అకాల వర్షాలకు మిర్చి పంటకు నష్టం
ప్రముఖ మిరప ఉత్పాదక రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పంట మరియు పూతపై నల్లి తెగులు సోకడంతో రైతులు పంట పెరికివేస్తున్నారు. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాల వలన ఆలస్యంగా విత్తిన పంటకు నష్టం వాటిల్లింది. మధ్య ప్రదేశ్, మహారాష్ట్రలలో వర్షాల వలన పంట కోతలకు అవరోధం ఏర్పడింది. కొందరు వ్యాపారులు ఎగుమతి వ్యాపారుల కోసం ఎడ్వాన్స్ వ్యాపారం చేసారు. ఇందుకోసం కొనుగోలు డిమాండ్ రావడంతో దేశవ్యాప్తంగా ఉత్పాదక రాష్ట్రాలలో మిరప ధరలు రూ. 1000-1500 ప్రతి క్వింటాలుకు పెరిగాయి. కర్నూలు, ఎమ్మిగనూరు ప్రాంతాలలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పంటకు భారీ నష్టం వాటిల్లింది. దీనితో కొత్త నాణ్యమైన మిరప రాబడి కోసం 2 నెలల సమయం పట్టగలదు. ప్రకాశం జిల్లాలో దిగుబడి తగ్గే అవకాశం కలదు.
వ్యాపారస్తుల అంచనా ప్రకారం ఇతర దేశాలతో పాటు దేశంలోని ఉత్పాదక కేంద్రాలలో సరుకుకు డిమాండ్ పెరగడంతో రాబోవు రోజులలో ధరలు మరో రూ. 800-1000కు పైగా పెరిగే అవకాశం ఉండడంతో తమ సరుకు విక్రయించడం కోసం రెత్తులు, వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.
ఖమ్మం శీతలగిడ్డంలలో సుమారు 4 లక్షల 68 వేల 700 బస్తాల నిల్వలు ఉన్నట్లు సమాచారం.
కాగా స్థానిక మార్కెట్లలో వారంలో 30-35 వేల బస్తాల సరుకు అమ్మకంపై
నాణ్యమైన తేజ రకం రూ. 13,500,
మీడియం రూ. 12,500 -13,000,
తాలు కాయలు రూ.6200 ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో గత వారం నిర్వహించిన 5 రోజుల లావాదేవీలలో మొత్తం 4 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, శీతల గిడ్డంగుల సరుకు 2.35 లక్షల బస్తాల సరుకు విక్రయించ బడింది. ఇందులో గుంటూరు శీతల గిడ్డంగుల నుండి 1.60 లక్షల బస్తాలు మరియు పరిసర ప్రాంతాల నుండి మరో 75 వేల బస్తాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, సింగాపూర్, చైనా లతో పాటు ఉత్తర భారత దేశం కోసం కూడా డిమాండ్ నెలకొన్నందున తేజ డీలక్స్, ఎక్స్ట్రాఆర్డినరి, సింజెంట బడిగ రకాలలో రూ. 700, మీడియం, మీడియం బెస్ట్ తేజ, డిడి రకాలలో రూ. 1200, బడిగ 355 రకం రూ. 900, ఆర్మూర్, నెం-5 రకానికి రూ. 800 మరియు 341 రకం రూ. 1400 మరియు 273, సూపర్-10, మీడియం, మీడియం బెస్ట్ 334 రకంతో పాటు అన్ని మీడియం, మీడియం బెస్ట్ సీడ్ క్వాలిటీలో రూ. 1000, రోమీ, 577, డీలక్స్ 334, సూపర్-10, 4884, తేజ తాలు రకాలలో రూ. 500, గత ఏడాది సరుకు 334, సూపర్-10, బంగారం రకం ధరలు రూ. 600, తాలు రూ. 300-500 ప్రతి క్వింటాలుకు వృ ద్ధి చెందాయి. గుంటూరు కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన
తేజ నాణ్యమైన సరుకు రూ. 12,500-13,500, డీలక్స్ రూ. 13,600–13,800, ఎక్స్డినరి రూ. 13,900-14,000, మీడియం బె స్ట్ రూ. 11,500–12,400, మీడియం రూ. 10,000–11,400,
బ్యాడిగ-355 రూ. 13,000 -15,500, డీలక్స్ రూ. 15,600 -15,700,
సింజెంట బడిగ రూ. 9000–11,500, డీలక్స్ రూ. 11,600-11,700,
డిడి రూ. 11,000–13,000,
341 రకం రూ. 11,000-13,500, డీలక్స్ రూ. 13,600–13,800,
నెం. 5 రకం రూ.10,000–12,300, డీలక్స్ రూ.12,400–12,600,
273 రకం రూ. 11,000–13,000,
334 మరియు సూపర్-10 రూ. 10,000 – 11,200, డీలక్స్ రూ. 11,300 - 11,500, ఎక్స్ట్రా ఆర్డినరి రూ. 11,600 –11,700, మీడియం బెస్ట్ రూ. 8500 -9900, మీడియం రూ. 7000 8400, గత ఏడాది నిల్వ అయిన 334, సూపర్ -10 రకం రూ.8000 10,600,
4884 రకం రూ.9000 11,500, డీలక్స్ రూ. 11,600 -11,700,
రోమీ రకం రూ. 9000 11,500, డీలక్స్ రూ. 11,600 –11,800,
ఆర్మూర్ రకం రూ. 8500 -10,800,
577 రకం రూ. 10,000-11,500,
బంగారం రూ. 8500-10,800, మీడియం, మీడియం బెస్ట్, అన్ని సీడ్ రకాలు రూ. 9500-11,500,
తేజా తాలు కాయలు రూ. 6000-7000, ఇతర రకాల తాలు కాయలు రూ. 3000-6000 ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు