గతవారం ఉత్పాదక కేంద్రాలలో రాబడులు తగ్గినప్పటికీ, పప్పులకు గిరాకీ తక్కువగా ఉండడంతో పెసలు మరియు పెసరపప్పు ధరలు రూ. 150-200 ప్రతిక్వింటాలుకు తగ్గాయి. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 31, డిసెంబర్ వరకు దేశంలో పెసర పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.39 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.29 లక్షల హెక్టార్లకు మరియు కేసరి విస్తీర్ణం 3.32 లక్షల హెక్టార్లు మరియు మినుము విస్తీర్ణం 6.43 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 5.66 లక్షల హెక్టార్లకు చేరింది.
గతవారం ఢిల్లీ ప్రాంతపు పెసరపప్పు చెన్నై డెలివరీ రూ. 200 తగ్గి రూ. 8400, మహారాష్ట్ర మిల్లు రకం పెసలు రూ. 6900-6950, కర్నాటక ప్రాంతపు 90-10 రకం రూ. 7400, 80-20 రకం రూ. 7150–7300 మరియు మొజాంబిక్ దిగుమతి అయిన పెసలు రూ.6500 ధరతో వ్యాపారమయింది. రాజస్తాన్లోని కేకీ, మెడతా, సుమేర ప్పూర్, కిషన్ ఘడ్, శ్రీగంగానగర్ ప్రాంతాలలో కలిసి 9-10 వేల బస్తాల రాబడిపై రూ.5500-6200, నాణ్యమైన లావు రకం రూ. 6500-6600, పెసరపప్పు రూ. 7400-8400, మిటుకులు రూ. 5400-7300, మధ్య ప్రదేశ్ లోని పిపరియా, హరదా, జబల్ పూర్ ప్రాంతాలలో దినసరి 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 4000-6950 క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. ఇండోర్లో రూ. 6600-7000 ధరతో వ్యాపారమయింది. పాన్నూరులో చమ్కీ పెసలు రూ. 7100, సాధారణ రకం రూ. 6900, ఖమ్మంలో పెసర పప్పు సార్టెక్స్ రూ. 8900, నాన్ సార్టెక్స్ రూ. 8500, కర్నాటకలోని కల్బుర్గి, సేడం, గదగ్, యాద్గిర్ ప్రాంతాలలో పెసలు రూ.5500-7000, మహారాష్ట్ర మార్కెట్లలో నాణ్యమైన సరుకు రూ. 7000-7150, మీడియం రూ. 6000-6300, అకోలాలో రూ.6500-6700, మోగర్ రకం రూ. 8900-9000, జల్గాంవ్ లో మధ్య ప్రదేశ్ సరుకు రూ. 6200, నాణ్యమైన సరుకు రూ. 6400-6500 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు