రంగు వెలుస్తున్న చింతపండు - క్షీణిస్తున్న ధరలు

 

దేశంలోని అన్ని ఉత్పాదక రాష్ట్రాలలో కొత్తచింతపండు రాబడులు పోటెత్తుతున్నందున ధరలు రూ. 1500-1800 మేర తగ్గాయి. ఎండల తీవ్రత కారణంగా కొన్ని ప్రాంతాలలో సరుకు రంగు వెలవడం ప్రారంభమైంది. స్టాకిస్టుల కొరతతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఆంధ్రలో ఒకవారంలో ఆంధ్రప్రదేశ్లో 320-330 వాహనాలు, కర్ణాటకలో 200 వాహనాలు మరియు తమిళనాడు 125 వాహనాలు, మహారాష్ట్రలోని అన్ని మార్కెట్లలో కలిసి గత వారం 15-20 వాహనాలు, తెలంగాణలో 15-20 వాహనాల సరుకు రాబడి అవుతున్నది. ధరలు తగ్గడంతో గత ఏడాది మిగులు నిల్వల విషయంలో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.


 ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్ మార్కెట్లో గత వారం 180-200 వాహనాల కొత్త చింతపండు రాబడిపై సిల్వర్ రకం రూ.15,000-25,000, మేలిమి రకం రూ. 11,000-13,000, మీడియం రూ. 9000- 10,500, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ.6500-7500, మీడియం రూ. 5500-6500, యావరేజ్ రూ. 4000-5500, రాయదుర్గి 6-7 వాహనాల రాబడిపై మేలిమి రకం రూ. 10,000–12,500, ప్లవరూ. 4000-6000, పుంగనూరు, మదనపల్లి ప్రాంతాలలో 70-80 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, మేలిమి రకం రూ. 10,000-12,000, చపాతీ రూ. 8000-9000, ఫ్లవర్ రూ.6000-7000, మీడియం రూ. 5500-6000, యావరేజ్ రూ. 4500-5000, గింజ సరుకు రూ. 2500-3200, విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో 10-12 వాహనాలు కొత్త సరుకు రాబడిపై సెమి ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కాకినాడ, రాజమండ్రి కోసం రవాణా అవుతున్నది మరియు మీడియం సరుకు తమిళనాడు డెలివరి రూ. 7000, యావరేజ్ రూ. 5700, నాణ్యమైన గింజ సరుకు రూ. 4000-4500, మీడియం రూ. 3000-3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

తెలంగాణలోని మహబూబ్ నగర్ మార్కెట్లో 700-800 బస్తాల రాబడిపై రూ. 3500-8200, షాద్నగర్లో 200-300 బస్తాల రాబడిపై రూ. 5600-7000, భువనగిరిలో 200-300 బస్తాల రాబడిపై రూ. 6000-9000, జనగాంలో 100-200 బస్తాల రాబడిపై రూ. 5000–7700, నవాబ్ పేట్లో 500 బస్తాల రాబడిపై రూ. 5000-7500, హెదరాబాద్ లో కోహిర్, మెదక్, జహీరాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్ ప్రాంతాల నుండి వారంలో 30-35 లారీలు, మహారాష్ట్ర నుండి 12-15 లారీల రాబడిపై ఫ్లవర్ రకం రూ. 6000-10,000, కర్ణాటక సరుకు రూ. 5500-6500, నాణ్యమైన సరుకు రూ.14,000-15,000, మేలిమి రకం రూ. 12,000–13,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చింతామణిలో గురువారం నాడు 12-15 లారీల చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 10,000-13,000, ఫ్లవర్ రూ. 6500-7000, మీడియం ఫ్లవర్ రూ. 5000-5500, గింజ సరుకు రూ.2900-3100 ధరతో వ్యాపారమె పుంగనూరు కోసం రవాణా అయింది. మహారాష్ట్రలోని బారీలో దినసరి 1500 బస్తాల కొత్త సరుకు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9000-14,000, మీడియం రూ.6500-7500, యావరేజ్ రూ. 6000-6500, లారీబిల్టీ డిబి రకం రూ. 7500, సన్రెస్ట్ రకం రూ.7200 ధరతో వ్యాపారమె ఆంధ్ర కోసం ఎగుమతి అయింది.

 అహ్మద్ నగర్లో 1000-1500 బస్తాల రాబడిపై నాణ్యమైన ఫ్లవర్ రూ. 7000-8000, మీడియం రూ. 6000-7000 ధరతో వ్యాపారమె గుజరాత్ కోసం రవాణా అయింది. కేరళలోని ఫాల్గట్లో గత వారం 1-2 వాహనాల కొత్త చింతపండు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 7000-8000, మీడియం రూ. 7000-7500, గింజ సరుకు రూ. 4000–5000 మరియు 

ఛత్తీస్గఢ్ లోని జగదల్పూర్లో 10-15 వాహనాల సరుకు రాపబడి కాగా, ఫ్లవర్ రూ. 7000-7200, గింజ సరుకు రూ. 2900-3100 ధరతో స్టాకిస్టులు విక్రయిస్తున్నారు. తుంకూరులో గత సోమ, గురువారాలలో కలిసి 100 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా సిల్వర్ రకం రూ. 18,000-20,000, మేలిమి రకం రూ. 11,000-14,000, మీడియం సరుకు రూ.8500-9000, ఫ్లవర్ రూ. 4000-6000, నలగ్గొట్టని చింతపండు రూ. 1700-2000, బెల్గాంలో గత బుధవారం 7-8 వాహనాల కొత్త చింతపండు రాబడిపై ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8000-11,000, మీడియం రూ. 6000-7500, యావరేజ్ సరుకు రూ.5000-6000, చెల్లకేరిలో వారంతపు సంతరోజు 35-40 వాహనాలు మేలిమి రకం రూ.9500-11,000, ఫ్లవర్ రూ. 6000-7000, మీడియం రూ. 4500-5750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో 20-25 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, గింజ సరుకు రూ. 2800-3200, మరియు 3-4 వాహనాల ఎసి సరుకు అమ్మకంపె మీడియం ఫ్లవర్ రూ.5500-6500, గింజ రకం రూ. 2500-2900, ఓం బ్రాండ్ రూ. 8500, ఉన్హేల్లో ఎసి రంగువెలిసిన గింజ సరకు రూ.2500-2800, రంగు సరుకు రూ.2600-2750 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


తమిళనాడులోని క్రిష్ణగిరిలో గత వారం 20 వాహనాల కొత్త చింతపండు రాబడిపై గింజ సరకు రూ.2500-2600, మీడియం రూ. 2100-2300, పాపరపట్టిలో 8-10 వాహనాల కొత్త సరుకు రాబడిపై మైసూరు చపాతి రకం రూ. 7200-7500, మహారాష్ట్ర సరుకు రూ. 7700, గింజ సరుకు రూ. 2500–2600, మెసూరు రకం 2000-2500, కర్ణాటక బోట్ రకం రూ. 1500-1700 మరియు సేలంలో 15-20 వాహనాల కొత్త చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 10,000-13,000, లోకల్ చపాతీ రూ. 8000, నడియాడ్ రకం రూ. 8000-8500, నాణ్యమైన ఫ్లవర్ రూ.7000-8000, మీడియం రూ. 5000-6000, గింజ సరుకు రూ. 2300-3000, నలగొట్టని చింతపండు రూ. 1800-2500, కంబం, ధర్మపురి, దిండిగల్ ప్రాంతాలలో 10-15 వాహనాల అమ్మకం కాగా, ఫ్లవర్ రూ.6500-7000, నాణ్యమైన గింజ సరుకు రూ. 20-2500, మీడియం రూ.2100-2200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. చింతగింజలు : తెలంగాణలోని మహబూబ్నగర్, నవాబ్పేట మరియు తదితర ప్రాంతాలలో దినసరి 2000-2500 బస్తాల చింతగింజల రాబడి కాగా, రూ. 1490-1500, సిద్దిపేటలో 4-5 వాహనాల రాబడి కాగా, రూ. 1475-1500, పప్పు రూ. 2750-2800, పౌడర్ రూ. 3300-3500 ధరతో వ్యాపారమైంది. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో 30-35 వాహనాలు, పుంగనూరులో 2-3 వాహనాల కొత్త చింతగింజల రాబడిపై ధర రూ. 1500, పప్పు సూరత్ డెలివరి రూ. 2800, బార్షీ డెలివరి రూ. 2650-2700, పౌడర్ రూ. 3200-3500, సాలూరులో 1-2 వాహనాల చింతగింజలు రూ. 1250, పుంగనూరు డెలివరి రూ. 1400-1425 ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని తుంకూరులో 10-15 వాహనాలు రూ. 1400, చెల్లకేరిలోని వారాంతపు సంతలో 800-1000 బస్తాలు చింతగింజలు రూ. 1400-1450, బెల్గాంవ్లో 3-4 వాహనాలు స్థానికంగా రూ. 1500, మహారాష్ట్రలోని బార్షీలో 1000 బస్తాలు రూ. 1500-1550, కర్ణాటక మిల్లు డెలివరి రూ. 1625, మహారాష్ట్ర సరుకు రూ. 1675, పప్పు రూ. 2600-2700, పౌడర్ రూ. 3200, నాణ్యమైన సరుకు రూ. 3400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog