కర్ణాటకలో ఖరీఫ్ పంటలకు నష్టం వాటిల్లిన తర్వాత రాగులు స్టాకిస్టులు ఒంటికాలు మీద లేచి నిలబడ్డారు. గత వారం మహబూబ్ నగర్ లో 2-3 వాహనాల రాగుల రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 2500-3125, మీడియం రూ. 2300-2500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై విజయవాడ కోసం రవాణా అవుతున్నది.
నవాబ్ పేట మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 500 బస్తాల సరుకు వ్యాపారం కాగా రూ. 2200- 2600, ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో 2-3 వాహనాల సరుకు అమ్మకంపై చీపురుపల్లి ప్రాంతం సరుకు రూ. 2900, వార్వతీపురం ప్రాంతం సరుకు రూ. 2450 ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం, తణుకు కోసం రవాణా అవుతున్నది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు