తమిళనాడు లో పెరుగుతున్న కొత్త నువ్వుల రాబడులు

 

గుజరాత్లో మార్చి 17 వరకు నువ్వుల పంట విస్తీర్ణం 17,300 హెక్టార్లు ఉంది. ప్రస్తుత ఖరీఫ్, రబీ సీజన్లలో రాబడులు తగ్గినపప్పటికీ, ధరలు మందకొడిగా ఉన్నాయి. ఎందుకనగా మనదేశం నుండి ఎగుమతి డిమాండ్ ఎక్కువగా పెరగడం లేదు. తమిళనాడులో కొత్త సరుకు రాబడులు ప్రారంభం అయ్యాయి. అంతేకాకుండా ఆంధ్రలో ఉత్పత్తి తగ్గినప్పటికీ, రెత్తులు తమ విక్రయిస్తున్నారు. తమిళనాడులోని విరుధాచలం, విల్లుపురం ప్రాంతాలూలలో 2000 బస్తాల కొత్త సరుకు రాబడి 80 కిలోల బస్తా 38 కిలో నూనె దిగుబడి కండీషన్ సరుకు త్రిచి, ఈరోడ్, రాజపాలయం డెలివరి రూ. 10,300, ఆంధ్ర సరుకు రూ. 8500-8600 (ప్రతి 75 కిలోలు) ధరతో వ్యాపారమైంది. ఈ సరుకులో 80 కిలోలకు 30-31 కిలోల నూనె దిగుబడి అవుతున్నది.


లభించిన సమాచారం ప్రకారం ఈ ఏడాది తమిళనాడు మిల్లర్లు ఎక్కువగా సరుకు నిల్వ చేయలేదు. తమ అవసరానికి అనుగుణంగానే సరుకు కొనుగోలు చేస్తున్నారు.

రాజస్తాన్లోని బికనీర్, కోటా, నోఖా, పాలి, శ్రీగంగానగర్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి ప్రతి రోజు 3-4 వేల బస్తాల తెల్లనువ్వులు మరియు 2 వేల బస్తాల గజ్జర్ నువ్వుల రాబడిపై తెల్లనువ్వులు కొత్త సరుకు 99.1 రూ. 10,500-10,600, 98.2 రకం సరుకు రూ.10,200-10,300, 95. 5 సరుకు రూ. 10,100 -10,200, గజ్జర్ నువ్వులు రూ. 9400-9500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 

మధ్య ప్రదేశ్లోని డబ్రా, ధతియా, గ్వాలియర్ మార్కెట్లలో హళ్లింగ్ సరుకు రూ. 10,700-10,800, ఆగ్రాలో 75 కిలోల బస్తా రూ. 8200 (జిఎస్టి సహా), మరియు కాన్పూర్లో రూ. 10,800-10,900, 99.1 సరుకు గుజరాత్ రకం రూ. 10,650-11,000, సార్టెక్స్ ముంద్రా డెలివరి రూ. 13,800, ముంబై డెలివరి రూ. 13,900 ధరతో వ్యాపారమె ఈరోడ్ కోసం ఎగుమతి అయింది. నీమచ్లో 700 బస్తాల కొత్త సరుకు రాబడిపై రూ. 9400-9600, మీడియం రూ.9000-9200, యావరేజ్ సరుకు రూ. 8500-8800 ధరతో వ్యాపారమైంది.


గుజరాత్లోని రాజ్కోట్, జునాగఢ్, అమ్రేలి మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లలో కలిసి గత వారం 3-4 వేల బస్తాల రాబడిపై నాణ్యమైన తెల్ల నువ్వులు రూ. 11,000-11,250, మీడియం రూ. 10,500-10,750, యావరేజ్ రూ. 10,500-10,750 మరియు 2 వేల బస్తాల నల్లనువ్వులు జడ్ బ్లాక్ రూ. 12,000-13,100, యావరేజ్ రూ. 10,000-11,500, క్రషింగ్ రకం రూ. 7000-8500 ప్రతిక్వింటాలు ధరతో వ్యాపారమైంది.

Comments

Popular posts from this blog