మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, గుజరాత్లో మినుము పంట నూర్పిళ్లు శరవేగంతో చేపడుతున్నారు. మరో రోజులలో రాబడులు పోటెత్తగలవని తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాబడులు పోటెత్తుతున్నాయి. డ్యామేజ్ సరుకు రాబడి అవుతుండగా, నాణ్యమైన సరుకు కోసం తమిళనాడు నుండి డిమాండ్ నెలకొన్నందున ధరలకు మద్దతు లభిస్తున్నది. అయితే మున్ముందు ఒక దశలో మందగమనం పొడసూపిన తర్వాత బలోపేతం చెందగలవని వ్యాపారులు భావిస్తున్నారు.
ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో సెప్టెంబర్ 8 వరకు దేశంలో మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 38.82 ల.హె. నుండి పెరిగి 38.89 ల.హె.కు విస్తరించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలలో పేర్కొన్నది.
ఇందులో మహారాష్ట్రలో 3.89 ల.హె. నుండి పెరిగి 4.32 ల.హె.,
రాజస్తాన్లో 3.77 ల.హె. నుండి 3.97 ల.హె.,
ఉత్తరప్రదేశ్లో 6.87 ల.హె. నుండి 6.99 ల.హె.,
గుజరాత్లో 1.00 నుండి 1.55 ల.హె. విస్తరించగా,
కర్ణాటకలో 1.07 ల.హె. నుండి తగ్గి 96 వేల హెక్టార్లు,
తెలంగాణలో 18 వేల హెక్టార్ల నుండి 17 వేల హెక్టార్లకు పరిమితమైంది.
అంతర్జాతీయ విపణిలో డాలర్లు పెరిగి 930 డాలర్, ఎస్క్యూ 45 డాలర్లు వృద్ధి చెంది 1110 డాలర్ ప్రతి టన్ను సి అండ్ ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో ఎఫ్ఎక్యూ కొత్త సరుకు రూ. 7150, పాత సరుకు రూ. 7050, చెన్నై డెలివరి ఎస్క్యూ రూ. 8000, ఎఫ్ఎక్యూ రూ. 6900, కోల్కతాలో రూ. 7000, దిల్లీలో ఎస్క్యూ రూ. 8300, ఎఫ్ఎక్యూ రూ.7200 ధరతో వ్యాపారమైంది.
ఆంధ్రప్రదేశ్లోని క్రిష్ణా జిల్లా పాలిష్ మినుములు రూ. 7900, అన్-పాలిష్ రూ. 7500,
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు