మిరప సీజన్ త్వరగా సమాప్తమయ్యే అవకాశం

 


వ్యాపారస్తుల కథనం ప్రకారం ఆంధ్ర, కర్ణాటకలలో ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వలన ఉత్పత్తి భారీగా తగ్గడంతో సీజన్ ప్రారంభం నుండే ధరలు హెచ్చుముఖంలో ఉన్నాయి. దీనితో రైతులు వేగంగా సరుకు విక్రయిస్తున్నారు. ఈ సారి రెత్తులు కూడా సరుకు నిల్వలకు ఆసక్తిచూపడం లేదు. దీనితో సీజన్ త్వరగా సమాప్తమయ్యే అవకాశం కలదు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు మార్కెట్లో ప్రతి రోజు 1 లక్ష బస్తాలకు పెగ్డా సరుకు రాబడి అవుతున్నది. గుంటూరు యార్డులో గత వారం 5 రోజుల లావాదేవీలలో 4 లక్షల 80 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై , 4 లక్షల 50 వేల బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 30 నుండి 40 శాతం కంటే తక్కువగా డీలక్స్ రకాలు రాబడి కాగా, నాణ్యత లోపించడం వలన ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా అన్ని మీడియం, మీడియం బెస్ట్ రకాలు రూ. 800-1000, తేజ తాలుతో పాటు అన్ని రకాల తాలు కాయల ధరలు రూ. 500 తగ్గాయి. అయితే ఆర్థిక సంవత్సర ఖాతాల నిర్వహణ కారణంగా ఇతర రాష్ట్రాలకు డిమాండ్ కొరవడడంతో కొంతమేర సరుకు శీతలగిడ్డంగులకు నిల్వ కోసం చేరుతున్నది.



గుంటూరు మార్కెట్లో శీతలగిడ్డంగుల నుండి 75 వేల బస్తాల రాబడిపై 60 వేల బస్తాల సరుకు అమ్మకం కాగా, ఇందులో అన్ని డీలక్స్ రకాల ధరలు స్థిరంగా ఉండగా, నాణ్యమైన సరుకు కొరత కారణంగా శీతలగిడ్డంగులలో నిల్వ అయిన తేజ రకానికి మంచి డిమాండ్ నెలకొన్నది. లభించిన సమాచారం ప్రకారం 

ఖమ్మం కోల్డ్ స్టోరేజీలలో 12,89,700 బస్తాలు, 

వరంగల్లో 7-8 లక్షల బస్తాలు,

M కర్ణాటకలోని బ్యాడ్జీలో 18-19 లక్షల బస్తాలు,

 మధ్య ప్రదేశ్లోని బేడియాలో 3 లక్షల బస్తాల మిరప నిల్వలు ఉన్నట్లు సమాచారం. 

కాగా గుంటూరు ఎసిలలో ఈ ఏడాది నిల్వ చేసిన వారు అధిక లాభాలతో విక్రయించడం వలన సరుకు నిల్వల స్థితి స్పష్టంగా లేదు. విశ్వవ్యాప్తంగా భారతదేశం , ప్రముఖ మిరప ఎగుమతిదారుగా ఉంది. వరంగల్ మార్కెట్లో సీజన్ ప్రారంభంలో రూ. 27,000 ప్రతి క్వింటాలు ధరతో అమ్మకం అయ్యే పచ్చళ్ల తయారీలో ఉపయోగించే సింగల్పట్టీ రకం ధర పెరిగి రూ.45,000-48,000కు చేరింది. గుంటూరు మార్కెట్లో వరుసగా సోమవారం నుండి లక్ష బస్తాలకు పెగ్డా సరుకు రాబడి కాగా, తేజ డీలక్స్ రూ. 18,100-18,300,గరిష్టంగా రూ 18,500, బడిగ, సింజెంట బడిగ రకాలు రూ. 20,200-20,500 మరియు 341 రకం రూ. 17,000-21,500, భద్రాచలం డీలక్స్ రకం రూ.21,600-22,000 మరియు ఖమ్మంలో వరుసగా 30-35 వేల బస్తాల మిరప రాబడి కాగా, తేజ రకం రూ. 18,300, ఎసి సరుకు రూ. 18,000, తాలు రూ. 10,500 ధరతో రాబడి అయిన మొత్తం సరుకు చేతుల మీదనే అమ్మకం అవుతోంది. వ్యాపారస్తుల అంచనా ప్రకారం ఈ ఏడాది ఉత్పత్తి తగ్గడం మరియు చెనై తదితర దేశాల డిమాండ్ వలన భవిష్యత్తులో ధరలు 20-25 శాతం వృద్ధిచెందే అవకాశం కలదు. ఎగుమతి డిమాండ్ పెరిగితే ధరలు రికార్డు స్థాయికి చేరే అవకాశం కలదు. గుంటూరు నాణ్యమైన తేజ కొత్త సరుకు రూ. 15,000-18,000, డీలక్స్ రూ. 18,100-18,300, మీడియం రూ. 14,000–14,900, బడిగ–355 రూ. 15,000-20,500, సింజెంట బడిగ రూ. 15,000-20,000, డీలక్స్ రూ. 20,200-20,500, డిడి నాణ్యమైన సరుకు, రూ. 16,000-20,500, 341 రూ. 16,000-21,500, డీలక్స్ (భద్రాచలం) రూ. 21,600-22,000, దేశీవాలి (341 రకం) రూ. 17,000-22,500, 2043 రూ. 15,000-24,000, బుల్లెట్ రకం సరుకు రూ. 13,000–16,000, డీలక్స్ రూ. 16,200-16,500, నెంబర్-5 రూ.16,000-21,500, 334, సూపర్-10 రూ. 14,000-18,000, డీలక్స్ రూ. 18,100–18,300, 4884 రూ. 12,500–15,500, 273 రూ. 15,000-18,500, బంగారం రకం రూ. 13,500–17,000, డీలక్స్ రూ. 17,200-17,500, ఆర్మూర్ రకం రూ. 13,000-16,000, డీలక్స్ రూ. 16,100-16,200, రొమి రూ. 13,000-16,200, డీలక్స్ రూ. 16,300-16,500, 577 రకం రూ. 14,000-19,000, సీడ్ రకం మీడియం బెస్ట్ రూ. 13,000–15,500, తాలు కాయలు తేజ రూ. 10,000-10,800, డీలక్స్ లాల్కట్ రూ. 11,000-12,000, తాలు కాయలు రూ. 4500-8500, 341, డిడి తాలుకాయలు రూ. 9000–11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. గుంటూరు శీతల గిడ్డంగులలో నిల్వ అయిన నాణ్యమైన తేజ రకం రూ. 15,000–18,000, డీలక్స్ రూ. 18,100-18,200, మీడియం బెస్ట్ రూ. 13,500–14,900, 355 రకం రూ. 17,000-20,000, 334,సూపర్ 10 రకం రూ. 14,000-17,000, డీలక్స్ రూ. 17,200–17,500, మీడియం బెస్ట్ రూ. 12,500-13,900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని వరంగల్ గతవారం 1.55 లక్ష బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 15,000-17,300, 341 నాణ్యమైన సరుకు రూ. 18,000-22,000, వండర్ట్ సరుకు రూ. 19,000-24,000, 1048 రకం రూ. 15,000-17,500, దీపిక నాణ్యమైన సరుకు రూ. 20,000–23,500, 334 రూ. 15,000-17,500, టమాట నాణ్యమైన సరుకు రూ. 38,000-46,000, సింగిల్పట్టి నాణ్యమైన సరుకు రూ. 35,000-39,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. వరంగల్లో ఆర్థిక సంవత్సర ఖాతాల నిర్వహణ కారణంగా మార్చి 26 నుండి మార్చి 29 వరకు మార్కెట్ మూసి ఉండగలదు.


ఖమ్మంలో గత వారం 1.60 లక్షల బస్తాల కొత్త మిర్చి రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 18,400, మీడియం రూ.17,500-18,000, తాలుకాయలు నాణ్యమైన సరుకు రూ. 10,500 మరియు 8-9 వేల బస్తాల ఎసి సరుకు తేజ రూ. 18,000, తాలు కాయలు రూ. 10,500 మరియు కేసముద్రంలో దినసరి 1500-2000 బస్తాల రాబడి కాగా, తేజ రకం రూ. 8055-15,811, తాలు రూ. 9800-10,700, మహబూబాబాద్లో 5-6 వేల బస్తాల రాబడిపై తేజ రూ.17,500–18,000, నాణ్యమైన తాలు కాయలు రూ. 11,000-12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


హైదరాబాద్ గత వారం 35-40 వేల బస్తాల కొత్త సరుకు రాబడిపై తేజ నాణ్యమైన సరుకు రూ. 17,500–18,400, మీడియం రూ. 10,000–18,000, బడిగ డబ్బి నాణ్యమైన సరుకు రూ. 30,000-33,000, మీడియం రూ. 26,000–27,000, బడిగ రూ. 21,000-26,000, 273 మీడియం బెస్ట్ రూ. 16,000–18,000, నాణ్యమైన సరుకు 19,000, సూపర్-10 నాణ్యమైన రూ. 17,500, మీడియం రూ. 14,000–17,000, సింజెంట రకం 341 నాణ్యమైన సరుకు రూ. 19,000, మీడియం రూ. 16,000-18,000, సి-5 రూ 18,500, మీడియం రూ 15,000-18000, తాలు యలు నాణ్యమైన తేజ రూ. 9000-11,000, మీడియం రూ. 5000-8000, ఇతర రకాలు రూ. 4000-6000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో 15 వేల బస్తాల రాబడిపై తేజ రకం రూ. 17,500-18,500, తేజ తాలు కాయలు రూ. 9000-11,000 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని బ్యాడ్లీలో మంగళ, గురువారాలలో కలిసి 80-85 వేల బస్తాల కొత్త మిర్చి రాబడిపై డిబ్బి డీలక్స్ రూ. 30,000-34,000, నాణ్యమైన డబ్బి రూ. 27,000–31,000, కెడిఎల్ డీలక్స్ రూ. 25,000–28,500, నాణ్యమైన సరుకు రూ. 23,000-25,000, మీడియం రూ. 10,000-13,500, 2043 డీలక్స్ రూ. 25,500-28,500, మీడియం రూ. 20,000-24,500, 5531 నాణ్యమైన సరుకు రూ. 17,000-20,000, మీడియం రూ. 14,000-16,500, డిడి రూ. 15,500-18,500, 355 రూ. 15,000-18,500, సూపర్-10, 334 రూ. 13,500-17,000, తాలు కాయలు కెడిఎల్ రూ. 2400-2700, సీడ్ రకం రూ. 6000-9000 మరియు సింధనూరులో 18–20 వేల బస్తాల రాబడిపె డబ్బీ మిరప రూ. 35,000, బడిగ రకం రూ. 26,000–30,000, సింజెంట బడిగరూ. 18,000-24,500, 5531 రకం రూ. 18,000-21,200, తేజ రకం రూ. 15,000-20,500, జిటి రకం రూ. 14,000-18,500 మరియు తాలు రూ. 4000-9000 ధరతో వ్యాపారమెంది. కర్ణాటకలోని సింధనూర్, బళ్ళారి, రాయచూర్ తదితర కోల్డ్ స్టోరేజీలలో ఇంతవరకు 20-25 శాతం మిర్చి నిల్వలు ఉన్నట్లు సమాచారం.


మధ్యప్రదేశ్లోని బేడియాలో బుధవారం, గురువారాలలో కలిసి 15-20 వేల బస్తాల సరుకు రాబడిపై మహి ఫుల్ కట్ రూ. 12,000-16,000, తొడిమెతో రూ. 10,000-13,000, లాల్కట్ రూ. 9500-10,500, తొడిమతీసిన సరుకు తాలు కాయలు రూ. 9000-10,000, తొడిమెతో తాలు రూ. 8000-9000, ఇండోర్ ప్రతి రోజు 1500 బస్తాల కొత్త సరుకు రాబడిపె తొడిమె లేకుండా రూ. 13,500–14,800, తొడిమెతో రూ.12,500-13,500, మీడియం రూ. 9000-10,200, తాలుకాయలు సన్నరకం రూ.7000-9500 ధరతో వ్యాపారమెంది. బేడియాలోని శీతల గిడ్డంగులలో ఇంతవరకు 3 లక్షల బస్తాలకు పెగా కొత్త సరుకు నిల్వలు ఉన్నట్లు అంచనా.

 ఛత్తీస్గఢ్ ని జగదల్పూర్లో ప్రతి రోజు 3-4 వేల బస్తాల సరుకు రాబడిపై తేజ మరియు సన్-గ్రో రూ. 16,500-18,000, 4884 రూ. 15,000-16,000, తాలు కాయలు తేజ రూ. 9500–10,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. తమిళనాడులోని రామనాథపురంలో గత సోమవారం నాడు 1500-2000 బస్తాల కొత్త సరుకు రాబడిపే రూ. 30000 -32000, మీడియం రూ. 26000-28000, యావరేజ్ రూ. 24,000 -26,000 తాలు కాయలు రూ.4600-5000 ధరతో వ్యాపారమైంది.

 గత వారం గుంటూరు మార్కెట్లో 4.80 లక్షల బస్తాలు, కోల్డ్ స్టోరేజీల నుండి 75 వేల బస్తాలు, ఖమ్మంలో 1.60 లక్షల బస్తాలు, కోల్డ్ స్టోరేజీల నుండి 8-9 వేల బస్తాలు, వరంగల్ లో 1.55 లక్షల బస్తాలు, తెలంగాణ మార్కెట్లలో 65-70 వేల బస్తాలు, బ్యాడ్లీ, సింధనూర్లలో 1.10 లక్షల బస్తాలు, ఇతర మిర్చి మార్కెట్లలో 25-30 వేల బస్తాలు, నాగ్పూర్, పరిసర ప్రాంతాల మార్కెట్లలో 20-25 వేల బస్తాలు, మధ్యప్రదేశ్, ఛత్తీసడలో 35-40 వేల బస్తాల మిరప రాబడి కాగా, మొత్తం సరుకు అమ్మకం అయింది.

Comments

Popular posts from this blog