వచ్చే వారం నుండి కొత్త మిర్చి రాబడులు పోటెత్తే అవకాశం

 

02-01-2022

దేశంలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 7 లక్షల బస్తాలకు పైగా కొత్త మిర్చి రాబడి అయింది. నాణ్యమైన సరుకు రకాల కొనుగోళ్లు జోరందుకున్నందున ధరలపై ఎలాంటి దుష్ప్రభావం పొడసూపలేదు. వచ్చే వారం రాబడులు మరింత పోటెత్తగలవని తెలుస్తోంది. మిరప పొడి కోసం దేశీయంగా భారీ డిమాండ్ ఉన్నందున గ్రైండింగ్ యూనిట్ల కొనుగోళ్లు జోరందుకున్నాయి. లాభసాటి ధరలు లభ్యమవుతున్నందున రైతులు పంట కోతలు శరవేగంతో చేపడుతున్నారని తెలుస్తోంది.గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని మార్కెట్లలో కలిసి దాదాపు 2 లక్షల బస్తాలు, మధ్య ప్రదేశ్లో 2 లక్షల బస్తాలు, కర్ణాటకలో 3 లక్షల బస్తాలకు పైగా కొత్త మిర్చి రాబడి అయింది. గుంటూరు శీతల గిడ్డంగుల నుండి మరో 3 లక్షల బస్తాలు, ఖమ్మం, వరంగల్లో 50 వేల బస్తాలు, కర్ణాటకలో 20 వేల బస్తాల సరుకు రాబడులను పరిశీలిస్తే స్టాకిస్టులు మరియు రైతులు పోటీపడి సరుకు విక్రయిస్తున్నట్లు అవగతమవుతుంది. 


గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల నుండి 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, 1.25 లక్ష బస్తాల సరుకు విక్రయించబడింది. తేజ డీలక్స్ రూ. 500 పతనం కాగా, 334, సూపర్-10, బంగారం రూ. 800, నెంబర్-5, 577 రూ. 500 వృద్ధి చెందగా మిగిలిన అన్ని రకాల ధరలు చెక్కుచెదరలేదు. గుంటూరు యార్డులో ఎ కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం, భద్రాచలం 1.65 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా 1 లక్ష బస్తాల సరుకు అమ్మకంలో డీలక్స్ రకాలు డిమాండ్ చవిచూశాయి. 70 శాతం నిమ్ము సరుకు మరియు 30 శాతం నాణ్యమైన సరుకు రాబడి కాగా డీలక్స్ రకాలు, తేజ, సిడ్ రకాల తాలు కాయలు ధర రూ. 500 వృద్ధి చెందాయి. ప్రస్తుతం తేజ రకాల రాబడులు భారీగా కొనసాగుతున్నాయి. వచ్చే వారం మరింత పెరగగలవని భావిస్తున్నారు. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన

 తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000–16,000, డీలక్స్ రూ. 16,100-16,300, ఎక్స్ ట్రాడినరీ రూ. 16,400-16,500, మీడియం బెస్ట్ రూ. 12,000–13,900, మీడియం రూ. 11,000-11,900, 

బడిగ-355 రూ. 17,000-20,000,

 సింజెంట బడిగ రూ. 13,000-16,500, 

డిడి, రూ. 13,000-16,500, 

341, నెంబర్-5 రూ. 14,000-18,000,

 273 రూ.13,000-16,500, 

సూపర్-10 మరియు 334 రూ.14,000–17,000, డీలక్స్ రూ. 17,100–17,200, ఎక్స్ ట్రాడినరి రూ. 17,300-17,500, మీడియం బెస్ట్ రూ. 12,500-13,900, మీడియం రూ. 11,500-12,400,

 4884 రూ. 12,000-14,000, 

ఆర్మూర్ రకం మరియు రొమి రూ. 12,000-14,200,

 577 రకం రూ. 14,000–17,000, 

బంగారం రకం రూ. 13,000-15,500, 

అన్ని సీడ్ రకాల మీడియం మరియు మీడియం బెస్ట్ రూ. 12,000-14,500,

 తాలు కాయలు తేజ రూ. 7000-8000, ఇతర రకాలు రూ. 4000-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

 గుంటూరులో

 తేజ కొత్త రూ.12,000-15,000, మీడియం రూ. 10,000-12,400, 

355- బడిగ రూ. 12,500-17,000, 

సింజెంట బడిగ రూ. 12,000-14,500, 

341 రూ. 12,000–16,000, 

నెంబర్-5 రూ. 12,000-16,500, 

273 రూ. 10,000-14,000, 

డిడి నాణ్యమైన సరుకు రూ. 13,000–16,000, 

డీలక్స్ రూ. 16,200-16,500, 

బంగారం రూ. 11,000-15,000, 

ఆర్మూరు రకం రూ. 10,000-12,500, 

అన్ని మీడియం బెస్ట్ సీడ్ రకాలు రూ. 9,000-11,500, 

తాలు కాయలు తేజ రూ. 7000-8500, ఇతర రకాలు రూ. 3000-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని వరంగల్లో 4-5 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ. 14,000-15,500, 341 రూ. 13,000–14,800, తాలు కాయలు తేజ రూ. 8000 మరియు 18-20 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు తేజ రూ. 13,000-15,700, వండర్ హాట్ రూ. 15,000-18,500, 341 రూ. 15,000-18,000, డిడి రూ. 13,000-16,000, నెంబర్-5 రూ. 12,000–14,000, 1048 రూ. 12,500-14,800, టమాట రూ. 18,000-20,600, సింగిల్ పట్టి రూ. 15,000–17,000,

 ఖమ్మంలో గత వారం 30-32 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 16,750, మీడియం రూ. 15,500-16,500, తాలు కాయలు రూ. 6800 మరియు 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ రూ.16,500, తాలు కాయలు రూ 7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

హైదరాబాద్లో గత వారం 24-25 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 11,000-15,500, బడిగ రూ. 15,000-22,000, 273 రూ. 12,000-14,000, 341 రూ.10,000-15,000, సి-5 రూ.13,000-15,000, డిడి రూ. 11,000-15,000, నిమ్ము సరుకు రూ. 8000-12,000, తాలు కాయలు తేజ రూ.5000-8000, ఇతర రకాలు రూ. 1000-5000, శీతల గిడ్డంగులలో నిల్వ అయిన తేజ నాణ్యమైన సరుకు రూ. 14,000-17,000, మీడియం రూ. 12,000-13,000, సూపర్-10 నాణ్యమైన సరుకు రూ. 15,000-16,500, మీడియం రూ. 11,000-14,000, 273 రూ. 12,000-15,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

మధ్య ప్రదేశ్ లోని బేడియాలో గత ఆది, బుధ, గురువారాలలో కలిసి 80-90 వేల బస్తాల సరుకు రాబడిపై మహి రూ. 9000-11,000, లాల్కట్ రూ. 4500-5500, తాలు కాయలు రూ. 4000-4500, మహి తొడిమ తీసిన సరుకు రూ. 10,500-12,500, లాల్ కట్ రూ. 750-8500, ధామనోద్లో శుక్రవారం 45 వేల బస్తాలు అత్యధిక సరుకు నిమ్ముతో ఉన్నందున 720 సానియా రకం రూ. 11,000-12,000, ఎండు సరుకు రూ. 13,000, నెంబర్-12 రూ. 9000-11,000, తాలు కాయలు దొడ్డు రకం రూ. 4000-4500, సన్న రకం రూ. 7500, ఇండోర్లో 8-10 వేల బస్తాలు మహి రూ. 9000-9500, లాల్కట్ రూ. 7000-7500, తాలు కాయలు రూ. 4000-5500, మహి తొడిమ తీసిన సరుకు 10,000-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నందూర్ బార్లో ప్రతి రోజు 3-4 వేల క్వింటాళ్ల కొత్త సరుకు రాబడిపై విఎన్ఆర్ రూ.2700-3500, 5531 రూ. 3000-3400 ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడ్లీలో సోమ మరియు గురువారాలలో కలిసి 2–94 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై కెడిఎల్ డబ్బి రూ. 35,000-41,000, డీలక్స్ రూ. 26,000-32,000, మీడియం బెస్ట్ రూ.22,000-25,000, మీడియం రూ. 6000-9500, 2043 డీలక్స్ రూ. 17,000-22,000, 5531 నాణ్యమైన సరుకు రూ. 12,000-15,500, మీడియం రూ. 10,000- 12,000, తాలు కాయలు కెడిఎల్ రూ. 1500-2500, సీడ్ రకం రూ. 4500-6500 మరియు సోమవారం 15 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై 3 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా డబ్బి డీలక్స్ రూ. 33,000-36,000, మీడియం రూ. 30,000–32,000, కెడిఎల్ డీలక్స్ రూ.26,000–30,000, మీడియం రూ. 23,000-25,000, 2043 డీలక్స్ రూ.21,000-24,000, మీడియం రూ. 18,000-21,000, 5531 రూ. 13,000-15,500, తాలు కాయలు రూ.3500-5500, సింధనూర్ మంగళవారం 20 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై బడిగ రూ. 24,000-30,000, రూ.20,000-23,500, 5531 రూ. 10,000-15,000, సూపర్-10 రూ. 12,000-15,000, తాలు కాయలు రూ.2500-8000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్ గత వారం 5-6 వేల బస్తాల శీతల గిడ్డంగుల సరుకు అమ్మకంపై తేజ మరియు సన్-గ్రో రూ. 12,000-15,500, 4884 రూ. 11,000-13,000, తాలు కాయలు తేజ రూ. 8000-9000 మరియు 2500-3000 బస్తాల కొత్త సరుకు తేజ రూ. 14,000-15,000, తాలు కాయలు రూ. 8000-9000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు