రబీ సీజన్లో దేశంలో విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.80 ల.హె. నుండి పెరిగి 4.65 ల.హె.కు చేరింది. ప్రస్తుత ధరల పరిస్థితితో పాటు ఉత్పాదక రాష్ట్రాలలో సాగునీటి వనరులు మెరుగ్గా ఉన్నందున యాసంగి పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రలలో వారం రోజులలో 3 లక్షల బస్తాలకు పైగా, రాజస్థాన్, గుజరాత్ లో 3.50 లక్షలకు పైగా వేరుశనగ రాబడి అవుతున్నందున, సప్లై పెరగడంతో ధరలు క్షీణిస్తున్నాయి. అయితే రైతులకు మద్దతు సుమారు ధరలకు సమానంగా మార్కెట్లో ధరలు లభిస్తున్నాయి. పామాయిల్ ధరలు పటిష్టంగా ఉన్నందున వేరుశనగలో ఎక్కువగా తగ్గుదలకు అవకాశం లేదు.
కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో వారంలో 35-40 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5200-6900, 80-90 కౌంట్ చెన్నై డెలివరీ రూ.9800,
కళ్యాణదుర్గ, రాయదుర్గ, మడకశిర ప్రాంతాలలో వారంలో 30-40 వేల బస్తాల రాబడిపై రూ. 5200-5700, 80-90 కౌంట్ రూ. 9400-9500, చెన్నై కోసం ఎక్స్పోర్ట్ రకం రూ. 9800, 70-80 కౌంట్ రూ. 9800 ధరతో వ్యాపారమయింది.
గుజరాత్లోని రాజ్ కోట్, దీసా, గోండల్, పాలన్పూర్, జూనాఘడ్ తదతర ప్రాంతాల మార్కెట్లలో కలిసి దినసరి 2.5-3 లక్షల బస్తాల రాబడిపై రూ. 4800-5000 క్వాలిటీ ప్రకారం మరియు కళ్యాణి రకం రూ. 8200, కొత్త టిజె 37 రకం రూ. 80-90 కౌంట్ రూ. 8850, 50-60 కౌంట్ రూ. 9500, 60-70 కౌంట్ రూ. 9250, పోరుబందర్ డెలివరీ 50-55 కౌంట్ రూ. 8450, 40-50 కౌంట్ రూ.8600, ముంబాయి డెలివరీ టిజె 37 మరియు 60-70 కౌంట్ రూ. 9700 ధరతో వ్యాపారమయింది.రాజ్కోట్లో వేరుశనగ రోహిణి 24 నెం. నాణ్యమైన సరుకు రూ. 5250-5500, మీడియం రూ. 5000-5250, నెం.24 రకం రూ. 5300-5500, ovo r. 5150-5300, 37 30. 8. 5000-5250, మీడియం రూ. 4500-4700, నెం. 39 బెస్ట్ రూ. 4900-5100, మీడియం రూ. 4750-4900, జి-20 రకం రూ. 5700-5900, మీడియం రూ. 5500-5650, యావరేజ్ రూ.5250-5400 ధరతో వ్యాపారమయింది. గుజరాత్లో వేరుశనగ నూనె ప్రతి 10 కిలోలు రూ. 1275-1300, జామ్నగర్లో రూ. 1270–1275, బికనీర్లో రూ. 1210-1300 మరియు
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలితప్పూర్, మధ్యప్రదేశ్ లోని శివపురి ప్రాంతాలలో 25-30 వేల బస్తాల రాబడిపై రూ. 4200-5200,70-80 కౌంట్ తమిళనాడు డెలివరీ రూ.8200 ధరతో వ్యాపారమయింది.
రాజస్తాన్లోని బికనీర్లో దినసరి 45-50 వేల బస్తాలు, మెడతా, జైపూర్, జోధ్పూర్ మరియు రాజస్తాన్లోని ఇతర మార్కెట్లలో కలిసి దాదాపు 60-70 వేల బస్తాల రాబడిపై రూ. 4600-5700, 60-65 కౌంట్ వేరుశనగ గింజలు Jº. 7700, 60-70 5°oes . 7600, 40-50 3°oes 8°. 8200,50-60 కౌంట్ రూ. 8000 ధరతో మహారాష్ట్ర, తమిళనాడులకోసం వ్యాపారమయింది.
కర్నాటకలోని బళ్లారి, గదగ్, చెల్లకేరి, చిత్రదుర్గ, లక్ష్మీశ్వర్, హుబ్లీ, రాయిచూర్ ప్రాంతాలో గతవారం కేవలం 20-30 వేల బస్తాల రాబడిపై రూ.6100-7230, నిమ్ము రకం రూ. 4000-5000, మీడియం రూ. 5000-5500, చెల్లకేరిలో కొత్త వేరుశనగ గింజలు 80-90 కౌంట్ రూ. 9600-9700, కళ్యాణి రూ. 8400, 70-80 కౌంట్ రూ. 9700-9800, 90-100 కౌంట్ కొత్త సరుకు రూ. 9900-10000 ధరతో వ్యాపారమయింది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు