ఏడాది దేశంలో ఉత్పత్తి పెరగడంతో మరియు మిగులు నిల్వలతో పాటు కొత్త సీజన్ ప్రారంబం కావడంతో ఫిబ్రవరిలో మహారాష్ట్ర, గుజరాత్ లలో రాబడులు పెరిగిన తరువాత ధరలు తగ్గి రూ. 4200-4500 వరకు చేరవచ్చని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకనగా కొత్త సీజన్లో సరుకు నిమ్ముతో ఉండడం వలన ప్రభుత్వ ఏజెన్సీలు మద్దతు ధరతో సరుకు కొనుగోలు చేయవు.
ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభమైన వెంటనే రూ. 400-500 వరకు పెరుగుదలకు అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఏడాది ధరలు పెరిగే అవకాశం లేదు. ప్రస్తుత రబీ సీజన్లో 21, జనవరి వరకు దేశంలో శనగ పంట విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 109.05 లక్షల హెక్టార్ల నుండి పెరిగి 113.30 లక్షల హెక్టార్లకు చేరింది.
ఆంధ్ర ప్రాంతపు పాత శనగలు ఈరోడ్ డెలివరీ రూ. 5250-5300, కర్నాటక ప్రాంతపు కొత్త సరుకు మదురై డెలివరీ రూ. 5500, ఈరోడ్ డెలివరీ రూ. 5450 ధరతో వ్యాపారమయింది. ఆంధ్ర ప్రాంతపు పాత శనగలు ఈరోడ్ డెలివరీ రూ. 5250-5300, కర్నాటక ప్రాంతపు కొత్త సరుకు మదురై డెలివరీ రూ. 5500, ఈరోడ్ డెలివరీ రూ.5450 ధరతో వ్యాపారమయింది.
కర్నాటక లోని కలుబరిగిలో రూ. 4700-5000, సెడెంలో దినసరి 600-700 బస్తాల కొత్త శనగల రాబడిపై రూ. 4900-4925, బీజాపూర్లో 400-500 బస్తాలు, ముద్దె బిహాల్ లో 40-50 బస్తాలు, బిదర్లో 25-30 బస్తాల రాబడిపై రూ. 4700-5000,
బళ్లారిలో జెజె రకం రూ. 4950, బెంగుళూరులో కర్నాటక ప్రాంతపు నాణ్యమైన గులాబీ శనగలు రూ.5800, లాతూరు ప్రాంత పు శనగపప్పు సార్టెక్స్ రూ. 5900, అకోలా సరుకు రూ. 5800 ధరతో వ్యాపారమయింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు