మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర లలో నవంబర్ నుండి పోటెత్తనున్న కొత్త మిరప


18-10-2021

 వ్యాపారస్తుల కథనం ప్రకారం నవంబర్ మొదటి మొదటివారం నుండి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో రాబడులు పెరిగే అవకాశం కలదు. దీనితో ధరల పెరుగుదలకు అడ్డుకట్ట పడింది. ఎందుకనగా, అధిక నిల్వలు ఉన్నప్పటికీ స్టాకిస్టులు నెమ్మదిగా విక్రయిస్తున్నారు.


గుంటూరు మార్కెట్లో సోమ, మంగళ వారాలలో కోల్డుస్టోరేజీలనుండి 2.30 లక్షల బస్తాల మిరపరాబడిపై, ఇందులో గుంటూరు కోల్డు స్టోరేజీల నుండి 80 వేల బస్తాలు మరియు ఇతర ప్రాంతాల కోల్డుస్టోరేజీలనుండి 35 వేల బస్తాలు కలిసి 1.15 లక్షల బస్తాల సరుకు అమ్మకమయింది. ఇందులో తేజ డీలక్స్, 334 రకం, సూపర్-10 మరియు 341 డీలక్స్ రకాలకు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ సరుకు కొరతవలన ధరలు రూ. 200 పెరిగాయి. అయితే, ఇతర రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు మీడియం, మీడియం బెస్ట్ రకాల అమ్మకాలు తగ్గి క్వాలిటీ ప్రకారం వ్యాపారమయ్యాయి.

 గుంటూరు కోల్డు స్టోరేజీలలో నిల్వ అయిన నాణ్యమైన 

తేజ రూ. 13000–14000, డీలక్స్ రూ. 14100–14200, ఎక్స్ ట్రార్డినరీ రూ. 14300 -14400, మీడియం బెస్ట్ రూ. 11500-12900, మీడియం రూ. 10500-11400, 

బ్యాడ్డీ-355రకం రూ. 13000 -16000, 

సింజెంటా బ్యాడ్లీ రూ. 10000- 11800, డీలక్స్ రూ. 11900-12000, 

డిడి రూ. 11000-12800, 

341 రకం రూ. 11000– 13000, డీలక్స్ రూ. 13100– 13300, 

నెం-5 రకం రూ. 11000- 12800, డీలక్స్ రూ. 12900-13000, 

273 రూ. 11000-12800,

577 రకం రూ. 10000-11600, 

334 మరియు సూపర్ -10 రకం రూ. 9500 -11000, డీలక్స్ రూ. 11100-11300, ఎక్స్ట్రార్డినరీ రూ. 11400 -11500, మీడియం బెస్ట్ రూ. 8000-9400, మీడియం రూ. 7000 -7900,

 334 మరియు సూపర్ -10 గత సంవత్సరం రూ. 7000-10200, 

4884 రకం రూ. 10500-12000,

 రోమి రకం రూ. 10500-12800, 

ఆర్మూరు రకం రూ. 9000-10300, 

బంగారం రకం రూ. 9000-11000, మీడియం, మీడియం బెస్ట్ మరియు 

అని రూ. 8000-10800, 

తేజ తాలు రూ. 7000 - 8000, 

తాలు రూ. 3500 7000 ధరతో వ్యాపారమయింది.


ఖమ్మంలో సోమ మరియు బుధవారాలలో కలిసి 18-19 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 14150, మీడియం రూ. 13500-14000, తాలు రూ. 7500 మరియు

 వరంగల్ లో గతవారం 15-16 వేల బస్తాల ఎసి సరుకు రాబడిపై నాణ్యమైన తేజ రూ. 14000, మీడియం 11000-13000, నాణ్యమైన వండర్హాట్ రూ. 14500, మీడియం రూ. 11000-13000, నాణ్యమైన డిడి రూ. 13800, 1048 రకం మీడియం రూ. 10000, దీపికా మీడియం రూ. 12500, నాణ్యమైన టమాటా రూ. 19600, సింగిల్పట్టీ రూ. 14000, 334 రకంరూ. 10000, తాలు రూ. 5000-7000 ధరతో వ్యాపారమయింది.


హైదరాబాద్లో గతవారం 1500 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై నాణ్యమైన తేజ రూ.13500, మీడియం రూ.11500-12500, సూపర్-10 రూ. 10000-10500,నాణ్యమైన 273 రకం రూ. 12500, మీడియం రూ. 11000-12000, రూ.12500-13000, సి -5 రకం రూ. 11000-13000, తేజ తాలు రూ. 6000 - 7500, మీడియం రూ. 4500, హైబ్రిడ్ తాలు రూ.3500-4000 మరియు 

కర్నూలు ప్రాంతం నుండి 150 బస్తాల కొత్త సరుకు రాబడిపై సీడ్ రకం రూ. 6000-8000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.


కర్నాటకలోని బ్యాడ్గి లో సోమవారం 200 బస్తాల కొత్త సరుకు రాబడిపై 5531 రకం రూ. 10000, జిటి రూ. 8500-9500, తాలు రూ. 4000-5500, కోల్డుస్టోరేజీల నుండి 15 వేలబస్తాల రాబడిపై 5 వేల బస్తాలు అమ్మకంకాగా డీలక్స్ డబ్బీ రూ. 21000-22700, మీడియం రూ. 17000-19000, మీడియం రూ. 14000–16000, 2043 డీలక్స్ రూ. 14000-16000, మీడియం రూ. 11000-13000, 5531 రకం రూ. 9500-11500, డిడి రూ. 11000-13000, 334మరియు సూపర్ -10 రకాలు రూ.9000 1000, తాలు రూ.3500-5000 మరియు

 సింధనూరులో మంగళవారం కోల్డు స్టోరేజీలనుండి 2 వేల బస్తాల రాబడిపై సింజెంటా బ్యాడ్డీ రూ. 10000-15000, 5531 రకం రూ. 10000-13000, జిటి రకం రూ. 8000 -10000, హైబ్రడ్ తాలు రూ. 3000-4000 ధరతో వ్యాపా రమయింది.

 ఛత్తీస్గడ్ లోని జగదల్పూర్ గతవారం 4-5 వేలబస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ మరియు సన్ రకాలు రూ. 11000 -13700, 4884 8šo రూ. 10000-12000, తేజ తాలు రూ. 7000 -7500 ధరతో వ్యాపారమయింది. 

మధ్య ప్రదేశ్లోని బేడియాలో ఆది, సోమ వారాలలో కలిసి 6-7 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై మహీ ఫూల్ కట్ రూ. 10000-12000, తొడిమతో రూ. 10000-11000, ఫూల్కట్ తాలు రూ. 5000, తొడిమతో తాలు రూ. 4000 -5000 ధరతో వ్యాపార మయింది మరియు 

ఆదివారం 17, అక్టోబర్ బేడియాలో 18-20 వేల బస్తాల కొత్త మిరప రాబడి అయ్యే అంచనా కలదు. వచ్చే వారం నుండి ఖండ్వా, ధామునోద్, ఇండోర్ ప్రాంతాలలో కొత్త మిరప రాబడి ప్రారంభమయ్యే అవకాశం కలదు.










Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు