గతవారం దక్షిణ భారత్లో గిరాకీ తక్కువగా ఉండడంతో ధనియాల ధర రూ. 150-200 మరియు వాయిదా ధరలు రూ. 400-500 ప్రతిక్వింటా లుకు తగ్గాయి. లభించిన సమాచారం ప్రకారం రాజస్తాన్, మధ్య ప్రదేశ్, గుజ రాత్ లలో విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే తగ్గడంతో ప్రస్తుతం స్టాకిస్టులు నెమ్మదిగా సరుకు విక్రయిస్తున్నారు. అయితే, పొంగల్ పండుగ కోసం డిసెంబర్ రెండవ వారం నుండి గిరాకీ వచ్చే అవకాశముంది. ఎన్ సిడి ఇఎ క్స్ సోమవారం డిసెంబర్ వాయిదా రూ.8722 తో ప్రారంభమైన తరువాత శుక్రవారం వరకు రూ.402 తగ్గి రూ. 8320, జనవరి వాయిదా రూ. 524 తగ్గి రూ. 8406తో ముగిసింది.
రాజస్తాన్ లోని రాంగంజ్ మండీలో గతవారం 12-15 వేల బస్తాల రాబడి పై బాదామీ రూ. 7300-7400, ఈగల్ రూ. 7800-8000, స్కూటర్ రూ.8300-8400, ధనియాల పప్పు బాదామీ రూ. 7800, ఈగల్ రూ. 8300 ప్రతిక్వింటాలు లోకల్ లూజు మరియు ప్రతి 40 కిలోలు లారీ బిల్టీ బాదామీ రూ. 3500, ఈగల్ రూ. 3700 ధరతో వ్యాపారమయింది.
కోటాలో గతవారం దాదాపు 5 వేల బస్తాలు, బారన్లో 4-5 వేలు, భవానీమండీ, ఛబ్జా, ఇటావా ప్రాంతాల మార్కెట్లలో కలిసి 7-8 వేల బస్తాల రాబడి పై బాదామీ రూ. 7200-7400, ఈగల్ రూ. 7500-7800 ప్రతిక్వింటాలు ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది.
మధ్యప్రదేశ్లోని గునాలో గత వారం 7-8 వేల బస్తాలు మరియు కుంభరాజ్లో 2-3 వేల బస్తాలు రాబ డిపై బాదామీ రూ. 7000-7500, ఈగల్ రూ. 7700-8000, స్కూటర్ రూ. 8200-8300 మరియు
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు