కర్ణాటకలో ఆశించిన రాబడులు లేని చింతపండు

 


17-01-2022

కర్ణాటకలోని బెల్గాంలో గత వారం 50-60 బస్తాల కొత్త చింతపండు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 7000-8000, మీడియం రూ. 9000-12,000, నాణ్యమైన సరుకు రూ. 16,000-17,000 మరియు హోస్పేటలో 50 బస్తాలు రూ. 9000-10,500, తుంకూరులో గురువారం 2 టన్నుల కొత్త సరుకు రాబడితో ముహూర్త వ్యాపారం ప్రారంభం కాగా, సిల్వర్ రకం రూ. 20,000-25,000, మేలిమి రకం రూ. 14,000-18,000, ఫ్లవర్ రూ. 5000-8000, నలగ్గొట్టని చింతపండు రూ. 2000–2800, మైసూరులో 4-5 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై మహారాష్ట్ర నాణ్యమైన ఫ్లవర్ రూ. 8950-10,000, స్థానికంగా రూ. 6900-8000, సిల్వర్ రకం రూ. 18,500-20,000, మేలిమి రకం రూ. 14,000-15,000, మీడియం రూ. 10,800-12,000, ఫ్లవర్ మీడియం రూ. 4500-5500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 


ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్ మార్కెట్లో గత వారం 8-10 వాహనాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, మేలిమి రకం రూ. 13,500-16,000, మీడియం రూ. 10,000-12,000, యావరేజ్ సరుకు రూ. 8500-9000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8800-9000, మీడియం రూ. 6900-7500, యావరేజ్ రూ.5100-5500, 

పుంగనూరు, పలమనేరు, మదనపల్లిలో 15-20 వాహనాల సరుకు వ్యాపారం కాగా, మేలిమి రకం రూ.12,500-14,000, చపాతీ రూ. 10,000-10,500, ఫ్లవర్ రూ. 7500-8500, మీడియం రూ. 5600-6500, గింజ సరుకు రూ.3200-3600 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

విజయనగరం, పార్వతీపురం, రాయడ ప్రాంతాలలో గత వారం 18-20 వాహనాల శీతలగిడ్డంగుల సరుకు అమ్మకం కాగా, సెమీ ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8000-8200, మీడియం రూ. 6100-6200, యావరేజ్ రూ. 5400-5500, గింజ సరుకు జగదల్పూర్ డెలివరి రూ. 3200-3300, స్థానికంగా రూ. 3150 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ 10-15 వాహనాలు మరియు మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో 4-5 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ మీడియం రూ. 6800- 7500, గింజ సరుకు రూ. 2600-2900, ఓం బ్రాండ్ రూ. 9000, తరానా, ఉన్హేల్లో 5-6 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, రంగువెలిసిన గింజ సరుకు రూ.2350-2500, రంగు సరుకు రూ. 2500-2850 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.

 మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమిళనాడులోని మార్కెట్లు 4 రోజుల పాటు మూసివుండగలవని సమాచారం అందింది. మిగిలిన రెండు రోజులలో పాపరపట్టిలోని 8-10 వాహనాల శీతలగిడ్డంగుల సరుకు అమ్మకంపై మహారాష్ట్ర చపాతీ రూ.8500-9000, స్థానికంగా రూ. 8000-8500, బెస్ట్ రూ.8800-9000 రంగువెలిసిన సరుకు రూ.8500-8700, మహారాష్ట్ర నాణ్యమైన గింజ సరుకు రూ. 3200-3500, స్థానికంగా రూ. 2800-3000, నలగ్గొట్టని చింతపండు రూ.2200-2400 మరియు సేలంలో 5-6 వాహనాల సరుకు అమ్మకంపై మేలిమి రకం రూ. 11,500-12,000, మహారాష్ట్ర చపాతీ రూ.8500-9000 ఫ్లవర్ రూ. 8400-9050, రంగు వెలిసిన గింజ సరుకు రూ.2600-3200 మరియు కంబంలో 5-6 వాహనాలు, ధర్మపురిలో 3-4 వాహనాలు, 

దిండిగల్లో 5-6 వాహనాల సరుకు అమ్మకంపై ఫ్లవర్ రూ. 8600-9500, చపాతీ రూ. 9500-10,200, గింజు సరుకు రూ. 3400-38000 మరియు క్రిష్ణగిరిలో 4-5 వాహనాలు నాణ్యమైన గింజ సరకు రూ. 4000-5500, కర్ణాటక రూ.3200-3500, స్థానికంగా రూ.2500-3000 ధరతో వ్యాపారమైంది. 


చింతగింజలు : 

ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో చింతగింజల ధర రూ. 1550-1575, పప్పు సూరత్ డెలివరి రూ. 2900-3000, పౌడర్ రూ. 3700-3800, పుంగనూరులో చింతగింజలు రూ. 1450-1500, పప్పు రూ.2900-3000, పౌడర్ రూ. 3500-3900, సాలూరులో చింతగింజలు రూ. 1375-1400, పుంగనూరు డెలివరి రూ.1500-1650, సిద్దిపేటలో చింతగింజలు రూ. 1500-1525, పప్పు రూ. 2900-3000, పౌడర్ రూ. 3850–3900 ప్రతి ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు