పసుపు అమ్మకాలకు సిద్దమవుతున్న స్టాకిస్టులు - గత వారం మార్కెట్ ధరలు
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
-
18-10-2021
అన్ని ఉత్పాదక కేంద్రాలలో భారీగా పసుపు నిల్వలు ఉన్నందున మరియు మార్కెట్లో గిరాకీ తక్కువగా ఉన్నందున ధరల పెరుగుదలకు అవకాశాలు సమాప్తమయ్యాయి. జనవరి మొదటి వారంలో మిగులు నిల్వలు మరియు కొత్త సీజన్లో ఉత్పత్తి కలిసి 2022 డిసెంబర్ వరకు వినియోగంతో పోలిస్తే అధికంగా ఉండే అవకాశమున్నందున చిన్న స్టాకిస్టులు బయట పడడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
దేశంలో భారీగా పసుపు నిల్వలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు తరచుగా లక్షలాది బస్తాల ఉత్పత్తి మరియు మిగులు నిల్వలు ఉన్నట్లు ప్రచారం చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయినప్పటికీ ధర తగ్గి రూ. 4000 కు చేరే అవకాశం లేదు. కేవలం సాధారణ స్థాయిలో వ్యాపారం ఉండగలదు. లభించిన సమాచారం ప్రకారం ఒకవేళ ఏప్రిల్ వాయిదా రూ. 6000 కంటే అధికంగా ఉంటే కొనుగోలు చేయడం మరియు రూ.7500 ధరతో విక్రయించడం లాభదాయకంగా ఉండగలదు. ఎందునకనగా, డెలివరీ సమయంలో కొనుగోలుదారులు కనుమరుగవుతారు. వ్యాపారస్తుల కథనం ప్రకారం ప్రతిసంవత్సరం మాదిరిగా నిజామాబాద్ లో డిసెంబర్ చివరినాటికి కొత్త పసుపు రాబడులు ప్రారంభం కాగలవు. అయితే, ఆర్మూరు, మెట్పల్లి తదితర ప్రాంతాల సరుకు జనవరిలోపు రాబడి కాదు.
ఎన్సీడిఇఎక్స్ సోమవారం అక్టోబర్ వాయిదా రూ. 7220 తో ప్రారంభమైన తరువాత గురువారం వరకు రూ. 180 పెరిగి రూ. 7400, నవంబర్ వాయిదా రూ. 56 తగ్గి రూ. 7282 తో ముగిసింది.
నిజామాబాద్ లో మంగళ మరియు బుధ వారాలలో కలిసి 2 వేల బస్తాల రాబడిపై అన్ పాలిష్ కొమ్ము రూ.6500-7000, గట్టా రూ.6200-6500, పాలిష్ కొమ్ము రూ.7500-7600, గట్టా రూ. 7200–7300,
03-10-2021 రాబోయే కాలంలో శనగల ధరలు రాణించే అవకాశం కనిపించడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. దేశంలో సరుకు నిల్వలు ఇబ్బడిముబ్బడిగా పేరుకుపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు