ఈ ఏడాది దేశంలోని ప్రముఖ ఆముదాల ఉత్పాదక రాష్ట్రా లలో విస్తీర్ణం తగ్గడంతో గుజరాత్లోని పాటన్, సిద్దాపూర్, కడి, పలంతూర్, సాబరా కాంటా, ఊంఝా, బీజాపూర్, విశానగర్, మహసానా మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలోని ఆముదాల ఉత్పాదక కేంద్రాలలో కలిసి ప్రతిరోజు సుమారు 45-50 వేల బస్తాల సరుకు రాబడి కాగా, నాణ్యమైన సరుకు రూ. 6725-7000, మీడియం రూ.6400-6500, యావరేజ్ రకం రూ. 5800-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ఎన్సిడిఇఎక్స్ వద్ద గత సోమవారం నాడు ఏప్రిల్ వాయిదా రూ. 7108 తో ముగిసింది. అయితే మే వాయిదా సోమవారం రూ.7186తో ప్రారంభమైన తరువాత రూ.7176, జూన్ వాయిదా రూ. 7274 వద్ద ముగిసింది. వ్యాపారస్తుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఆముదాల ధరలు భారీగా పెరగడంతో రాబోవు ఖరీఫ్, రబీ సీజన్ లలో విస్తీర్ణం పెరిగే అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని మార్కెట్లలో కలిసి 2500–3000 బస్తాల రాబడిపై రూ.6400-6530, మహబూబ్నగర్ జిల్లాలో వారంలో 1000-1200 బస్తాల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6300-6450 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు