వేరుశనగ లో పెరుగుదలకు బ్రేక్

 

లబించిన సమాచారం ప్రకారం తెలంగాణలో వేరుశనగ రాబడులు తగ్గుముఖం పట్టాయి. గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, అచ్చంపేట, సూర్యపేట, తిరుమలగిరి, వరంగల్, కేసముద్రం మరియు పరిసర ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి దినసరి 35-40 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 5500-6700, మబబూబ్నగర్లో హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ చెన్నై డెలివరి రూ. 9650, 70-80 కౌంట్ రూ. 9700-9800, 60-70 కౌంట్ రూ.9900, 50-60 కౌంట్ రూ. 10,300, హైదరాబాద్ డెలివరి 10,000 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ జిల్లాలోని నరాలలో రాబడులు పెరిగి ప్రతి రోజు 15-20 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై 42 కిలోల బస్తా రూ. 2400-2500, హెచ్పీఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9200, చెన్నె డెలివరి రూ. 9600, 70-80 కౌంట్ చెన్నె డెలివరి రూ.9700, 60-70 కౌంట్ మహారాష్ట్ర డెలివరి రూ. 10,000 మరియు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాలలో గత వారం 1 లక్ష 52 వేల నుండి 2 లక్షల బస్తాల కొత్త సరుకు రాబడి అయింది. కళ్యాణ్ దుర్గ్, రాయదుర్గ్, మడకశిర ప్రాంతాలలో గత వారం 40-50 వేల బస్తాల రాబడి కాగా, రూ. 6000-6800, హెచ్పీఎస్ గింజలు 80-90 చెన్నై డెలివరి రూ. 9600, 70-80 కౌంట్ రూ. 9700, 60-70 కౌంట్ రూ. 9800-9900, మహారాష్ట్ర డెలివరి రూ. 10,000 మరియు కర్నూలులో వేరుసెనగ నూనె (ప్రతి 10 కిలోలు) రూ. 1570, గింజలు (240 కిలోలు) రూ. 19,800, పిండి రూ. 41,000 ప్రతి టన్ను ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కలిసి వారంలో 60-70 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 6200-6500, మీడియం రూ. 6000-6200, హెచ్పిఎస్ గింజలు 80-90 కౌంట్ రూ. 9000-9200, 90-100 కౌంట్ రూ. 9000, 60-70 కౌంట్ రూ. 9200-9300, 50-60 కౌంట్ రూ. 9600-9700, 50-55 కౌంట్ రూ. 9850, 40-60 కౌంట్ రూ. 10,000, 40-45 కౌంట్ రూ.10,150, 38-42 కౌంట్ రూ. 10, 200, కొత్త వా రకం 80-90 కౌంట్ రూ. 9300, 90-100 కౌంట్ రూ. 9100, 60-70 కౌంట్ రూ. 9400, 50-60 కౌంట్ రూ. 9800, రాజ్కోట్లో వేరుశనగ నూనె రూ. 1530-1550, జూనాగఢ్ రూ. 1500, పిండి రూ. 37,000 ధరతో వ్యాపారమైంది.


ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ, లలిత్పూర్ మరియు మధ్య ప్రదేశ్లోని శివపురి ప్రాంతాలలో 25 వేల బస్తాల సరుకు రాబడిపై 4900-5800, 60-70 కౌంట్ రూ. 8000-9000, 70-80 కౌంట్ వేరుసెనగ గింజలు ఈరోడ్ డెలివరి (జీఎస్టితో పాటు) రూ. 7500-8500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


రాజస్తాన్లోని బికనీర్, మెడతా, జైపూర్, జోధ్ పూర్, మహానీపూర్ మరియు పరిసర ప్రాంతాలలో కలిసి 20-30 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై స్థానికంగా రూ.5500-6200, హెచ్ పిఎస్ గింజలు 60-70 కౌంట్ రూ. 9300-9350, 50-60 కౌంట్ రూ. 9600-9650, 40-50 కౌంట్ రూ. 9850-9900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై తమిళనాడు కోసం రవాణా అయ్యింది .కర్ణాటకలోని బళ్లారి, చెల్లకేరి, చిత్రదుర్గ్, గదగ్, యాద్గిర్, రాయిచూర్ ప్రాంతాలలో కలిసి ప్రతి రోజు 40-50 వేల బస్తాల వేరుసెనగ రాబడిపై రూ. 500-6800, నిమ్ము సరుకు రూ. 4800-5000, చెల్లకేరిలో హెచ్పీఎస్ గింజలు కొత్త సరుకు 80-90 కౌంట్ ప్రత్యక్ష ధర రూ. 8900, 90-100 కౌంట్ రూ. 8750, ఎక్స్పోర్ట్ రకం 80-90 కౌంట్ రూ. 9100-9200, 90-100 కౌంట్ రూ. 8800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog