బొబ్బర్లు,ఉలవలు

   

15-02-2022

ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పొదిలిలో ప్రతి రోజు 500-600 బస్తాలు, గురుమిట్కల్లో 10-15 వాహనాలు బొబ్బర్ల రాబడిపై రూ.4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యారమై మహారాష్ట్ర కోసం రవాణా అవుతున్నది. రాయచోటిలో 2-3 వాహనాల బొబ్బర్ల రాబడిపై నలుపు సరుకు రూ. 5400, తెలుపు రూ. 4800, ఎరుపు నరుకు రూ. 5000, కర్ణాటకలోని మైసూరు, హగరిబొమ్మనహళ్లి, బళ్లారి ప్రాంతాలలో ప్రతి రోజు 50 వాహనాలు గులాబీ రకం రూ. 6000-6800, బళ్లారిలో ప్రతి రోజు 3-4 వాహనాలు రూ.6000-6800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 





ఉలువలు : కర్ణాటకలోని మైసూరులో ప్రతి రోజు 80 వాహనాల ఉలువల రాబడిపై ధర రూ. 100 వృద్ధి చెంది రూ. 3600-3700, బళ్లారి, చిత్రదుర్గ్ ప్రాంతాలలో 700-800 బస్తాలు రూ. 3350-3800 మరియు ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో వారంలో 5-6 వాహనాలు రూ. 3800 ధరతో వ్యాపారమై ఒంగోలు శీతల గిడ్డంగులలో నిల్వ చేసేందుకు రవాణా అవుతున్నది. సాలూరు, విజయనగరం ప్రాంతాలలో 10 టన్నులు రూ. 3550 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తాడేపల్లిగూడెం కోసం రవాణా అవుతున్నది. రాగులు: తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 8-10 వాహనాల రాగులు రాబడి అవుతున్నాయి. ఇందులో మహబూబ్నగర్లో 2-3 వాహనాలు రూ. 2800-3400 ధరతో వ్యాపారమై ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, బెంగుళూరు మరియు కర్ణాటకలోని మైసురు మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో ప్రతి రోజు 50 వాహనాలు మీడియం సరుకు రూ. 2450-2500 ధరతో వ్యాపారమై తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: మరియు పొరుగు రాష్ట్రాల కోసం రవాణా అవుతున్నది.

Comments

Popular posts from this blog

శనగలు ధరలు పెరిగే అవకాశం మృగ్యం

అలసందలు