గత వారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి మిర్చి ఉత్పాదక రాష్ట్రాలలోని శీతల గిడ్డంగుల నుండి 4 లక్షల బస్తాలు మరియు 3 లక్షల కొత్త మిర్చి కలిసి మొత్తం 7 లక్షల బస్తాలకు పైగా సరుకు రాబడి అయినప్పటికీ గడిచిన వారంలో నాణ్యమైన రకాల ధరలు రూ. 4000-5000, మీడియం రకాలు రూ. 1000 -1500 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి. ఎందుకనగా, దక్షిణాది రాష్ట్రాలలో సేద్యం గణనీయంగా విస్తరించినప్పటికీ అతివృష్టి మరియు కీటక సంక్రమణం వలన పంటకు తీరని నష్టం వాటిల్లడమే ఇందుకు నిదర్శనం. దీనితో స్టాకిస్టులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
మధ్య ప్రదేశ్లోని బేడియాలో గత ఆది, బుధ, గురువారం కలిసి 50-55 వేల బస్తాలు, ఇండోర్లో గత వారం 10-12 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై ధర రూ. 1000-1500 వృద్ధి చెంది రూ. 10,000- 13,000, లాల్కట్ రూ. 7000- 8000, తాలు కాయలు రూ. 4500 – 5500 మరియు తొడిమ తీసిన సరుకు రూ. 12,000-15,500, తాలు కాయలు రూ. 5500-6500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
ధామనోద్లో శుక్రవారం 40-45 వేల బస్తాలు 720 మరియు సానియా రూ. 12,000-14,500, మీడియం రూ. 7000-8000, సన్న సరుకు రూ.11,000-12,500, 720 రకం మరియు సానియా స్థానికంగా లోకల్ లూజ్ లారీ బిల్టి రూ. 15,000 -15,200, సన్న సరుకు రూ. 13,500, మీడియం రూ. 9500, తాలు కాయలు రూ. 5000 మరియు
ఇండోర్లో 720 రకం మరియు సానియా రూ. 14,000-16,000, మీడియం రూ. 8000 -10,000, తొడిమ తీసిన సరుకు రూ. 16,000-18,000,
కుక్షిలో మంగళవారం 2 వేల బస్తాలు 720 రకం మరియు సానియా రూ.12,500 -15,200, మీడియం రూ.9000 -12,000, తాలు కాయలు రూ. 2500–5000, తొడిమ తీసి సరుకు రూ. 13,500-17,500, మీడియం రూ. 11,000-13,000, తాలు కాయలు రూ. 5000-7000 ధరతో వ్యాపార మైంది.
గుంటూరు మార్కెట్లో గత వారం శీతల గిడ్డంగుల నుండి 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా, గుంటూరు మరియు పరిసర ప్రాంతాల శీతల గిడ్డంగుల సరుకుతో పాటు 1.50 లక్షల బస్తాల సరుకు విక్రయించబడింది. తేజ డీలక్స్,4884, డిడి, 341 రకాలు రూ. 3500, 577, రెమి, నెంబర్-5 రూ. 3000, 355-బడిగ రూ. 1700, సింజెంట బడిగ, 273 రూ.2500, ఆర్మూర్ మరియు బంగారం రకం రూ. 4000, సూపర్-10, 335 రూ. 5000 మరియు అన్ని మీడియం, మీడియం బెస్ట్ సీడ్ రకాల ధరలు రూ.2000-3000, తేజ తాలు కాయలు రూ. 1500, ఇతర రకాలు మరియు సీడ్ రకాలు రూ. 2000 ప్రతి క్వింటాలుకు వృద్ధి చెందాయి.
అన్ని సీడ్ రకాల మీడియం మరియు మీడియం బెస్ట్ రూ. 14,000-17,000,
తాలు కాయలు తేజ రూ. 8500-10,000,
ఇతర రకాలు రూ. 5000-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
డీలక్స్ రకాల కోసం గ్రైండింగ్ యూనిట్ల నుండి భారీ డిమాండ్ నెలకొన్నది. 70 శాతం సరుకు నాసిరకంగా మారిందనే సంకేతాలు అందుకున్న స్టాకిస్టులు సరుకు కొనుగోలుచేసి శీతల గిడ్డంగులలో నిల్వ చేస్తున్నారు. రాబోయే రోజులలో ధరలు మరింత ఇనుమడించగలవనే అంచనాయే ఇందుకు నిదర్శనం.
గుంటూరు యార్డులో కర్నూలు, ఎమ్మిగనూరు, ప్రకాశం జిల్లాల నుండి 50 వేల బస్తాల కొత్త మిర్చి రాబడి కాగా మొత్తం సరుకు అమ్మకమైంది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు