బఠాణిలు

  

 ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో ఖరీఫ్ పంట కోతలు కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా రబీ సీజన్ కోసం దీపావళి నాటికి బఠానీల సాగు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విస్తీర్ణం కూడా పెరగవచ్చు.


 ఉత్తరప్రదేశ్ లో కొత్త వండగాల వలన పంట దిగుబడి పెరగడంతో రైతులు ఉత్సా హంగా ఉన్నారు. ఇంతవరకు దేశంలో భారీగా సరుకు నిల్వలు ఉన్నాయి. అయితే ధరలలో ఎక్కువగా హెచ్చు తగ్గులు కొనసాగడం లేదు. ఎందుకనగా సరఫరా మెరుగ్గా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని మోహోబాలో దినసరి 1400-1500 బస్తాల బఠానీల రాబడిపై రూ.4700-4900, పాలిష్ నదుకు రూ. 4800-5400, ఆకుపచ్చ సరుకు రూ. 3200-3700, లలిత పూర్లో 800-1000 బస్తాలు తెల్లని రూ. 4200-4600, ఝాన్సీలో రూ. 4500-4800, ఉరైలో తెల్ల బరాణీలు రూ. 4500-5035 మరియు కాన్పూర్‌లో ఉత్తరప్రదేశ్ సరుకు రూ. 5050-5250, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 5000-5200 ధరతో వ్యాపారమైంది.



Comments

Popular posts from this blog