రబీ వేరుశనగ... రికార్డు సేద్యం

 

19-12-2021

దేశంలో ఖరీఫ్ సీజన్  వేరుసెనగ ఉత్పత్తి గణనీయంగా వృద్ధి చెందినప్పటికీ స్వేచ్ఛా విపణిలో కనీస మద్దతు ధర అధిగమించాయి. తద్వారా రబీ సీజన్ కోసం డిసెంబర్ 17 వరకు దేశంలో వేరుసెనగ సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 3.12 ల.హె. నుండి పెరిగి 3.25 ల.హె.కు విస్తరించింది. గ్రీష్మ కాలంలో కూడా భారీగా విస్తరించే అవకాశం కనిపిస్తున్నది. ఎందుకనగా, గత రెండు సీజన్లలో కూడా రైతులకు లాభసాటి ధరలు గిట్టుబాటు కావడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది కురిసిన కుండపోత వర్షాలకు నేలలో సంతృప్తికరమైన తేమ నిక్షిప్తమైన ఉన్నందున సేద్యం భారీగా విస్తరించే అంచనాతో మున్ముందు ధరలపై ఒత్తిడి కొనసాగే అంచనాతో స్టాకిస్టు వ్యాపారులు సరుకు కొనుగోలుకు ఆసక్తి కనబరచడంలేదు. అయితే, దేశంలో డిమాండ్ కు అనుగుణంగా సరఫరా అందుబాటులో ఉన్నందున ధరలు ఒడిదొడుకులకు లోనుకావడంలేదు. ఎగుమతులు కూడా ఆశించిన స్థాయిలో లేవు.


తెలంగాణలో వేరుసెనగ భారీగా విస్తరించిన సేద్యం వలన ఫిబ్రవరి నుండి రాబడులు ప్రారంభమయ్యే తరుణంలో ధరలు కుంగుబాట పట్టే అవకాశం కలదని వ్యాపారులు భావిస్తున్నారు. ఎందుకనగా, ఇదే వ్యవధిలో ఆవాలు, కుసుమలు, నువ్వులు లాంటి ఇతర నూనెగింజల రాబడులు పోటెత్తడమే ఇందుకు నిదర్శనం. ఏప్రిల్-మే లో మహారాష్ట్ర, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ యాసంగి వేరుసెనగ రాబడులు ప్రారంభం కాగలవు. ఇదే వ్యవధిలో పామాయిల్ వృద్ధి చెందిన పామాయిల్ ఉత్పత్తి ఇదే వ్యవధిలో దేశంలోకి సన్ఫ్లవర్నూనె దిగుమతులు ఉండగలవు.


గత వారం తెలంగాణలోని 

వనపర్తి, గద్వాల ప్రాంతాలలో 60-70 వేల బస్తాల కొత్త వేరుసెనగ రాబడిపై రూ. 500-800, నాణ్యమైన సరుకు హెచ్ పిఎస్ గింజలు 60-65 కౌంట్ హైదరాబాద్ డెలివరి రూ. 12,000, 60-70 కౌంట్ రూ. 11,700, 80-90 కౌంట్ రూ. 10,700, 90-100 కౌంట్ రూ. 10,400, కళ్యాణి రూ. 8700 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై హైదరాబాద్ కోసం డెలివరి వ్యాపారమవుతున్నది.

 మహబూబ్నగర్లో హెచ్పిఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 11,300, 90-100 కౌంట్ రూ. 10,400, కళ్యాణి రూ. 8700 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరులో గత వారం 40-50 వేల బస్తాలు వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.5600-7250, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర (విత్తుల కోసం) రూ. 9800, కిరాణా రకం స్థానికంగా రూ. 9850-9900, కళ్యాణ్ుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో 30-40 వేల బస్తాలు నాణ్యమైన సరుకు రూ.5500-6500, మీడియం రూ.5000-5400, నిమ్ము సరుకు రూ.4500-5200, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ స్థానికంగా రూ. 9700, చెన్నై కోసం ఎక్స్పోర్టు రకం రూ.9900, 70-80 కౌంట్ స్థానికంగా రూ. 10,200, 60-70 కౌంట్ రూ. 12,000, 60-65 కౌంట్ రూ. 13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది.


గుజరాత్లోని రాజ్కోట్లో గత వారం 60-70 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై తమిళనాడు నుండి విత్తులకు డిమాండ్ నెలకొనడంతో కళ్యాణి హెచ్పీఎస్ గింజలు పోర్టు డెలివరి రూ. 8900, టిజె-37 80-90 కౌంట్ రూ.9250-9300, 50-60 కౌంట్ రూ. 10,700-10,800, పోర్బందర్ డెలివరి రూ.50-55 కౌంట్ రూ. 8800, 40-50 కౌంట్ రూ. 8600, 50-60 కౌంట్ రూ. 8400, 60-70 కౌంట్ టిజె - 37 ముంబై డెలివరి రూ. 8200, 50-60 కౌంట్ జి-24 రూ. 10,800, 60-65 కౌంట్ రూ. 10,400, 60-70 కౌంట్ రూ.10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజ్కోట్లో వేరుసెనగ రోహిణి 24-నెంబర్ నాణ్యమైన సరుకు రూ.5500-5650, మీడియం రూ. 5350-5500, యావరేజ్ రూ. 5100-5200, 37-నెంబర్ మీడియం రూ.50-625, యావరేజ్ సరుకు రూ. 5450 -5500, 39-నెంబర్ బెస్ట్ రూ.500-5200, మీడియం రూ. 4750 -5100, యావరేజ్ సరుకు రూ. 4500-4800, జి-20 రకం సరుకు రూ. 5500-5700, మీడియం రూ. 5300-5450, యావరేజ్ రూ. 5100-5300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


గుజరాత్ లోని దిసా, గోండల్, పాలన్పూర్, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి గత వారం 2-3 లక్షల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 5800 -6120, మీడియం రూ. 4950 – 5200 ప్రతి క్వింటాలు మరియు నూనె 10 కిలోలు రూ.1250 -1275, జామ్నగర్ రూ. 1275, 

ఉత్తర ప్రదేశ్ లోని ఝాన్సీ, లలిత్ పూర్ మరియు మధ్య ప్రదేశ్ లోని శివపురి ప్రాంతాలలో కలిసి 20-30 వేల బస్తాల రక రాబడిపై 4200 - 5000, 75-85 కౌంట్ రూ. 8400 -8500, తమిళనాడులోని ఈరోడ్ డెలివరి రూ. 8800-9000, ఆంధ్రప్రదేశ్ డెలివరి రూ. 8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని బికనీర్లో ప్రతి రోజు 1 లక్ష బసాలు, మెడతా, జైపూర్, జోధ్పూర్ మరియు రాజస్తాన్లోని పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి 2 లక్షల బస్తాల సరుకు రాబడిపై స్థానికంగా రూ. 5500-5700, హెచ్పీఎస్ గింజలు 60-65 కౌంట్ రూ. 7900-8450, 60-70 కౌంట్ రూ. 7800, 40 - 50 కౌంట్ రూ. 8200 ధరతో వ్యాపారమై బీహార్, గుజరాత్, మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. 70-80 కౌంట్ ముంబై డెలివరి రూ. 10,400-10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, లక్ష్మీశ్వర్, హుబ్లీ,రాయిచూర్ ప్రాంతాలలో కలిసి గత వారం 1.50 లక్షల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ.6700-7650, నిమ్ము సరుకు రూ. 4000-4500, మీడియం రూ. 6000-6500, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర (9 శాతం) రూ. 9700 9750, కళ్యాణి ప్రత్యక్ష ధర రూ. 8900, 90-100 కౌంట్ రూ. 9000-10,000 ధరతో వ్యాపారమైంది.


తమిళనాడులోని కొడుముడి, శేవూరు, దిండివనం, అవలూరుపేట, జైగుండం ప్రాంతాలలోని అన్ని మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 7-8 వేల బస్తాలు రూ.7000–7300, మీడియం రూ. 6000-6600 ప్రతి క్వింటాలు మరియు త్రిచన్డ్లో గత వారం 2 వేల బస్తాలు వేరుసెనగ గింజల రాబడిపై ప్రతి 240 కిలోలు రూ. 15,800 -22,600 ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog