దేశంలో సమృద్ధిగా శనగ నిల్వలు - గత వారం మార్కెట్ ధరలు

 

12-10-2021

దేశంలోని ప్రముఖ ఉత్పాదక రాష్ట్రాలలో భారీగా శనగల నిల్వలు ఉన్నాయి. దీపావళి పండుగ డిమాండ్ కోసం కేవలం ఒకనెల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం అనుకూల వర్షాల నేపథ్యంలో విస్తీర్ణం మరియు దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు నిరాశకు గురవుతున్నారు. ఎందుకనగా భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశం కనిపించడం లేదు.


లభించిన సమాచారం ప్రకారం రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ లోని స్టాకిస్టులు సరుకు అమ్మకం కోసం ముందుకు వస్తున్నారు. దీనితో ధరలు స్థిరంగా మారాయి. గత వారం ఎన్సిడిఇఎక్స్ వద్ద సోమవారం శనగల అక్టోబర్ వాయిదా రూ. 5050తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.30 తగ్గి రూ. 5020 వద్ద ముగిసింది. 

సెబీ వారు వచ్చే నెల కోసం వాయిదా వ్యాపారానికి అనుమతించకపోవడంతో వ్యాపారులు 20 అక్టోబర్న వాయిదా సమాప్తమైన తరువాత సెబీ వారి ఆదేశం అనంతరం తిరిగి వాయిదా వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంది. దీనితో మార్కెట్లో పాటు వాయిదా ధరలపై కూడా ప్రభావం పొడసూపుతుంది.


తమిళనాడులోని టుటికోరిన్ ఓడరేవులో టాంజానియా శనగలు రూ. 5250, ముంబైలో రెడీ సరుకు రూ.4900-5050, రష్యా కాబూలి శనగలు రూ. 4850, సూడాన్ కాబూలీ సరుకు 5450-5600 ధరతో వ్యాపారమైంది.


దిల్లీ లారెన్స్ రోడ్డు వద్ద గత వారం 115-120 లారీల శనగల రాబడిపై రాజస్థాన్ సరుకు రూ. 5300-5325, మధ్య ప్రదేశ్ సరుకు రూ. 5200-5225 వ్యాపారమెంది. 


ఆంధ్రలోని ఒంగోలులో జెజె రకం రూ. 4900, కాక్-2 కాబూలీ శనగలు రూ.6800, డాలర్ రకం రూ. 8700, 

ఇంకొల్లులో జెజె రకం రూ. 4800,

 తాడిపత్రిలో రూ. 5100, 

కర్నూలులో రూ. 4950, 

హెదరాబాద్లో రూ. 5300 

మరియు గుంతకల్ ప్రాంతపు సరుకు ఈరోడ్ డెలివరి రూ. 50 తగ్గి రూ.5350-5400 ధరతో వ్యాపారమెంది.

 మహరాష్ట్రలోని సోలాపూర్ లో అన్నిగిరి రకం రూ. 5400-5525, రకం శనగలు రూ. 5000-5200, 800 - 1000 బస్తాల రాబడి పె అన్నిగిరి, విజయ రకం రూ. 4800-5100, అమరావతిలో రూ. 4800-5000 లోకలూజ్ మరియు అకోలాలో లారీబిల్టీ రూ. 5225 5250 ధరతో వ్యాపారమెంది.


రాజస్థాన్ లోని కేక్డి లో 800-1000 బస్తాల రాబడిపై రూ. 4700-4900, బికనేర్లో రూ.4950, సర్ పూర్ రామంజుండీలో రూ.4600-4900, జెపూర్లో రూ. 5300, శనగపప్పు రూ. 6025 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమెంది.


మధ్యప్రదేశ్ లోని దామోహ్, దేవాస్, హర్దా, జబల్ పూర్ ప్రాంతాలలో రూ. 4800-5150, కాబూలీ శనగలు రూ. 8200 9100, ఇండోర్లో రూ.5350 5375, డాలర్ శనగలు రూ. 8800 -9300, కాబూలి రకం 42-44 కౌంట్ ధర రూ. 200 పెరిగి రూ. 9600 మరియు 44-46 కౌంట్ రూ. 9450 మరియు 58-60 కౌంట్ రూ. 9250, 60-62 కౌంట్ రూ. 9150, 62-64 కౌంట్ రూ. 9050 మరియు కల్బుర్గీలో రూ. 5100-5200 ధరతో వ్యాపారమెంది.




Comments

Popular posts from this blog

పంజాబ్లో గణనీయంగా రాణించిన మిర్చి పంట - మే 15 నుండీ గుంటూరు మార్కెట్ కు వేసవి సెలవులు