తమిళనాడులోని విల్లుపురం, మాయవరం, పనరుట్టి, చిదంబరం, తంజావూరు తదితర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 2000-2500 బస్తాల రాబడిపై కొత్త సరుకు రూ.6000-6850, విరుధ్ నగర్ సరుకు ఎస్క్యూ చెన్నై డెలివరి రూ. 7400 ధరతో వ్యాపారమైంది.
అంతర్జాతీయ విపణిలో మయన్మార్ ఎఫ్ఎక్యూ సోమవారం 1025 డాలర్లతో పోలిస్తే శనివారం వరకు 10 డాలర్లు పెరిగి 1035 డాలర్లు, ఎస్ఎక్యూ 930 డాలర్లతో పోలిస్తే 5 డాలర్లు పెరిగి 935 డాలర్లు ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించడంతో ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 6900-6950, చెన్నైలో ఎఫ్ఎక్యూ రూ.6750, ఎస్క్యూ రూ. 7400, దిల్లీలో ఎ క్యూ రూ. 77750 -7800, ఎఫ్ఎక్యూ రూ. 7100 -7150, కోల్కతాలో ఎఫ్ఎ క్యూ రూ. 6950-7000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
దేశంలో ఏప్రిల్ 18 వరకు యాసంగి మినుము విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 1.86 ల.హె. నుండి 1.36 ల.హె. పెరిగి 3.22 ల.హె. లకు చేరింది. దీనితో కొన్ని రాష్ట్రాల వ్యాపారులు దిగుమతి అయిన సరుకు కొనుగోలు చేసి నిల్వ చేసిన సరుకు విక్ర యిస్తున్నారు.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు