25, మార్చి వరకు దేశంలో యాసంగి మినుముల విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.38 ల.హె. నుండి పెరిగి 2.31 ల.హె.లకు చేరింది. దీనితో తమిళనాడు, మధ్యప్రదేశ్ నుండి సరఫరా పెరిగే అవకాశం ఉన్నందున మిల్లర్లు సరుకు నిల్వ చేయడం లేదు. ఎందుకనగా దేశంలో సమృద్ధిగా సరుకు నిల్వలు ఉన్నాయి. ఇప్పటికీ, రబీ సీజన్ సరుకు సరఫరా అవుతున్నది.
అంతర్జాతీయ విపణిలో మయన్మార్ మినుములు ఎఫ్ఎక్యూ 25 డాలర్లు పెరిగి 860 డాలర్లు, ఎస్క్యూ 935 డాలర్ ప్రతి టన్ను ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6625, పాత సరుకు రూ. 6575, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ. 6375, ఎస్యూ రూ. 7000, దిల్లీలో ఎస్యూ రూ. 7300-7375, ఎఫ్ఎక్యూ రూ. 6700-6775, కోల్కతాలో రూ. 6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళ నాడులో విల్లుపురం ప్రాంతపు సరుకు చెన్నై డెలివరి రూ.7000, తంజావూరు Još 85. 6850-6900, రాయలసీమ సరుకు రూ. 6700 -6800, క్రిష్ణా జిల్లా కొత్త పాలిష్ రకం సరుకు రూ.7000-7050 ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు