మొదలైన చింతపండు స్తాకిస్టుల కొనుగోళ్లు

 

దేశంలో నాణ్యమైన సరుకు రాబడులు మార్చి నెలలో సమాప్తమయ్యే అవకాశం ఉన్నందున స్టాకిస్టులు కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. మహారాష్ట్రలోని బార్షీ మార్కెట్లో ప్రతి రోజు 800-1000 బస్తాల కొత్త చింతపండు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 9000-15,000, మీడియం రూ. 7500-8500, యావరేజ్ రూ. 6500-7000, లారీబిల్టీ రూ. 8200 మరియు అహ్మద్ నగర్ లో 600-700 బస్తాలు ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7500-8000, మీడియం రూ.6000-7500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్ కోసం రవాణా అవుతున్నది.


కేరళలోని ఫాల్గట్లో గత వారం 1-2 వాహనాల కొత్త చింతపండు రాబడిపై నాణ్యమైన సరుకు రూ. 8500-9000, మీడియం రూ. 8000-8500, గింజు సరుకు రూ. 5000-6000 మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 6-7 వాహనాల కొత్త సరుకు రాబడిపై ఫ్లవర్ రకం రూ. 7200, గింజ సరుకు రూ. 3000-3100 ధరతో వ్యాపారమైంది.


ఆంధ్రప్రదేశ్లోని హిందూపుర్ మార్కెట్లో గత వారం 150-170 వాహనాల కొత్త చింతపండు రాబడిపై సిల్వర్ రకం రూ. 20,000-27,000, మేలిమి రకం రూ. 12,000-17,000, మీడియం రూ.11,000- 13,000, యావరేజ్ రూ. 9000-10,000, ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 7500-8000, మీడియం రూ.6000-7000, యావరేజ్ రూ. 4000-6000, పుంగనూరు, పలమనేరు, మదనపల్లి ప్రాంతాలలో 50-60 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా, మేలిమి రకం రూ. 10,000-12,000, చపాతీ రూ. 9500-10,000, ఫ్లవర్ రూ. 6500-7000, గింజ సరుకు రూ. 2500-3300 మరియు విజయనగరం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలలో 18-20 వాహనాల కొత్త సరుకు రాబడిపై సెమి ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 10,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై కాకినాడ, రాజమండ్రి కోసం రవాణా అవుతున్నది మరియు మీడియం సరుకు తమిళనాడు డెలివరి రూ. 6200-6500, నాణ్యమైన గింజ సరుకు రూ. 4000-4500, మీడియం రూ. 3000–3200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


కర్ణాటకలోని చింతామణి మార్కెట్లో గురువారం 12-15 వాహనాల రాబడి కాగా, కరిపులి రూ. 10,000-13,000, ఫ్లవర్ రకం రూ. 6500-7000, మీడియం ఫ్లవర్ రకం రూ. 5000-5500, గింజ సరుకు రూ. 2900-3100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


తుంకూరులో గత సోమ, గురువారాలలో కలిసి 55-60 వాహనాల కొత్త సరుకు రాబడి కాగా సిల్వర్ రకం రూ. 20,000-25,000, మేలిమి రకం రూ. 17,000-18,000, మీడియం సరుకు రూ. 14,000-15,000, యావరేజ్ రూ. 10,000-11,000, ఫ్లవర్ రూ. 5500-7000, నలగ్గొట్టని చింతపండు రూ. 1900-2000, బెల్గాంలో గత బుధవారం 10 వాహనాల కొత్త చింతపండు రాబడిపై ఫ్లవర్ నాణ్యమైన సరుకు రూ. 8000-10,000, మీడియం రూ.6000-7000, యావరేజ్ సరుకు రూ. 5000-6000, చెల్లకేరిలో వారంతపు సంతరోజు 40-50 వాహనాల రాబడి కాగా, మేలిమి రకం రూ. 12,000–14,000, ఫ్లవర్ రూ. 6500-7000, మీడియం రూ. 5000-6300 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


మధ్య ప్రదేశ్లోని ఇండోర్ 5 వాహనాల ఎసి సరుకు అమ్మకంపై ఫ్లవర్ మీడియం రూ. 5500-6500, గింజ సరుకు రూ. 2500-2800, ఓం బ్రాండ్ రూ. 8500, తరానా, ఉన్హేల్లో 3 వాహనాల ఎసి సరుకు అమ్మకం కాగా, రంగువెలిసిన గింజ సరుకు రూ. 2600-2800, రంగు సరుకు రూ. 2500–2900 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై గుజరాత్, తమిళనాడు కోసం రవాణా అవుతున్నది.


తమిళనాడులోని క్రిష్ణగిరిలో గత వారం 7-8 వాహనాల కొత్త చింతపండు రాబడిపై గింజ సరకు రూ. 4600-4900, మీడియం రూ. 3000-3200, యావరేజ్ రూ.2500-2700, పాపరపట్టిలో 20-25 వాహనాల శీతలగిడ్డంగుల సరుకు అమ్మకంపై స్థానికంగా చపాతీ రూ. 7700, గింజ సరుకు రూ. 2500–2800, కర్ణాటక సరుకు రూ. 2000-2200 మరియు సేలంలో 20-25 వాహనాల కొత్త చింతపండు రాబడిపై మేలిమి రకం రూ. 10,000-13,000, మహారాష్ట్ర చపాతీ రూ. 8ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 8200-8500, ఫ్లవర్ రూ. 7000-9000, గింజ సరుకు రూ. 2800-3000, నలగొట్టని చింతపండు రూ. 1700-2000, కంబంలో 10-15 వాహనాలు, ధర్మపురి, దిండిగల్లలో 10 వాహనాల అమ్మకంపె ఫ్లవర్ రూ. 7000–8000, నాణ్యమైన గింజ సరుకు రూ. 3800-4000, మీడియం రూ. 2600–2800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.


చింతగింజలు : వ్యాపారస్తుల కథనం ప్రకారం ఈ ఏడాది చింతపండు ఉత్పత్తి తగ్గడంతో పాటు మొక్కజొన్న ధరలు పెరగడంతో చింతగింజలతో తయారయ్యే స్టార్చ్ కి డిమాండ్ ఉండగలదు. దీనితో భవిష్యత్తులో ధరల పెరుగుదలకు అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లోని హిందుపూర్ మార్కెట్లో గత వారం 10-15 వాహనాల కొత్త చింతగింజల రాబడిపై ధర రూ. 1450-1500, పప్పు సూరత్ డెలివరి రూ. 2700, బార్షీ డెలివరి రూ. 2650-2700, పౌడర్ రూ. 3200-3500, పుంగనూరులో చింతగింజలు రూ. 1500, పప్పు సూరత్ డెలీవరి రూ.2700, బార్షీ డెలివరి రూ. 2650-2700, పౌడర్ రూ. 3200-3300, సాలూరులో 5-6 వాహనాల చింతగింజలు రూ. 1200-1250, పుంగనూరు డెలివరి రూ. 1375–1400, సిద్దిపేటలో చింతగింజలు రూ. 1450-1475, పప్పు రూ. 2650-2700, పౌడర్ రూ.3400-3500, కర్ణాటకలోని తుంకూరులో 8-10 వాహనాలు రూ.1450, చెల్లకేరిలోని వారాంతపు సంతలో 1000-1200 బస్తాలు చింతగింజలు రూ. 1350-1400, బెల్గాంగ్లో 6-7 వాహనాలు స్థానికంగా రూ. 1350-1400, మహారాష్ట్రలోని బార్షీలో 500-600 బస్తాలు రూ. 1500-1550, పప్పు రూ. 2600-2650, పౌడర్ రూ. 3200, నాణ్యమైన సరుకు రూ. 3400 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog