కర్ణాటకలోని మైసూరు, కుష్టిగి, బాగల్ కోట్లలో ప్రతి రోజు 5-6 వాహనాల ఉలువల రాబడిపై ధర రూ. 3800-4000, మీడియం రూ. 3200–3600, బళ్లారిలో 200-300 బస్తాల కొత్త ఉలువల రాబడిపై రూ. a 3800-3900 మరియు
ఆంధ్రప్రదేశ్లోని రాయచోటిలో వారంలో 2-3 వాహనాలు రాబడి కాగా, స్థానికంగా నగదు కండీషన్ రూ. 3800, విజయవాడ, చల్లపల్లి డెలివరి రూ. 4200 ధరతో వ్యాపారమైంది. సాలూరు, చీపురుపల్లి ప్రాంతాలలో తెలుపు రకం సరుకు రూ. 3500, నలుపు రకం రూ. 4500, కదిరి, అనంతపురం, తాడిపత్రి, రాయదుర్గ్ ప్రాంతాలలో 2-3 లారీల రాబడిపై స్థానికంగా రూ. 3700-3800 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమై ఒంగోలు కోసం రవాణా అవుతున్నది. విజయనగరంలో దినసరి 5 వాహనాల కొత్త సరుకు రాబడిపై తెలుపు రకం రూ. 3800, నలుపు రకం రూ. 4000-4500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది.
09-01-2022 7, జనవరి వరకు దేశంలో రబీ పెసర విస్తీర్ణం 4.34 లక్షల హెక్టార్ల నుండి తగ్గి 2.67 లక్షల హెక్టార్లకు చేరింది. ఇందులో తమిళనాడు లో 32 వేల హెక్టార్లు మరియు ఒరిస్సాలో 3.31 లక్షల హెక్టార్లు తగ్గి 1.69 లక్షల హెక్టార్లకు చేరింది.
Comments
Post a Comment
ఈ పోస్టు చదివిన తరువాత మీ భావాలు,సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలుపగలరు