ధరల దిగుబాటు తగ్గని కొబ్బరి



17-01-2022

 ఆంధ్రప్రదేశ్లోని అంబాజిపేటలో ప్రతి రోజు 200-250 టన్నుల కొబ్బరి రాబడిపై ఎక్స్పోర్ట్ రకం రూ. 8600-8700, మీడియం రూ. 7800-8000, యావరేజ్ రూ.7200-7500 మరియు పాలకొల్లులో 180-200 వాహనాల కొబ్బరికాయలు రాబడి కాగా, నాణ్యమైన పునాస రకం సరుకు రూ. 9400, మీడియం రూ. 9500, మీడియం రూ. 7400-7500, యావరేజ్ రూ. 5350-5500, కొత్త కాయలు నాణ్యమైన సరుకు రూ. 7850-8000, మీడియం రూ. 6400-6500, యావరేజ్ రూ. 4850-5000 (ప్రతి 1000 కాయలు) ధరతో వ్యాపారమై తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, రాజస్తాన్ కోసం రవాణా అవుతున్నది.


 కర్ణాటకలోని టిప్టూర్లో వారాంతపు సంతులో 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై బంతి కొబ్బరి రూ. 17,250-17,400, కిరాణా రకం మీడియం సరుకు రూ. 18,200, కిరాణా రకం రూ. 13,000-13,200, మీడియం రూ. 7100-8500, మిల్లింగ్ కొబ్బరి రూ. 10,500 ధరతో వ్యాపారమై మహారాష్ట్ర, పంజాబ్, హర్యాణా కోసం రవాణా అవుతున్నది.

 అరిసేకేరి, సి.ఆర్. పట్నం మంగళూరు, తుంకూరు ప్రాంతాలలో గత వారం 2 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 16,770-17,250, మీడియం రూ. 14,000-15,000, మిల్లింగ్ సరుకు రూ. 10,000-11,000 ధరతో వ్యాపారమైంది. 

తమిళనాడులోని కాంగేయంలో సాదా రూ. 8400-8500, మిల్లింగ్ స్పెషల్ రూ. 8600-8700, మెరికో రూ. 8700-8900 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి నూనె ప్రతి 15 కిలోల డబ్బా రూ. 1900-1920, 

వెల్లకోవిల్, అన్నామలై, అవిల్పుందురై ప్రాంతాల మార్కెట్లలో 4-5 వేల బస్తాల సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8700-9560, మీడియం రూ.6900-7500 మరియు 

కొచ్చి, త్రిచూర్లో కొబ్బరి నూనె రూ. 15,000-15,100, పెరుందురైలో 5-6 వేల బస్తాల కొబ్బరి రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9100-9900, 

కోజికోడ్లో రాజాపురి కొబ్బరి రూ. 17,400, రాసి రూ. 9400, మిల్లింగ్ కొబ్బరి రూ. 9850, బంతి కొబ్బరి రూ. 15,600, దిల్ పసంద్ రూ. 9900 ప్రతి క్వింటాలు మరియు కొబ్బరి కాయలు (1000) రూ. 30,000, 

వడకారలో రాజాపురి కొబ్బరి రూ. 17,000, ఎండు సరుకు రూ. 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు