కర్ణాటకలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లిన తర్వాత రాగులు స్టాకిస్టులు ఒంటికాలు మీద లేచి నిలబడ్డారు. గత వారం మహబూబ్ నగర్ లో 2-3 వాహనాల రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2500-3125, మీడియం రూ. 2300-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై విజయవాడ కోసం రవాణా అవుతున్నది.
నవాబ్ పేట మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 500 బస్తాల సరుకు వ్యాపారం కాగా రూ. 2200- 2600, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై చీపురుపల్లి ప్రాంతం సరుకు రూ. 2900, వార్వతీపురం ప్రాంతం సరుకు రూ. 2450 ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, తణుకు కోసం రవాణా అవుతున్నది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు