క్షీణించిన నువ్వుల కొనుగోళ్లు

 

09-01-2022

ప్రస్తుతం నువ్వులకు కొరవడిన ఎగుమతి డిమాండ్ మరియు దేశంలో సంక్రాంతి పండుగ కొనుగోళ్లు ముగిసినందున ధర ప్రతి క్వింటాలు రూ. 500-600 పతనమైంది. రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, గంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 10-12 వేల బస్తాల సరుకు రాబడిపై తెల్లనువ్వులు రూ. 9000-10,000, గజ్జర్ నువ్వులు రూ. 8700-9000, తమిళనాడు డెలివరి రూ. 7300, తెల్లనువ్వులు రూ.7500 ప్రతి క్వింటాలు ధరతో జనవరి 20 వరకు లోడింగ్ కండిషన్తో వ్యాపారమైంది. ఒడిశ్శాలోని మల్కన్ గిరి ప్రాంతంలో కొత్త నువ్వుల రాబడి సంక్రాంతి తర్వాత ప్రారంభమై రాబడులు మరింత పోటెత్తే అవకాశం ఉంది. 


గత వారం మధ్య ప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,100-10,200, 

ఆగ్రాలో హల్లింగ్ సరుకు రూ. 9900-10,000, 99.1 సరుకు రూ. 11,200-11,300, 98.1 రకం సరుకు రూ. 10,700-10,800, సార్టెక్స్ రూ. 11,400-11,500, 

కాన్పూర్లో హళ్లింగ్ సరుకు రూ. 10,100-10,200, 98.2 సరుకు రూ. 10,800-10,900 ప్రతి క్వింటాలు ధరతో నాణ్యతానుసారం వ్యాపారమైంది. 

గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 5-6 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 10,800-11,100, మీడియం రూ. 10,400-10,800, యావరేజ్ రూ. 10,000-10,350 మరియు 2 వేల బస్తాల నల్లనువ్వుల ప్రీమియం బ్రాండ్రూ. 11,800-12,200, జడ్ బ్లాక్ రూ. 11,750–12,250, యావరేజ్ రూ. 9500-10,800, క్రషింగ్ రకంరూ. 7000-8500 ధరతో వ్యాపారమైంది. 

కర్నాటకలోని ముదగల్, అరిసెకేరి, కల్బుర్గి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో నాణ్యమైన కు రూ. 10,000-10,500, తమిళనాడు డెలివరి 75 కిలోల బస్తా రూ. 7500-8500,

 ఆంధ్రప్రదేశ్లోని సత్తెనపల్లి, నరసరావుపేట, కడప, రాజంపేట ప్రాంతాలలో నాణ్యమైన సరుకు రూ. 9100-9200, హళ్లింగ్ సరుకు తమిళనాడు డెలివరి రూ. 9700-9800 ప్రతి క్వింటాలు మరియు మైసూరులో 75 కిలోల బస్తా రూ. 7500-8500 ధరతో వ్యాపారమె తమిళనాడు కోసం రవాణా అయింది. పశ్చిమ బెంగాల్లో మైక్రో-క్లీన్ రూ. 8800-9500 జిఎస్టితో, అన్-క్లీన్ రూ. 7000-700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు