పత్తిలో మందకొడికి అవకాశం లేదు


 దేశంలో పత్తి సీజన్ దాదాపు సమాప్తమయింది. దీనితో రాబడులు తగ్గడంతో మరియు ఉత్పత్తి తగ్గడంతో ధరలు తగ్గడంలేదు. అంతేకాకుండా, భవిష్యత్తు ఉజ్వలంగా కనిపిస్తున్నది. పంజాబ్లో రాబోవు సీజన్ కోసం పత్తి విస్తీర్ణం ప్రస్తుత సీజన్తో పోలిస్తే పెరిగే అవకాశం కలదు మరియు సీజన్ ప్రారంభం నుండి రైతులకు మంచి లాభం చేకూరుతున్నది.


తెలంగాణాలోని ఉత్పాదక కేంద్రాలలో దినసరి 1800 బేళ్ల రాబడిపై వరంగల్ రూ.8500-9900, పత్తి గింజలు రూ.3300-3900, 29. మి.మీ. రూ. 79000-79500, 30 మి.మీ. రూ. 80000-81000 మరియు ఆంధ్రప్రదేశ్ ఉత్పాదక కేంద్రాలలో 1200-1500 బేళ్ల రాబడిపై రూ. 8500-10350, పత్తి గింజలు రూ. 3700-3950, గుంటూరులో 29 మి.మీ. రూ.7500-80000, ఆదోనిలో రూ.80000-81000 ధరతో వ్యాపారమయింది. గుజరాత్లో 20-25 వేల బేళ్ల రాబడిపై రూ. 8000-10250, పత్తి గింజలు రూ.4500-4700, బేలు ఎ గ్రేడ్ రూ. 76500-77500, బి గ్రేడ్ రూ. 75000-75500, మహారాష్ట్రలో 18-20 వేల బేళ్ల రాబడిపై అకోలా ప్రాంతంలో రూ. 8000-10000, పత్తి గింజలు రూ. 3400-3900, 29 మి.మీ. రూ.76000-77000, 28.5 మి.మీ. రూ. 75500-76000 మరియు కర్నాటకలో 1500 బేళ్ల రాబడిపై రూ. 76000-2000, పత్తి రూ. 9000-10200, పత్తి గింజలు రూ. 3500-4000, రాజస్తాన్లో 800-1000 బేళ్ల రాబడిపై రూ. 71000-72300, మీడియం రూ.68000-71800, పత్తి గింజలు రూ. 3500-3800 ధరతో వ్యాపారమయింది.

Comments

Popular posts from this blog

తగ్గిన పెసర విస్తీర్ణం