పెసరపప్పు గిరాకీ



 07-12-2021

గతవారం పప్పు మిల్లర్ల డిమాండ్ పెరగడంతో పెసల ధరలు రూ. 150-200 ప్రతిక్వింటాలుకు పెరిగాయి. ఇందుకు ముఖ్య కారణమేమనగా, దేశంలో రబీ సీజన్ కోసం విస్తీర్ణం తగ్గింది మరియు ఖరీప్ సీజన్ సరుకు రాబడులు దాదాపు సమాప్తమయ్యాయి. ఆంధ్ర, తమిళనాడులలో జనవరి నుండి ప్రారంభ మయ్యే పంటకోసం భారీ వర్షాల వలన కొత్త సరుకు రాబడులు ఆలస్యం కావ డంతో పాటు దిగుబడి తగ్గే అవకాశం కలదు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారి వివరాల ప్రకారం 2, డిసెంబర్ వరకు దేశంలో రబీ సీజన్ కోసం పెసర విస్తీర్ణం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే 85 వేల హెక్టార్ల నుండి తగ్గి 64 వేల హెక్టార్లకు చేరింది. ఇందులో ఒరిస్సాలో 45 వేల హెక్టార్ల నుండి తగ్గి 25 వేల హెక్టార్లకు మరియు ఆంధ్రప్రదేశ్లో 11 వేల హెక్టార్ల నుండి తగ్గి 9 వేల హెక్టార్లకు చేరింది. అయితే, తమిళనాడులో 23 వేల హెక్టార్ల నుండి పెరిగి 36 వేల హెక్టార్లకు చేరింది.


గతవారం లాతూరు, ఉద్గిర్ ప్రాంతాల సాదా పెసలు చెన్నై డెలివరీ రూ. 7000, కర్నాటక ప్రాంతపు సరుకు 90-10 రకం రూ. 7800, 80-20 రకం రూ. 7600, మిల్లు రకం రూ. 7100, 

రాజస్తాన్లోని కేక్తీ, మెడతా ప్రాంతాలలో కలిసి దినసరి 5-6 వేల బస్తాల రాబడిపై రూ. 5000-6700, జైపూర్లో పెసలు రూ. 6000-6900, పెసరపప్పు రూ. 7400-8300, మిటుకులు రూ. 6800-7400, 

మధ్యప్రదేశ్లోని పిప రియా, హరదా ప్రాంతాలలో రూ. 5500-6900, ఇండోర్ రూ.6800-7000 ధరతో క్వాలిటీ ప్రకారం వ్యాపారమయింది. 

పొన్నూరులో సాదా పెసలు రూ. 6900, పాలిష్ రూ. 7100, విజయవాడలో నాణ్యమైన పెసర పప్పు రూ. 9200, మీడియం రూ. 8800, 

ఖమ్మంలో పెసరపప్పు సార్టెక్స్ రూ. 8800, నానార్టెక్స్ రూ. 8400 ధరతో వ్యాపారమయింది.


 కర్నాటకలోని కలుబ రిగి, సేడెం, గదగ్, యాద్గిర్ ప్రాంతాలలో రూ. 5700-6600, మహారాష్ట్ర మార్కె ట్లలో రూ. 4500-6500, 

అకోలాలో పెసలు మోగర్ రూ. 8900-9000, జల్గాంవ్లో మధ్య ప్రదేశ్ పెసలు రూ. 6600, మహారాష్ట్ర నాణ్యమైన సరుకు రూ. 7100-7200, మీడియం రూ. 6700 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog