం) రూ.1500-1600 మరియు సేలంలో గత వారం 4 రోజుల మార్కెట్లలో 10-12 వాహనాలు, కంభం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 6-7 వాహనాల అమ్మకం కాగా, మేలిమి రకం సరుకు రూ. 9000-10,000, లోకల్ చపాతీ రకం రూ.7000-7200, ఫ్లవర్ నాణ్యమైన కు రూ.6000-7000, మీడియం రూ. 5000-5500, గింజ సరుకు రూ. 2800-3000, బోట్ రకం రూ.1500-1600 మరియు బిహార్లోని రాంచీలో ప్రతిరోజు 8-10 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 2400-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై శీతలగిడ్డంగులలో నిల్వ కోసం మరియు కోల్కత్తా కోసం రవాణా అయింది. 


చింతగింజలు :

 తెలంగాణలోని మహబూబ్ నగర్, నవాబ్ పేట మరియు తదితర ప్రాంతాలలో దినసరి 800-1000 బస్తాల చింతగింజల రాబడి కాగా, రూ. 1600-1680, సిద్దిపేటలో గత వారం 10 వాహనాల రాబడి కాగా, రూ. 1700, పప్పు సూరత్ డెలివరి రూ.3050 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో గతవారం 10-12 వాహనాలు, పుంగనూరులో 5-6 వాహనాల కొత్త చింతగింజల రాబడిపై ధర రూ. 1650-1700, పప్పు సూరత్ డెలివరి రూ. 3050, బాషీ డెలివరి రూ. 2950-3000, సాలూరులో 4-5 వాహనాల చింతగింజలు రూ. 1500, పుంగనూరు డెలివరి రూ. 1750, సిద్దిపేట డెలివరి రూ. 1750 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని తుంకూరులో 8-10 వాహనాలు, చెల్లకేరిలోని వారాంతపు సంతలో 5-6 వాహనాలు, బెల్గాంవ్లో 1-2 వాహనాల సరుకు రాబడి కాగా, స్థానికంగా రూ.1550-1600, బార్షీ డెలివరి రూ. 1725-1800 ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని బార్షీలో 800 1000 బస్తాల రాబడిపై రూ.1550-1600 మరియు తమిళనాడులోని పాపరంపట్టిలో 10-12 వాహనాల రాబడిపె గింజ సరుకు రూ. 1450-1500 ధరతో వ్యాపారమై పుంగనూరు కోసం ఎగుమతి అయింది.

Comments

Popular posts from this blog