ఈఏడాది రెతులు తమ అవసరానికి అనుగుణంగానే సరుకు విక్రయిస్తున్నందున మార్కెట్లలో రాబడులు పెరగడం లేదు. ఉత్పత్తి సంతోషజ నకంగా ఉండడంతో ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా అమ్మకానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నందున ధరలు నిలకడగా ఉన్నాయి.
గుజరాత్లోని ఊంఝా మార్కెట్లో గత వారం 8-10 వేల బస్తాల సోంపు రాబడి పై యావరేజ్ సరుకు రూ. 9000-10,000, మీడియం రూ. 11,000-11,500, నాణ్యమైన సరుకు రూ. 12,000-12,500, రాజస్తాన్లోని మెడతాలో 3 వేల బస్తాలు, పాలి, జోధ్పూర్ మరియు ఇతర ఉత్పాదక మార్కెట్లలో కలిసి 2-3 వేల బస్తాల సరుకు రాబడిపై యావరేజ్ సరుకు రూ. 9500-9700, మీడియం రూ. 10,500-11,200, మీడియం బెస్ట్ రూ. 12,500–13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు